CSS Drop Down Menu

Saturday, February 18, 2017

జయలలిత డెడ్ బాడీనే అపోలోకు వచ్చిందా ?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలున్నాయ్. ఆమె అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ముఖాన్ని కూడా చిన్నమ్మ ఎవ్వరినీ చూడనివ్వలేదు. అమ్మ అపోలోలో చేరే రోజు రాత్రి పూట ఆమెను మన్నార్ గుడి గ్యాంగ్ కొట్టి.. కిందకు తోసిందని.. ఆమె కిందపడిపోయారని.. ఆమెను పట్టుకునేందుకు ఒక్కరూ కూడా లేరని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు నిజమయ్యేలా అపోలో ఆస్పత్రి వైద్యురాలు రామసీత చెప్పిన నిజాలు ప్రస్తుతం సోషల్ మీడియాపై హల్ చల్ చేస్తున్నాయి. సదరు వీడియోలో అపోలో డాక్టర్ రామసీత.. షాకయ్యే నిజాలు వెల్లడించారు. 

అపోలోకు అమ్మ జయలలిత డెడ్ బాడీనే వచ్చిందని.. ఆమె నాడీ వ్యవస్థ పనిచేయలేదని చెప్పారు. 20 రోజుల ఆస్పత్రిలో ఉంచి.. ఆపై ఎంజీఆర్ సమాధి వద్ద అంత్యక్రియలు చేసే ఏర్పాట్లు జరిగిపోయాయని చెప్పారు. ప్రిజర్వేషన్ కోసమే అమ్మ ముఖంపై హోల్స్ చేశామని రామసీత తెలిపారు. ఈ వీడియో ఫిబ్రవరి పదో తేదీన అప్ లోడ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


0 comments:

Post a Comment