CSS Drop Down Menu

Tuesday, April 26, 2016

రేష్ డ్రైవింగ్‌ చేసే వారి భరతం పట్టనున్న డిజిటల్ ఇండియా !

డిజిటల్ ఇండియాలో భాగంగా మోదీ గవర్నమెంట్ కొత్త స్కీం ప్రవేశపెట్టింది. జాతీయ రహదారులపైనేకాదు.. నార్మల్‌ రోడ్లపైనా రేష్ డ్రైవింగ్‌తో సామాన్యులకు వాహనదారులు ఇబ్బందిపెట్టిన, పెడుతున్న సందర్భాలు లేకపోలేదు. యాక్సిడెంట్స్ చేసి మరీ రయ్యనపోతున్నారు. ఇలాంటి వాటిని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పధకాన్ని ప్రారంభించింది.


 రేష్ డ్రైవింగ్ చేసినా, ట్రాఫిక్ రూల్స్ అధిగమించినా, యాక్సిడెంట్ చేసి వాహనం ఆపకుండా వెళ్లిపోయినా వివరాలు గతంలో తెలిసేవికావు.. దీనివల్ల బాధితుడు నానా ఇబ్బందిపడేవాడు. ఇలాంటివాటికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది కేంద్రం.

డిజిటల్ ఇండియాలో భాగంగా VAHAN  స్పేస్ వాహనం నెంబరు టైప్ చేసి ఈ నెంబర్‌కు 77382 99899 SMS‌కు పంపితేచాలు... వెంటనే కారు ఎవరిది? వెహికల్ ఎవరి పేరుమీద వుంది అన్న డిటేల్స్‌ని వెంటనే ఫోన్‌కి వస్తాయి. వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం బాధితుడికి మరింత సులువుకానుంది.

0 comments:

Post a Comment