CSS Drop Down Menu

Thursday, May 18, 2017

"అనసూయ" ఫై "ఆలీ" ఇబ్బందికర వ్యాఖ్యలు !

వైవిధ్యమైన పాత్రలతో, తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న సీనియర్ నటుడు ఆలీ ఇటీవల పలు వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. సినీ కార్యక్రమాలు, ప్రైవేటు ఈవెంట్లలో హీరోయిన్లు, యాంకర్లను టార్గెట్ చేసుకొని అలీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అలీ తీరును తప్పుపటినా నోటి దురుసును ఆపుకోవడం లేదనే వాదన వినిపిస్తున్నది. తాజాగా అనసూయను ఉద్దేశించి ఆలీ చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందికరంగా మారడం గమనార్హం.




ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌కు ఆలీ, అనసూయ హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈవెంట్‌లో పలువురిని వేదికపైకి జంటలుగా ఆహ్వానించారు. ఆ క్రమంలో వేదికపైకి పిలిచే వంతు రాజ్ తరుణ్‌కు రాగా అనసూయ ఆయనను ఆహ్వానించింది. చాలా సరదాగా ఉండే రాజ్ తరుణ్ ‘నాకు తోడు ఎవరు లేరా' అని కామెంట్ చేశారు. దాంతో అనసూయ స్వయంగా వేదిక తీగి రాజ్ తరుణ్‌ను తోడ్కొని వచ్చింది.

ఈ సంఘటనను చూసిన ఆలీ మరోసారి నోటికి పనిచెప్పాడు. వేదికపైకి వస్తున్న రాజ్ తరుణ్, అనసూయను ఉద్దేశించి ఆలీ కామెంట్ చేశాడు. ‘ఎవరు తోడు కావాలన్నా వెంటనే వెళ్లిపోతావా?‘ అని వ్యాఖ్యలు చేయడంతో అనసూయ షాక్ గురైంది. ఆ సమయంలో ఆ కామెంట్‌ను ఎంజాయ్ చేసినా.. ఆలీకి ఇంకా వెటకారం తగ్గలేదు అని అనుకోవడం జరిగిందట.










0 comments:

Post a Comment