CSS Drop Down Menu

Wednesday, March 16, 2016

"నాడు వైఎస్ చెప్పిందే నేడు నిజమైందన్న" మాజీ ప్రధాని మీడియా సలహాదారు!

కొందరి నేతల దూరదృష్టి ఎంత బాగుంటుందన్న విషయం తెలిసినప్పుడు విస్మయం కలగక మానదు. తాజాగా అలాంటి ఒక సంచలన విషయాన్ని బయటకు వెల్లడించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు. తాజాగా  హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన.. ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించారు.

2009 ఎన్నికల సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశమైన సందర్భంగా వైఎస్ తో పాటు తాను కూడా అక్కడే ఉన్నానని బారు చెప్పారు.  ఈ సందర్భంగా మన్మోహన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన అంశాన్ని తీసుకొచ్చారని.. ఎన్నికల్లో హామీ గురించి ప్రస్తావించినప్పుడు వైఎస్ స్పందిస్తూ.. అలా కానీ చేస్తే.. పార్టీకి నష్టం వాటిల్లటం ఖాయమని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణరాష్ట్ర ఏర్పాటుపై ఆంధ్రా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారని.. దాని వల్ల కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుందని.. తెలంగాణలో కేసీఆర్ కు ఓట్లు వేస్తారే తప్పించి.. కాంగ్రెస్ కు ఓట్లు వేయరన్న విషయాన్ని వైఎస్ చెప్పినట్లుగా చెప్పారు. నేటి పరిస్థితుల్ని చూస్తే.. నాడు వైఎస్ చేసిన విశ్లేషణ నిజమన్న విషయం స్పష్టమైందని సంజయ్ బారు వెల్లడించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు.. తెలంగాణ రాష్ట్రం కానీ ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టమన్న విషయాన్ని అప్పుడెప్పుడో వైఎస్ గుర్తిస్తే.. సోనియా మాత్రం ఏ మాత్రం అంచనా లేకుండా రాష్ట్రాన్ని ఇచ్చేసి పార్టీని బలి చేసిందన్న భావన కలగటం ఖాయం. చూస్తుంటే.. దేశాన్ని ఏలిక అమ్మకు.. వైఎస్ కంటే తక్కువ దూరదృష్టి అన్న విషయం సంజయ్ బారు మాటలు చెప్పకనే చెప్పినట్లు అవుతుంది కదూ.

0 comments:

Post a Comment