CSS Drop Down Menu

Tuesday, September 19, 2017

ఓ జంట "మూడేళ్ళ పాపను, 100 కోట్ల విలువైన ఆస్తి"ని వదిలేసి ఏం చేస్తున్నారో తెలుసా ?

మనుషుల్లో మరీ ఇంత వైరాగ్యమా? ముద్దులొలికే మూడేళ్ళ పాపను, 100 కోట్ల విలువైన ఆస్తిని వదిలేసి సన్యాసం తీసుకుంటున్నారు ఓ జంట. మధ్యప్రదేశ్‌లోని  నీముచ్‌లో వీరి వైనం దేశవ్యాప్త సంచలనమైంది.



జైన మతానికి చెందిన 35 ఏళ్ళ సుమీత్ రాథోడ్, అతని భార్య 34 ఏళ్ళ అనామిక ఇలాంటి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు తమ చిన్నారిని, వంద కోట్ల ఆస్తిని వదిలేసి జైన సన్యాసులుగా మారబోతున్నారు. సుమీత్ లండన్‌లో ఒకప్పుడు బిజినెస్ చేస్తే.. ఇంజనీర్ అయిన అనామిక కొంతకాలంపాటు ఓ మైనింగ్ సంస్థ బాధ్యతలు నిర్వర్తించింది.

కేవలం నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ఈ దంపతులు తమ సంసార జీవితానికి స్వస్తి చెప్పి.. సన్యాశ్రమం చేపట్టనున్నారు. ఈ నెల 23న సూరత్‌లో రాంలాల్ మహరాజ్ అనే జైన గురువు సమక్షంలో ఈ జంట సన్యాసం స్వీకరించబోతున్నారు. వీరి కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ నిర్ణయాన్ని ఆమోదించడం విశేషం.

0 comments:

Post a Comment