CSS Drop Down Menu

Thursday, April 17, 2014

ఇదెక్కడి?విచిత్రం!




మొన్నటి దాకా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ఉండి సీటు రాదని తెల్సిన తరువాత కోట్లకి సీట్లు అమ్ముకున్నారని మీడియాలో చెప్పి ఆతర్వాత బి.జె.పి.లో చేరారు  రఘురామ కృష్ణంరాజు గారు.

  బి.జె.పి.లో కూడా సీటు రాకపోయేసరికి ఖంగుతిని నర్సాపురం పార్లమెంటు  సీటుకి ఇండిపెండెంటుగా పోటీచేయడానికి సిద్దపడ్డారు. అంతవరకు బాగానేవుంది.ఆశ్చర్యంకొలిపే విషయం ఏమిటంటే? నామినేసన్ బి.జె.పి, తెలుగుదేశం రెండింటి తరపున వేసి అందరిని ఆశ్చర్యపడేటట్లు చేసారు. కొసమెరుపు ఏమిటంటే? మీడియా వాళ్ళు మీరే పార్టీ తరపున పోటీ చేస్తున్నారంటే?? నాపార్టీ తరపునే! అంటూ నర్మగర్భంగా చెప్పారు. 

ఇది చూసిన మిగతావాళ్ళు ఏం తెలివయ్యా బాబూ! ఈ సంగతి ముందే తెలిస్తే మేముకూడా రెండు, మూడు పార్టీల తరపున నామినేసన్లు వేసిపారేస్తే ఏదో ఒక పార్టీ సీటు ఇచ్చునని గొణుకుంటున్నారట.

0 comments:

Post a Comment