CSS Drop Down Menu

Tuesday, April 19, 2016

"పూరి" పై దాడి !

‘లోఫర్’ మూవీ నష్టాలు దర్శకుడు పూరి జగన్నాథ్‌ని ఇబ్బందుల్లో నెట్టింది. ఈ మూవీ హక్కులు కొన్న తాము నష్టపోయామని, దీన్ని భర్తీ చేయాలంటూ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు ఆయన ఇంట్లో ప్రవేశించి ఆయనపై దాడి చేశారట. సుధీర్, ముత్యాల రామదాస్, అభిషేక్ అనే డిస్ట్రిబ్యూటర్లు మూడు రోజులక్రితం తన ఇంటికి వచ్చి తనే మీద దాడి చేశారని పూరి జగన్నాథ్ జూబిలీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని వాళ్ళు డిమాండ్ చేశారని, అయితే దేనితో తనకు సంబంధం లేదని, ఈ సినీ నిర్మాత సి.కళ్యాణ్‌ను కలుసుకోవలసిందిగా తాను కోరినా వినలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
 తను తీస్తున్న తాజా సినిమా హక్కులు తమకే ఇవ్వాలంటూ బెదిరించారని తెలిపాడు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని కూడా హెచ్చరించారన్నాడు. 2015 డిసెంబరు 17న ‘లోఫర్’ చిత్రం రిలీజయింది. ఈ సినిమా నైజాం, ఆంధ్ర, సీడెడ్ హక్కులను ఈ డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. కానీ బాక్సాఫీసు వద్ద మూవీ చతికిలబడడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ఇదిలాఉండగా పూరిపై దాడి చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. టాలీవుడ్‌లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది.

0 comments:

Post a Comment