CSS Drop Down Menu

Monday, June 13, 2016

లైకుల కోసం ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

ఆకలేస్తే అన్నం తింటారు. కానీ ఓ యువతి మాత్రం ఆకలేస్తే ఇష్టమొచ్చిన వస్తువులన్నింటిని తినేయడంతో ఓ తల్లి భయబ్రాంతులకు గురైంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే... ఆ తల్లి కూతురు చేస్తున్న వింత పనికి డాక్టర్‌ని సంప్రదించాల్సింది పోయి పోలీసులకు ఫిర్యాదు చేసి వారితో దర్యాప్తు చేయించింది. అసలు ఎందుకు ఇలా చేస్తుందోనన్న నిజం తెలుసుకొని నివ్వెరపోయింది. 
 
ఆ వివరాలు పరిశీలిస్తే.. చైనాలోని ఒక అమ్మాయి బతికున్న చేపలను, వానపాములను, పాముల్లాంటి చేపలు తింటుంది. ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులను, ప్లాస్టిక్‌ని కరకర నమిలితినేస్తుంది. ఇంట్లో ఏ వస్తువు కనిపించినా వదలడం లేదు. దీంతో కంగారుపడిన ఆ యువతి తల్లి పోలీసులకు చెప్పి దర్యాప్తు చేయించింది. 
 
ఈ దర్యాప్తులో ఆ అమ్మాయికి ఒక ఆన్‌లైన్ ఖాతా ఉందని, చైనాకు చెందిన ఓ వీడియో యాప్ ద్వారా వాటిని ఆన్‌లైన్ లో పెట్టింది. ఆన్ లైన్‌లో హిట్స్ కొట్టాలన్న లక్ష్యంతోనే ఇలాంటి పనులు చేసిందని తేటతెల్లమైంది. ఆమె ఇలాంటి వింత పనులు చేయడం ద్వారా మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఒకేసారి ఆమె ఖాతాలో చేరిపోయారట. నిజంగా సోషియల్ మీడియాలో లైకుల కోసం యువత ఎలాంటి పనైనా చేయడానికి వెనుకాడరనేదానికి ఇదే ఉదాహరణ. 


0 comments:

Post a Comment