CSS Drop Down Menu

Thursday, October 19, 2017

టివి నటి రాత్రుళ్లు ఆ పని ఎందుకు చేస్తుందో తెలిస్తే ?

మలయాళ బుల్లితెర నటి కవితా లక్ష్మి పగలంతా నటిగా షూటింగ్‌ల్లో పనిచేస్తుంది. రాత్రైతే చాలు హోటల్ నడుపుతుంది. ఇందుకు కారణం ఆర్థిక కష్టాలే. సీరియల్స్ ద్వారా వచ్చే డబ్బు కుటుంబానికి సరిపోకపోవడంతో  అదనంగా సంపాదించేందుకు గాను రాత్రిపూట రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్ పెట్టుకుంది. ఇడ్లీ, దోసెలు వంటివి అమ్ముకుంటూ డబ్బు సంపాదించుకుంటోంది. 




మలయాళంలో సూపర్ హిట్ అయిన "స్త్రీధనం'' సీరియల్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న కవితా లక్ష్మీ తాను ఒంటరిగా ఉంటూ ఓ పాప, బాబును చూసుకుంటున్నానని మలయాళ ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కుమారుడిని పై చదువుల కోసం బ్రిటన్‌కు పంపానని అక్కడ అతడు పార్ట్‌టైమ్ జాబ్ చేసి ఉద్యోగం చేసి గంటకు పది పౌండ్లు సంపాదించవచ్చునని మధ్యవర్తులు చెప్పిన మాట నమ్మి మోసపోయానని చెప్పుకొచ్చింది. 

అందుకే ప్రస్తుతం కుమారుడి చదువులకు అవసరమయ్యే ఫీజులు పంపాల్సి వుందని తెలిపింది. అందువల్లే నటనతో పాటు హోటల్ నడుపుతున్నానని తెలిపింది. కాగా నెయ్యత్తికరా పరిధిలోని నిమ్స్ ఆస్పత్రి సమీపంలో వుందని వెల్లడించింది.

0 comments:

Post a Comment