CSS Drop Down Menu

Saturday, February 25, 2017

"మీలో ఎవరు కోటీశ్వరుడు" షోపై "యండమూరి" సంచలన వ్యాఖ్యలు ?

మనసు ఏముందో అది మొహమాటం లేకుండా బయటకు చెప్పేయడం రచయిత యండమూరి వీరేంద్రనాధ్ అలవాటు. ఈ విషయంలో ఎవరేమన్నా ఆయన పెద్దగా పట్టించుకోరు. సొసైటీలో జరుగుతున్న దాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తారాయన. తాజాగా మీలో ఎవరు కోటీశ్వరుడి షోపై రచయిత యండమూరి వీరేంద్రనాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 కౌన్ బనేగా కరోడ్ పతి, మీలో ఎవరు కోటీశ్వరుడు బుల్లితెర షోలకు ఒకొక్కరి వద్ద 15 రూపాయలు చొప్పున 10 లక్షల మంది వద్ద వసూలు చేసి దాంతో కోటి 50 లక్షలు సంపాదించి, అందులో ఆరులక్షలు రూపాయలను మనకు పడేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దీనికన్నా లాటరీ టికెట్ కొనుక్కోవడం బెటరంటూ మనసులోని మాటను బయటపెట్టారు. ఆయన వ్యాఖ్యలను పెడర్ధాలు తీయడం కొంతమంది మొదలుపెట్టారు. చిరంజీవి ఆ షో చేయడంవల్లే ఆయన ఇలా అన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

0 comments:

Post a Comment