CSS Drop Down Menu

Wednesday, December 17, 2014

"పక్షుల"తో "ఆత్మాహుతి" దాడులు?

 
ఉగ్రవాదుల ఆలోచనలు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చేందుకు మహిళా మానవ బాంబు (ఆత్మాహుతి దళం)ను ఎల్టీటీఈ తయారు చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆత్మాహుతి దాడులు ఎక్కువగా ప్రాచూర్యం పొందాయి. ఈ తరహా దాడులతో అనేక మంది ప్రాణాలను తీవ్రవాదులు తీస్తున్నారు. 
 
కొందరు కరుడుగట్టిన ఉగ్రవాదులు ఆత్మాహుతి సభ్యులుగా మారి, తమను తాము బలి చేసుకుని మరెంతో మందిని బలి తీసుకోవడమే ఆత్మాహుతి దాడి. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉగ్రవాదులు కూడా తమ ఆలోచనా విధానానికి పదును పెడుతున్నారు. ఈ కోవలోనే తాలిబన్ తీవ్రవాదులు సరికొత్త ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 
 
కొన్ని జాతులకు చెందిన పక్షులను ఎన్నుకొని వాటికి చిన్నతనం నుంచి శిక్షణ ఇచ్చి వాటినే ఆత్మాహుతి బాంబర్లుగా ఉపయోగిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక పక్షిని కాల్చి చంపడంతో విషయమంతా బయటకు వచ్చింది. 
 
బైనాక్యులర్లతో ఫర్యాబ్ రాష్ట్రంలోని తుర్కమెనిస్థాన్ సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సైనికాధికారులకు ఎప్పుడూ చూడని ఓ వింత పక్షిని గుర్తించారు. అలాంటి పక్షులు తమ ప్రాంతంలో కనిపించవన్న అనుమానంతో, మరింతగా పరిశీలిస్తే కొన్ని వైర్లు కనపడ్డాయి. వెంటనే ఆ పక్షిని కాల్చి చంపారు. 
 
పక్షికి పేలుడు పదార్థాలతో కూడిన సంచిని, జీపీఎస్ ట్రాకర్‌ను, డిటొనేటర్‌ను కట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన 'ఆత్మహుతి జాకెట్'ను కూడా తొడిగారు. ఓ చిన్న కెమెరా కూడా ఉంది. దాడి చేసేందుకు సైన్యం దగ్గరకు అంత సులువుగా వెళ్ళలేమన్న కారణంతో, పక్షులనే తమ ఆత్మాహుతి దళంగా తాలిబన్లు మార్చుకున్నట్లు తెలుస్తోంది. 


0 comments:

Post a Comment