CSS Drop Down Menu

Friday, September 12, 2014

'సర్వరోగనివారిణి'..."మంచినీరు"

నీళ్లు...మంచినీళ్లు. ఉదయంపూట కాళీ కడుపుతో ఒక్క నాలుగు గ్లాసులు తెరిపిస్తూ సేవిస్తే చాలు. దాదాపు 30నుంచి 50రోగాలకు మనం దూరంగా వుండ గలుగుతాం. శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటుంది. ఈ విషయాన్ని ఎప్పటినుంచో ప్రతి ఒక్క డాక్టర్, రిసెర్చ్ ఎనలిస్టులు చెబుతున్న అంశమే కదా అని లైట్ తీసుకోకండి. తాజా సర్వేలో మరిన్ని ఆశ్చర్యకరమైన వివరాలు వెల్లడయ్యాయి. 

ఇప్పుడు జపాన్ నగరవాసులు మార్నింగ్ లేచిన వెంటనే ఓ నాలుగు గ్లాసుల నీళ్లు తాగిన తర్వాతనే ఆరోజును ప్రారంభిస్తున్నారు. దీంతో వారు తలనొప్పి నుంచి ఒళ్లునొప్పులు, గుండె, ఆస్తమా, టీబీ వరకు చాలావాటి నుంచి రక్షిస్తోందని అంటున్నారు.
ఎలా...ఎంత...ఎప్పుడెప్పుడు తాగాలంటే...

 1 ఉదయం లేచిన వెంటనే ఓ నాలుగు గ్లాసుల నీళ్లు

2 ఆ నీళ్లు తాగిన తర్వాత 45నిమిషాల వరకు ఏమీ తినకుండా వుండాలి.

3 ఆ తర్వాత ఏదైనా తినొచ్చు...తాగొచ్చు

4 బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత దాదాపు 2గంటలవరకు ఏమీ తినకూడదు, తాగకూడదు.

5 వయస్సు పెద్దబడిన వాళ్లు, పేషెంట్లు ఇలా చేయలేని పక్షంలో ఒక గ్లాసు నుంచి తాగడం మొదలుపెట్టి మెలమెల్లగా నాలుగు గ్లాసులకు పెంచుకోవాలి.

6 తద్వారా రోగాలకు దూరంగా వుంటూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా వుండొచ్చు.

 ఇంతకీ ఆ జబ్బుల వివరాలేంటో తెలుసుకోవాలనుందా?

 1 హై బ్లడ్ ప్రెషర్ -(నీళ్లు తాగిన 30రోజుల్లో కంట్రోల్‌ చేస్తుంది)

2 గ్యాస్‌ట్రిక్ (10రోజులు)

3 డయాబెటీస్ (30రోజులు)

4 మలబద్ధకం (10రోజులు)

5 టీబీ (90 రోజులు)

ఇవేకాకుండా...తలనొప్పి,ఒళ్లు, కీళ్లనొప్పులు, వేగంగా గుండె కొట్టుకోవడం, ఉబ్బసం, ఒబేసిటీ, ఆస్తమా, కిడ్నీ మరియు మూత్ర సమస్యలు, వాంతులు, పైల్స్, కంటికి సంబంధించిన వ్యాధులు, కేన్సర్ లాంటి ఎన్నో వ్యాధులను కేవలం ఉదయం ఓ నాలుగు గ్లాసుల మంచినీరు సేవించడం ద్వారా దూరంగా వుంచవచ్చు...జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.

0 comments:

Post a Comment