CSS Drop Down Menu
Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Monday, September 17, 2018

"బ్రౌన్ రైస్" తో బోలెడన్ని ప్రయోజనాలు !

వైట్‌ రైస్‌తో పోల్చితే బ్రౌన్‌రైస్‌లో మాంగనీస్‌, పాస్ఫరస్‌ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్‌ రోగులకు సాధారణ బియ్యంతో పోల్చితే బ్రౌన్‌రైస్‌తో చాలా మేలు జరుగుతుంది. వారంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు వైట్ రైస్ తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కానీ బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆ ముప్పు వుండదు. 

బ్రౌన్ రైస్‌లోని ఇనోసిటల్‌ హెక్సాఫాస్పేట్‌ ఉంటుంది. ఇది కేన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఇది కేన్సర్‌ను నిరోధించడంలోనే కాకుండా చికిత్సలోనూ ఉపయోగపడుతుంది. అలాగే జీవక్రియల పనితీరు మెరుగుపడటానికి అవసరమయ్యే థయామిన్‌ బ్రౌన్‌రైస్‌లో పుష్కలంగా లభిస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారు, బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్న వారు బ్రౌన్‌ రైస్‌ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఫోలసిన్‌ బ్రౌన్‌రైస్‌లో ఉంటుంది. శిశువుల్లో మెదడు ఎదుగుదల, వెన్నెముక ఎదుగుదల సరిగ్గా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. అందుకే గర్భిణిలు బ్రౌన్‌రైస్‌ తీసుకోవడం చాలా మంచిది. ఒక కప్పు బ్రౌన్‌రైస్‌లో రోజు తీసుకోవాల్సిన మెగ్నీషియం శాతంలో 21 శాతం లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మైగ్రేన్‌ సమస్యను అరికడుతుంది.


బ్రౌన్‌రైస్‌ను రోజులో ఒక సారి తీసుకున్నా సరిపోతుంది. అయితే నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశెకు బదులుగా అరకప్పు బ్రౌన్‌రైస్‌ను తీసుకోవచ్చు. లంచ్‌లో సాధారణ మీల్స్‌కు బదులుగా బ్రౌన్‌రైస్‌ పలావు తినవచ్చు. బ్రౌన్‌రైస్‌ను మష్రూమ్స్‌, వెజిటబుల్స్‌, చికెన్‌తో కలిపి తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Wednesday, September 5, 2018

శృంగార సమస్యలకు సులువైన చిట్కా !

పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి నిద్రకు ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్య తగ్గి శృంగార సామర్థ్యం పెరిగి, దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాకుండా సంభోగం తరువాత నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

Wednesday, June 13, 2018

డయాబెటిస్ రోగులకు దివ్యౌషధం "కొర్రబియ్యం"

సాధారణంగా మనం తినే బియ్యం తెల్లగా ఉంటే బాగా ఇష్టపడతాము. అందుకు గాను బియ్యాన్ని ఎక్కువుగా పాలీష్ చేయటం వలన దానిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. తద్వారా అనేర రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.



1. వీటిలో పీచుపదార్ధం ఎక్కువుగా ఉండటం వలన ఇది మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.

2. దీనిలో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్ అధికపాళ్లలో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు కొర్రబియ్యం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది.

3. ఉదర సంబంధ సమస్యలకు కొర్రబియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, అజీర్తి సమస్యలకు ఇది చక్కగా పని చేస్తుంది. జీర్ణ నాళాన్ని శుభ్రం చేయడంలో ఇది ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది.

4. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను కలిగించే గ్లుటెన్ కొర్రబియ్యంలో ఉండదు. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది.

5. కీళ్లనొప్పులను, జ్వరాన్ని తగ్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడుతుంది. స్త్రీలలో రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతుంది.

6. కొర్రలలో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కొర్రబియ్యం వండుకునే విధానం : ఒక గ్లాసు కొర్రలను శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీరు పోసి ఒక గంట నానబెట్టాలి. నానబెట్టిన కొర్రబియ్యాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఒకవేళ ఇలా తినలేకపోతే సగం బియ్యం, సగం కొర్రలు కలిపి వండుకోవచ్చు.

Friday, April 6, 2018

"శృంగార సామర్థ్యాన్ని" పెంచే సులువైన చిట్కాలు !

 యుక్త వయసులో ఉన్నవారికి మానసిక ఒత్తిడి, తీసుకునే ఆహారం వల్ల శృంగారంలో సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యను మనకు దొరికే కొన్ని వస్తువుల ద్వారా తగ్గించుకోవచ్చు. అవేంటంటే...

1. పొద్దుతిరుగుడు విత్తనాలు: ఈ విత్తనాలలో ఉండే జింక్ మగవారిలో వీర్యవృద్ధిని కలిగిస్తుంది. అంతేకాకుండా శృంగార వాంఛను కలుగజేస్తుంది.

2. కిస్‌మిస్ : వీటిని ఆవునెయ్యిలో వేయించి తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరగడంతో పాటు శృంగారం పట్ల కోరికను కలుగజేస్తుంది. ఇవే కాకుండా దానిమ్మ, అరటిపండు, మునగకాయ, మునగాకు, క్యారెట్, పుచ్చకాయ లాంటివి తరచుగా తీసుకోవడం వల్ల వీర్యకణాలు వృద్ధి చెంది శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దానిమ్మరసంలో కొంచెం నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగితే మంచిది. అల్లం రసంలో ఉప్పు కలిపి తాగాలి.

3. పుచ్చకాయలో సహజంగానే శృంగార పటుత్వాన్ని పెంచే లక్షణం ఉంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల శృంగార సమస్యలు తలెత్తవు. మునగపూలు భార్యాభర్తలిద్దరూ పాలల్లో కలుపుకుని తాగడం వల్ల శృంగార వాంఛ కలుగుతుంది. 

4. గుమ్మడి విత్తనాలు : ఇందులో బీటాకెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కాలరీలు అందిస్తుంది. కళ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-సి ఎక్కువగా లభిస్తుంది కనుక శృంగార సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. రోజువారి ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల శృంగార సమస్యను తగ్గించుకోవచ్చు.

Tuesday, March 6, 2018

నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా? అంటున్న ఏపీ ముఖ్యమంత్రి !

మంచిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా? బయట కాసేపు తిరిగి గట్టిగా అరిచి ఇంటికి వెళ్లి పడుకుంటే మంచిగా నిద్ర పడుతుందట. ఇంతకీ ఈ విషయం చెప్పింది ఎవరనుకుంటున్నారా...? ఎవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు  'పలకరింపు' పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాుడుతూ... ఎప్పుడూ ఇంట్లోనే ఉండకుండా రోజులో కాసేపు బయట తిరగాలని, ఆ సమయంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలని అన్నారు. అంతేకాదు...ప్రతి ఒక్కరూ కాసేపైనా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతోనే 'హ్యాపీ సండే' కార్యక్రమానికి రూపకల్పన చేశానని, రోడ్లపై డ్యాన్సులు వేస్తుంటే చూసి ఆనందింవచ్చని అన్నారు. బయటకు వచ్చి కాసేపు గట్టిగా అరచి ఆపై ఇంటికి వెళితే, ఉత్సాహంగా ఉంటుందని, రాత్రి పూట మంచిగా నిద్ర పడుతుందని చెప్పారు. బంగారం, వజ్రాలను ధరిస్తే ఆనందం రాదని, ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉన్నట్టేనని అన్నారు.


Wednesday, February 28, 2018

ఈ లక్షణాలు ఉంటే "కిడ్నీ" విషయంలో జాగ్రత్త పడాల్సిందే !

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయనే విషయం అందరికి తెలిసిందే. అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు మరియు ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్‌లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలా?

1. చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబంధం ఉన్నది. అందువల్ల మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి.

2. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి. దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది.

3. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం మరియు ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం మరియు వాంతులు వస్తాయి. ఇది రక్తంలో వ్యర్థాల ఫలితంగా జరుగుతుంది. ఈ వికారం ఆకలిని తగ్గిస్తుంది.

4. కిడ్నీలు ఎరిత్రోపయోటిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తాయి. అవి శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఆ ప్రభావం పడుతుంది. అలసట మరియు మెదడుకు సంబందించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భంలో రక్తహీనత వస్తుంది. కిడ్నీలు ఉండే వీపు భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలు చెడిపోయినప్పుడు కనపడే సాధారణ సంకేతం.






5. ఈ నొప్పితో పాటు కీడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లకు కూడా కారణమవుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనడానికి సంకేతమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Monday, February 12, 2018

"శృంగార సామర్ధ్యం" పెంచే సులువైన చిట్కా!

శృంగార సామర్ధ్యం పెంచే వాటిలో మునగకాయ ముఖ్యమైనదన్న విషయం తెలిసిందే. ఆడ, మగ ఇద్దరూ ప్రతిరోజు లేదా రెండు రోజులకొకసారైనా మునగకాయను, మునగాకుని కూరలాగా చేసుకుని తినడం వల్ల శృంగార విషయంలో మంచి ఫలితం ఉంటుంది. మునగ తరువాత శృంగార సామర్ధ్యాన్ని పెంచేది ఖర్జూరం. ఎండు ఖర్జూరం లేదా సాధారణ ఖర్జూరం ఏదైనా మనిషిలో అద్భుతాలను సృష్టిస్తాయి. మనిషి శరీరానికి సత్వరమైన శక్తిని ప్రసాదిస్తుందని డాక్టర్లు ఖర్జూరాన్ని తినమని సిఫారస్ చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు, నీరసంతో ఉన్నప్పుడు, రక్తం పెరుగుదలకు, రక్తప్రసరణ బాగా ఉండేందుకు ఖర్జూరం బాగా పని చేస్తుంది. 




ఎండు ఖర్జూరం లేదా సాధారణ ఖర్జూరం పండును తేనెలో రెండు గంటల పాటు నానబెట్టి ఆ తరువాత తింటే అద్బుతమైన శృంగార సామర్ధ్యం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తేనెలో నానాబెట్టి  తీసుకోవడం వల్ల వారం నుండి పది రోజుల్లో శీఘ్రస్కలనం సమస్యకు గుడ్ బై చెప్పి భాగస్వామికి సంతోషం కలిగించేలా శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని నిపుణులు ప్రయోగం చేసి నిరూపితం చేసినది. శృంగార సామర్ధ్యం పెంచుకోవడానికి లేనిపోని మందులు వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకునేకంటే ఖర్జూరం తినడం వల్ల సామర్ధ్యం పెరగడంతో పాటు ఆరోగ్యానికి అన్నివిధాల మంచిది.


  

Friday, February 9, 2018

"తక్కువ వయస్సు" ఉన్నవారిలా కనిపించాలని ఉందా? ఐతే ఇవి తినండి.

1. పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. మొలకల్లో ఎంజైములూ, యాంటీ ఆక్సిడెంట్లూ మరింత ఎక్కువగా లభ్యమవుతాయి. అందుకే ఇటీవల వీటిని చాలమంది మొలకెత్తించి తింటున్నారు. అయితే వీటిని మొలకల రూపంలోనో లేదా ఉడికించి... ఎలా తిన్నా కాలేయం, జుట్టు, గోళ్లు, కళ్ల ఆరోగ్యాన్ని పెంపొదిస్తాయని ఆయుర్వేదం పేర్కొంటుంది.



2. క్యాలరీలు తక్కువ పీచు ఎక్కువగా ఉండటంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లనిపిస్తుంది. ఫలితంగా ఊబకాయం తగ్గుతుంది. 

3. పెసల్ని క్రమంతప్పకుండా తినేవాళ్లు తమ నిజ వయసుకన్నా పదేళ్లు తక్కువుగా కనిపిస్తారు. ఎందుకంటే వీటిలో అధిక కాపర్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

4. అజీర్తి, జీవక్రియా లోపంతో బాధపడేవాళ్లకు పెసలు మందులా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. వీటిల్లోని క్యాల్షియం ఎముక నిర్మాణానికి దోహదపడుతుంది. సోడియం దంతాలు, చిగుళ్ల సమస్యల్నీ నివారిస్తుంది. బీపీ రోగులకు ఇవి మంచిదే. 

5. పెసల్లోని ఐరన్ వల్ల అన్ని అవయవాలకీ ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి... తదితర లోపాలతో బాధపడేవాళ్లకి ఇవి ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. వీటిల్లోని విటమిన్లు, హర్మోన్లను ప్రేరేపించడంతో పిల్లల్లో పెరుగుదలకి తోడ్పడతాయి.

Tuesday, January 16, 2018

మస్కిటో కాయిల్స్‌ను వెలిగిస్తున్నారా? ఐతే తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే !

ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటారు. కానీ ఇక్కడ దోమల చక్రం  వెలిగిస్తే ఆరోగ్యానికి మరింత హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. సిగరెట్లు కాల్చడం కన్నా ఒక మస్కిటో కాయిల్‌ను వెలిగిస్తే ఊపిరితిత్తులలోకి అది చొరబడి శ్వాసకోశ సంబంధింత వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయం కొంతమంది వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. 




శ్వాసకోస వ్యాధి ఒక్కటే కాదు నాడీ వ్యవస్థ దెబ్బతిని చివరకు కంటిచూపును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్స్‌ను వెలిగించడం కన్నా ఫ్యాన్ వేసుకుని దుప్పటి కట్టుకుని నిద్రించడం ఎంతో ఉత్తమమని వైద్య నిపుణులు చెపుతున్నారు. పిల్లలపై ఈ దోమల కాయిల్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

Wednesday, January 3, 2018

"చలికాలం"లో తీసుకోవాల్సిన ఆహారాలు?

చలికాలంలో జొన్నలు తినడం ద్వారా శరీరానికి పుష్కలమైన క్యాల్షియం లభిస్తుంది. దీనివల్ల కండరాలు బిగుసుపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో జొన్నతో చేసిన రొట్టె, జొన్నలతో చేసిన సంకటి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకున్నట్లేనని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అలాగే చలికాలంలో ఏర్పడే జలుబు, దగ్గును దూరం చేసుకోవాలంటే.. దానిమ్మను చలికాలంలో తినాలి. దానిమ్మ ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా దానిమ్మ రక్షణనిస్తుంది. చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల నివారణలో కూడా దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. చలికాలంలో వెచ్చదనం కోసం నువ్వులు తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సక్రమంగా వుంటుంది. ఇంకా నువ్వుల్లో వుండే ఐరన్, క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి.

చలికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు కంద గడ్డలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూర్చినవారవుతారు. కందగడ్డల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు వీటిని తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా చలికాలంలో వారానికి రెండుసార్లు పాలకూర తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చలికాలపు వ్యాధులను నివారించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండి.. రక్తం పెరగడానికి దోహద పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్
http://fkrt.it/kY0tHTuuuN

Saturday, December 9, 2017

పిజ్జా, బర్గర్ల కన్నా "సమోసా"లే మేలు ?

జంక్ ఫుడ్స్ అయిన పిజ్జాలు, బర్గర్లు వగైరా వగైరా ఆహార పదార్థాలను తినేవారిలో ఒబిసిటీ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు సైతం తప్పవని అంటున్నారు. అయితే సాయంత్రం పూట తీసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ల కంటే సమోసా బెటరని ఓ అధ్యయనంలో తేలింది.




అప్పుడప్పుడే నూనెలో వేయించే తాజా సమోసాలు ఆరోగ్యానికి మేలేనని సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిర్వ‌హించిన తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. బాడీ బార్డ‌ర్: లైఫ్‌స్టైల్ డిసీసెస్ పేరుతో విడుద‌ల చేసిన ఈ నివేదిక‌లో స్థూల‌కాయ‌త్వం, మాన‌సిక ఎదుగుద‌ల‌, కేన్స‌ర్‌, హృద్రోగాల వంటి రోగాల‌కు ఆహార‌పు అల‌వాట్లకు మ‌ధ్య సంబంధం వున్నట్లు పరిశోధకులు వివరించారు. 

బర్గర్ కంటే సమోసాల్లో రసాయనాలు తక్కువగా వుంటాయని పరిశోధకులు కనుగొన్నారు. బర్గర్లతో సాస్, చీజ్.. ఇతర ప్రిజర్వ్ చేసే ఆహార పదార్థాలుంటాయి. ఇవి ఒబిసిటీకి దారితీసే అవకాశాలు అధికంగా వున్నాయి. అయితే సమోసాలో వుండే ఆలూ, పిండి పదార్థాలు సహజమైనవని.. వాటితో ఆరోగ్యానికి కాస్త మేలే జరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. 

సమోసాల్లో వుండే గోధుమ పిండి, ఉడికించిన ఆలూ, పచ్చి బఠాణీలు, ఉప్పు, పచ్చిమిర్చి, కూరగాయలు, నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయని పరిశోధకులు తెలిపారు. 2016 సెప్టెంబర్ నుంచి మార్చి 2017 వరకు జరిగిన పరిశోధనలో 15 రాష్ట్రాలకు చెందిన 13వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 9-17 ఏళ్ల మధ్య గల విద్యార్థులపై ఈ పరిశోధన జరిపామని చెప్పారు. అధిక చక్కెర, ఉప్పు కలిగిన ప్యాకేజ్డ్ ఫుడ్, బేవరేజస్ వల్లనే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఈ పరిశోధనలో వెల్లడైనట్లు పరిశోధకులు వెల్లడించారు.


Thursday, December 7, 2017

భారతీయులకు వచ్ఛే ప్రాణాంతక జబ్బులకుగల కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు !

భారతీయులు వివిధ రకాల ప్రాణాంతక జబ్బుల బారినపడటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా, భారతీయ పౌరులతో పోల్చుకుంటే ఉత్తర అమెరికా, యూరప్ ప్రజలు ఎంతో బెటరంటున్నారు. దీనికి ప్రధాన కారణం భారతీయుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువట.. ఈ విషయంలో అమెరికా, యూరప్ ప్రజలే ఎంతో మేలట. 

ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలకు చెందినవారితో పోలిస్తే.. భారతీయుల ఊపిరితిత్తుల సామర్థ్యం 30 శాతం తక్కువగా ఉంటుందట. ఈ కారణంగానే మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం నుంచి భారతీయులు ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ విషయాలను సీఎస్ఐఆర్ (శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి)లోని జీనోమిక్స్‌, ఇంటిగ్రేటివ్‌ బయోలజీ విభాగం డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 

ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉండటం వెనుక.. జాతి, శారీరక శ్రమ, పోషకాహారం, పెంపకంలాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ విషయాలను అమెరికన్‌ థొరాసిక్‌ సొసైటీ వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. 

Tuesday, December 5, 2017

జీన్స్ ప్రియులా ? ఐతే జాగ్రత్త !

ఫ్యాషన్ పేరిట జీన్స్ వేసుకుంటున్నారా? కంఫర్ట్‌బుల్ కోసం వాటిని పదే పదే వాడుతున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. జీన్స్ వేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అయినప్పటికీ.. వాటితో ఏర్పడే అనారోగ్య సమస్యలను వింటే షాక్ కాక తప్పరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీన్స్ ఫ్యాంటులతో కాస్త జాగ్రత్తగా వుండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 





చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు బిగుతు జీన్స్‌ వేసుకుంటారు. వీటివల్ల ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు శరీరం లోపల నరాల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. రక్త ప్రసరణ సమస్యలు ఎదురవుతాయి. అలాగే జీన్స్ వేసుకుని కింద కూర్చోవడం కూడదు. కాళ్లు ముడుచుకుని కూర్చోవడం చేయకూడదు. 

జీన్స్ ప్యాంట్ వేసుకుని కాళ్లు ముడుచుకుని కూర్చోవడం ద్వారా కండరాలు, నరాలకు దెబ్బ తప్పదని.. అదే అలవాటుగా పెట్టుకుంటే నడవలేని పరిస్థితికి కూడా దారితీయవచ్చునని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాకుండా వ్యాయామం చేసే సమయంలో జీన్స్ వేసుకోవడం, జీన్స్ వేసుకుని స్క్వాటింగ్ చేయడం కూడా ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Saturday, December 2, 2017

భోజనం చేసిన వెంటనే"కూలింగ్ వాటర్"తాగుతున్నారా?

చాలా మందికి ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది భోజనం చేసిన వెంటనే చల్లని నీరు తాగుతుంటారు. ఇలా ఐస్ వాటర్ తాగడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 


ఒకవేళ ఖచ్చితంగా ఐస్ వాటర్ తాగాలని అనుకుంటే మాత్రం భోజనం చేశాక 20-30 నిమిషాల తర్వాత తాగడం మంచిదట. భోజనం చేసిన వెంటనే చల్లటినీరు తాగితే గుండెపోటు, కేన్సర్ వంటి వ్యాధులు దరిచేరే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, కొవ్వు ప్రేగుల్లో పేరుకుని పోతుందట. 

అదేసమయంలో భోజనం చేశాక గోరు వెచ్చటి నీరు తాగితే గుండెతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. పైగా, గోరు వెచ్చని నీరు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ చేరకుండా చేస్తుందట. 


Wednesday, November 29, 2017

పిల్లలు నిద్రలో పాస్ పోస్తున్నారా ?

పిల్లలు పక్క తడుపుతుంటే రాత్రి పూట ఖర్జూరాను చిన్న ముక్కలుగా చేసి పాలలో వేసి వేడి చేసి చల్లార్చి పిల్లలకు తాగించాలి. అలా చేస్తే ఖర్జూరాలోని ఆప్టాలిక్ యాసిడ్ జీర్ణక్రియను త్వరితం చేసి శరీరంలో ద్రవరూపంలోని మలినాలన్నీ త్వరగా మూత్రం ద్వారా పంపబడుతుంది. అంతకుముందే పూర్తిస్థాయిలో ద్రవరూపంలో మలినాలను పంపేశారు కాబట్టి రాత్రి నిద్రలో పోసుకోవడానికి ఇంకేమీ మిగిలి ఉండదు. పిల్లల్లో భయం, అభద్రతా భావం, ప్రేమ రాహిత్యం నరాల బలహీనత కారణంగా ఇది తలెత్తే అవకాశం వుందని చెబుతుంటారు. 



రాత్రి వేళల్లో వాష్ రూంకు పిల్లలు లేపితే విసుక్కోకుండా తీసుకెళ్ళాలి. ఒకసారి విసుక్కుంటే లేపినా విసుక్కుంటారని పక్కలోనే కానించేస్తారు. ఇంట్లో ఎక్కువగా గొడవలు లేకుండా చూసుకోవాలి. తరచూ గొడవలు అవుతుంటే పిల్లలు అభద్రతా భావానికి లోనవుతారు. పడుకునే ముందు ఖచ్చితంగా టాయ్‌లెట్‌కు వెళ్ళడం అలవాటు చేయాలి. మౌలికంగా పక్క తడపడం అనేది వ్యాధి కాదు. కాబట్టి దానికి మందులు వాడే అవకాశం తక్కువ.

Wednesday, November 8, 2017

"తేనెలో ఊరపెట్టిన ఉసిరికాయ"ను తింటే వచ్చే ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.

తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్తీక మాస కాలంలో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే  శరీరానికి ఎక్కువ పోషకాలు లభించడమే కాదు, దాంతో ఎన్నో అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. 



ఈ తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మంపై ఏర్పడిన ముడతలు తగ్గిపోతాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా కూడా మారుతుంది. 

ఈ చలి కాలంలో ఆస్తమా అనేది చాలా మందిని ఇబ్బందులు పెడుతుంది. సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేరు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే దాంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే తేనె, ఉసిరి మిశ్రమంలో ఉండే సహజ సిద్ధమైన పోషకాలు ఆస్తమాను దూరం చేస్తాయి. శ్వాసకోశ సమస్యలు రాకుండా చూస్తాయి.

తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. దీంతో ఈ మిశ్రమం వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి. చలికాలం మన జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. తిన్నది ఓ పట్టాన జీర్ణం కాదు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే ఆ సమస్య ఉండదు. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అంతేకాదు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. 

ఆకలి మందగించిన వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా మంచిది. దీంతో ఆకలి పెరుగుతుంది. అంతేకాదు, మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా సేవిస్తుంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీని వల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. ఇది స్థూలకాయం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది.

Tuesday, October 31, 2017

ఒక టేబుల్ స్పూన్ సోంపును అన్నం తిన్న తరువాత తింటే ?

సోంపుకు కొలెస్ట్రాల్‌కు ఉన్న లింకేంటి. సోంపు అంటే కొంతమంది ఇష్టపడతారు. మరికొంతమంది అసహ్యించుకుంటారు. ఇంట్లో గాని, రెస్టారెంట్‌లో గాని భోజనం తిన్న తరువాత సోంపును తినేవారు చాలామంది ఉంటారు. ఇది తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. 



సోంపు ఎంత ఎక్కువగా తింటే అంత కొవ్వు కరిగిపోతుంది. సోంపు అనేది భోజనం చేసిన తరువాత తినే స్వీట్ పదార్థం అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. సోంపు త్వరగా జీర్ణం చేసి క్రొవ్వును బాగా కరిగిస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఒక టేబుల్ స్పూన్ సోంపును అన్నం తిన్న తరువాత తింటే నోట్లో లాలాజలం ఉత్పత్పై ఎసిడిటి సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తీసుకున్న ఆహారంలో నీటి శాతాన్ని గ్రహించి మలబద్ధకంలో నివారిస్తుంది. 

సోంపును రెగ్యులర్‌గా వాడితే బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్ దరిచేరనివ్వద్దు. అధిక బరువును తగ్గిస్తుంది. రోజూ సోంపు పౌడర్‌ను నీళ్ళలో కలుపుకుని తాగితే బరువు బాగా తగ్గుతారు. సోంపును అధికంగా వాడితే అంత ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Friday, October 27, 2017

కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఈ చేపలను తినండి.

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్లను ఆరోగ్యంగా వుంచుతాయి. వారానికి కనీసం రెండు సార్లైనా చేపలను ఆహారంలో చేర్చుకుంటే కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు.






చేపలు తిననివారు బదులుగా ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు ఉండే అవిసెగింజలూ, బాదం, వాల్‌నట్లూ, పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని తీసుకోవాలి. విటమిన్‌ సి ఉండే పండ్లు తినడం కూడా తప్పనిసరే. చక్కెరశాతం తక్కువగా ఉండే పదార్థాలనే ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇక కీళ్ల నొప్పులకు అధికబరువు కూడా ఒక కారణమే. బరువు తగ్గించుకునేందుకు వ్యాయామం చేస్తూనే పండ్లూ, తాజా కూరగాయలూ, ఆకుకూరలూ, చిరు ధాన్యాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.


అలాగే యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండే సి.విటమిన్‌ ను తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్యను అదుపులో ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Wednesday, October 18, 2017

నీరసంగా వున్నారా? ఈ పండ్ల రసాన్ని తాగితే సరి !

నీరసంగా వున్నారా? ద్రాక్షపండ్ల రసాన్ని తాగేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్షపండ్లలో శరీరానికి కావాల్సిన కొన్ని పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదు గల పోషకాలు నీరసాన్ని దూరం చేస్తాయి. ద్రాక్ష రసం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే కార్పోహైడ్రేట్‌, సిట్రిక్‌ ఆసిడ్‌, ప్రోటీనులు, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ పండ్లనుగానీ, ఈ పండ్లతో తయారుచేసే రసాన్ని గానీ తరుచుగా తీసుకుంటే.. అనారోగ్య  సమస్యలను దూరం చేసుకోవచ్చు. 



ద్రాక్ష రసంలో కొద్దిగా పంచదార కలిపి పరిగడుపున తాగితే.. అల్సర్‌, పొట్ట రుగ్మతలు దూరమవుతాయి. ముఖ్యంగా నాలుగు పదులు నిండిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే.. రోజూ ద్రాక్షరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రోజూ ఈ పండ్లరసాన్ని తాగితే.. ఎముకలు, దంతాలు బలపడతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా వుంటుందని వారు సూచిస్తున్నారు.

Monday, October 16, 2017

"జామ చేసే మేలు" తెలిస్తే రోజూ తింటారు.

గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.





బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుంది. 

ప్రతిరోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చును. 

పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఇందులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆగుతుంది.

 పచ్చి జామకాయ ముక్కలను కప్పెడు తీసుకొని, బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైందవ లవణాన్ని వేసి మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టి పడడమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.

బాగా పండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలకు, గర్భిణులకు దీనిని టానిక్‌లా వాడవచ్చు.

 జామపండులో సి-విటమిన్ అధికంగా ఉండడంతో చర్మానికి మేలు చేస్తుంది. వీటితో పాటు జుట్టు రాలటాన్ని నివారిస్తుంది.

 విటమిన్-ఏ అధికంగా ఉండే జామపండుతో కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.