CSS Drop Down Menu

Friday, October 28, 2016

యజమానా మజాకా ! "దీపావళి బోనస్‌" గా ఏమిచ్చాడో తెలుసా ?

సాధారణంగా పండుగలకి ఉద్యోగులకి బోనస్ లు ప్రకటిస్తుంటారు. అయితే ఇచ్చే జీతంతోపాటు ఏదో ఒక వెయ్యో.. రెండు వేలో బోనస్ గా ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఓ యజమాని మాత్రం ఏకంగా... ఉద్యోగులకు 400 ఫ్లాట్లు.. 1200 కార్లు ఇచ్చాడు. వివరాల ప్రకారం... తన  కోసం తన కొడుకును నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని బయటకు పంపేసిన సూరత్ కోటీశ్వరుడు గుర్తున్నాడు కదూ. అతనే మన దేశంలో పేరుమోసిన వజ్రాల వ్యాపారి సావ్ జీ ఢోలాకియా. హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ అనే పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఢోలకియా.. ఈ ఏడాది తన వ్యాపార స్వర్ణోత్సవం సందర్భంగా దీపావళి బోనస్‌ల కోసం రూ. 51 కోట్లు వెచ్చించారు. తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు దీపావళి బహుమతిగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు ఇచ్చాడు. కాగా 2011 నుంచి ప్రతి ఏడాది ఈ రకంగా బోనస్ లు ఇవ్వడం ప్రారంభించారు ఆయన.



1 comment:

  1. అటువంటి యజమాని ఫోటో ఇంట్లో పెట్టుకు జీవితాంతం నమస్కారం చేసినా ఋణం తీరదు.

    ReplyDelete