CSS Drop Down Menu

Wednesday, December 13, 2017

మగాళ్ళను మించిపోయిన మహిళలు ! ఏ విషయం లోనో తెలుసా?

సాధారణంగా అన్ని రంగాల్లో మగాళ్లు ముందుంటారు. కానీ, ఇటీవలికాలంలో పురుషులతో స్త్రీలు కూడా పోటీపడుతున్నారు. శృంగారం మొదలుకుని, మద్యం సేవించే విషయం వరకు మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మహిళలు నిరూపిస్తున్నారు. తాజాగా వెల్లడైన ఓ అధ్యయన ఫలితాలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆ రంగంలో మగాళ్ళ కంటే స్త్రీలే ఒక అడుగు ముందున్నారట. ఇంతకీ మహిళలు ఏ రంగంలో ముందున్నారనే కదా మీ సందేహం. మద్యం సేవించడంలో మగాళ్ళను స్త్రీలు మించిపోయారట. 


తాజాగా దేశంలో మద్యం తాగే మహిళల సంఖ్య పెరిగినట్టు జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడైంది. మందు తాగే మహిళలు ఎక్కువగా ఉన్న జాబితాలో 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం. సుమారు 10 యేళ్ల తర్వాత మద్యం తాగే మహిళల సంఖ్య 0.7 శాతానికి పెరగగా, మద్యం సేవించే పురుషుల శాతం 24.7 కు తగ్గినట్టు సర్వేలో వెల్లడైంది.

అంటే, గత 2005-2006వ సంవత్సరంలో మద్యం సేవించే మహిళల శాతం 0.4గా ఉండగా, ఇది 2015-2016 నాటికి వీరి శాతం 0.7 శాతానికి పెరిగింది. అదీకూడా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, గోవా, కేరళ, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళలు అధికంగా మద్యం సేవిస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది. 

అదేసమయంలో 2005-2006 లో మద్యం సేవించే పురుషుల శాతం 33.1 శాతంగా ఉండగా, 2015-2016 నాటికి  24.7 శాతానికి తగ్గిపోయిందనీ ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో తాగే మహిళల శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.. దేశ రాజధాని ఢిల్లీలో అయితే, మద్యం సేవించే మహిళలకు ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ కూడా ఉందట. ఆ యాప్‌కు 'శక్తి' అనే పేరు పెట్టినట్టు సమాచారం. 

0 comments:

Post a Comment