CSS Drop Down Menu

Thursday, December 7, 2017

భారతీయులకు వచ్ఛే ప్రాణాంతక జబ్బులకుగల కారణం కనిపెట్టిన శాస్త్రవేత్తలు !

భారతీయులు వివిధ రకాల ప్రాణాంతక జబ్బుల బారినపడటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా, భారతీయ పౌరులతో పోల్చుకుంటే ఉత్తర అమెరికా, యూరప్ ప్రజలు ఎంతో బెటరంటున్నారు. దీనికి ప్రధాన కారణం భారతీయుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువట.. ఈ విషయంలో అమెరికా, యూరప్ ప్రజలే ఎంతో మేలట. 

ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలకు చెందినవారితో పోలిస్తే.. భారతీయుల ఊపిరితిత్తుల సామర్థ్యం 30 శాతం తక్కువగా ఉంటుందట. ఈ కారణంగానే మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం నుంచి భారతీయులు ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ విషయాలను సీఎస్ఐఆర్ (శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి)లోని జీనోమిక్స్‌, ఇంటిగ్రేటివ్‌ బయోలజీ విభాగం డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 

ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉండటం వెనుక.. జాతి, శారీరక శ్రమ, పోషకాహారం, పెంపకంలాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ విషయాలను అమెరికన్‌ థొరాసిక్‌ సొసైటీ వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. 

0 comments:

Post a Comment