CSS Drop Down Menu

Thursday, April 7, 2016

"39 మంది పెళ్ళాలతో కాపురం" చేస్తూ రికార్డు సృస్టించిన ఘనుడు ?

నిజంగా ఆడు మగాడ్రా బుజ్జీ..! అని మిజోరాం ప్రజలంటుంటే, ఒక్కరితోనే చస్తుంటే వీడెలా మెయిన్ టైన్ చేస్తున్నాడు..ఏమైనా పోటుగాడంటే వీడే అనేవాళ్లు బయటవాళ్లు. ఇంతకీ ఆ పోటుగాడు..మగాడు ఎవడనేగా మీ డౌట్. అతనెవరో కాదు మిజోరాం రాష్ట్రానికి చెందిన జియోనా.


ఇతనిలోని స్పెషాలిటీ ఏంటంటే, 39 మందిని పెళ్ళాడి వాళ్లతో సంసారం చేస్తూ 94 మంది పిల్లల్ని, 33 మంది మనమల్లు మనమరాళ్ళను కన్నాడీ మిజోరాం మొనగాడు. 71 ఏళ్ల జియోనా చినా పెద్ద భార్య జతియాంగికి 74 సంవత్సరాలు.. జియోనా కంటే ఆమె మూడేళ్లు పెద్దది. తన ఫ్యామిలీ మెంబర్స్ వసతి కోసం బక్త్వాంగ్ గ్రామంలో ఏకంగా 100 గదులతో నాలుగు అంతస్తుల హోటల్ లాంటి పెద్ద భవనాన్ని నిర్మించేశాడు జియోనా.


తమ భార్యలు, పిల్లతో కలిసి జియోనా కుమారులందరూ కూడా ఈ సౌధంలోనే ఉంటున్నారు. జియోనా కుటుంబంలో మగాళ్లంతా కార్పెంటింగ్ వృత్తిలో ఉన్నారు, తమ స్వంత ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ వీళ్ళు తమ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఉదయం పూట కనీసం ఐదారుగురు భార్యలు తన పక్కనే ఉండి సపరిచర్యలు చేయాలట కానీ.. రాత్రి మాత్రం అందరిలోకి చిన్న భార్యతో సరిపెట్టేసుకుంటాడట ఈ మహానుభావుడు.


కడుపు నిండా తినటం, ఒళ్ళు అలసిపోయేలా పనిచేయటం, ప్రతి రోజూ సంసార సుఖం తన ఆరోగ్య రహస్యం అని శలవిస్తున్నాడీ కలియుగ మన్మధుడు. బహుభార్యత్వం అమల్లో ఉన్న ఈ చైనా తెగలో ఎక్కువ మంది భార్యలుండటం వింతేమీ కానప్పటికీ 39 మంది పెళ్ళాలతో కాపురం చేయటంలో మాత్రం ఇతనిదే ప్రపంచ రికార్డు.

 

0 comments:

Post a Comment