CSS Drop Down Menu

Wednesday, June 13, 2018

డయాబెటిస్ రోగులకు దివ్యౌషధం "కొర్రబియ్యం"

సాధారణంగా మనం తినే బియ్యం తెల్లగా ఉంటే బాగా ఇష్టపడతాము. అందుకు గాను బియ్యాన్ని ఎక్కువుగా పాలీష్ చేయటం వలన దానిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. తద్వారా అనేర రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.



1. వీటిలో పీచుపదార్ధం ఎక్కువుగా ఉండటం వలన ఇది మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.

2. దీనిలో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్ అధికపాళ్లలో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు కొర్రబియ్యం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది.

3. ఉదర సంబంధ సమస్యలకు కొర్రబియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, అజీర్తి సమస్యలకు ఇది చక్కగా పని చేస్తుంది. జీర్ణ నాళాన్ని శుభ్రం చేయడంలో ఇది ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది.

4. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను కలిగించే గ్లుటెన్ కొర్రబియ్యంలో ఉండదు. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది.

5. కీళ్లనొప్పులను, జ్వరాన్ని తగ్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడుతుంది. స్త్రీలలో రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతుంది.

6. కొర్రలలో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కొర్రబియ్యం వండుకునే విధానం : ఒక గ్లాసు కొర్రలను శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీరు పోసి ఒక గంట నానబెట్టాలి. నానబెట్టిన కొర్రబియ్యాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఒకవేళ ఇలా తినలేకపోతే సగం బియ్యం, సగం కొర్రలు కలిపి వండుకోవచ్చు.

0 comments:

Post a Comment