CSS Drop Down Menu

Wednesday, October 25, 2017

పెంపుడు జంతువులకు పన్ను చెల్లించాలంటున్న ప్రభుత్వం ! ఎక్కడో తెలుసా?

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం, ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే, పంజాబ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టింది. అయితే, ఈ రాష్ట్రంలో ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే పన్ను చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. 

ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది ఎవరో కాదు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ ఉత్తర్వుల మేరకు పిల్లి, కుక్క, పంది, గుర్రం, ఆవు, ఏనుగు, ఒంటె, బర్రె ఇలా ఏ పెంపుడు జంతువైనా ఇంట్లో ఉన్నట్టయితే పన్ను కట్టాల్సిందే. పంచాయతీలను మాత్రం ఈ పన్ను పరిధి నుంచి మినహాయించారు. జంతువులను బట్టి రూ.200 నుంచి రూ.500వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 

ఒకవేళ పన్ను కట్టకపోతే... మున్సిపల్ సిబ్బంది ఆ జంతువులను స్వాధీనం చేసుకుంటారు. అయితే, కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు కూడా పన్ను వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ పన్ను విధింపు ఉత్తర్వులపై పంజాబ్ రాష్ట్ర ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. 


0 comments:

Post a Comment