CSS Drop Down Menu

Saturday, May 20, 2017

ఒక బిడ్డ చాలు ! రెండోబిడ్డ వద్దంటున్న ఉద్యోగినులు !! ఎందుకో తెలుసా ?

పిల్లల పెంపకం పట్ల నగరంలో జీవించే మహిళలు విముఖత చూపిస్తున్నారట. నగర భారతంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో 35 శాతం మంది మహిళలు.. పిల్లలను పెంచేందుకు.. వారితో వెచ్చించే సమయం, ఓపిక లేకపోవడంతో ఒకే సంతానంతో సరిపెట్టుకుంటున్నారని అసోచామ్ సర్వేలో తేలింది. అసోచామ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 500 మంది ఉద్యోగినులు రెండవ సంతానాన్ని కోరుకోవడం లేదని తెలియవచ్చింది. 



ఒక మెటర్నిటీ లీవ్ ఓకే కానీ రెండో మెటర్నిటీ లీవులు తీసుకుని తమ ఉద్యోగాన్ని, పదోన్నతిని పణంగా పెట్టలేమని ఉద్యోగినులు వాపోతున్నారు. ఉద్యోగం ఆవశ్యం కావడంతో పిల్లల పెంపకం ఆసక్తి చూపలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు చెప్తున్నారు. ఈ సర్వేను అహ్మదాబాద్‌, బెంగుళూర్‌, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, ఇండోర్‌, జైపూర్‌, కోల్‌కతా, లక్నో, ముంబయి వంటి పది నగరాల్లో నిర్వహించారు. 

ఉద్యోగంలో ఒత్తిడి, ఇంట్లో పని కారణాలతో చాలామంది తల్లులు ఒకే సంతానంతో సరిపెట్టుకోవాలని భావిస్తున్నారని సర్వే తేల్చింది. ఒకే సంతానం కలిగిన 1500 మంది పనిచేసే తల్లులను అసోచామ్‌ సర్వే పలుకరించింది. ఉద్యోగం, ఇల్లును సమన్వయం చేసుకుంటూ వస్తున్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో రెండో సంతానంపై దృష్టి పెట్టట్లేదని సర్వేలో తేలింది.

0 comments:

Post a Comment