నేడు ప్రపంచంలో ఫేస్బుక్ ఓ వైరస్లా మారిపోయింది. రోజుకు కనీసం
ఒక్కసారైనా ఫేస్బుక్ ఓపెన్ చేయకుండా వుండనివారు కోట్లలో వున్నారు. దూరంగా
వున్నవారిని ఒకటి చేస్తే.. దీని కారణంగా విడిపోయినవాళ్లూ లేకపోలేదు. తాజాగా
ఉత్తరప్రదేశ్లో ఓ ఘటన వెలుగు చూసింది. ఫేస్బుక్ కారణంగా ఓ జంట
విడిపోయేందుకు సిద్ధమైంది. అసలు స్టోరీలోకి వెళ్తే.. యూపీలోని రాయ్ బరేలికి
చెందిన ఓ కపుల్ సంసారం హాయిగా సాగిపోతోంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మహా
ఇష్టం. ఐతే, ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా వుంటారు.
షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ కపుల్ ఫేస్బుక్లో ఫేక్ ఐడీలు క్రియేట్
చేసి వేర్వేరు పేర్లతో కొనసాగుతున్నారు. అనుకోకుండా ఈ ఫేక్ ఐడీలతోవున్న ఈ
జంట వాళ్లిద్దరికీ మధ్య రిలేషన్ ఏర్పడింది. ఇద్దరు మ్యారేజ్ కాలేదని
చెప్పుకున్నారు. మరింత దగ్గరయ్యారు. ఆర్నెళ్లు తర్వాత పెళ్లి చేసుకోవాలని ఓ
నిర్ణయానికి వచ్చేశారు. మంచిరోజు చూసుకుని ఇద్దరూ మీట్ అవ్వాలని డిసైడ్
అయ్యారు. తీరా కలిసేసరికి అసలు విషయం బయటపడింది. ఖంగుతిన్న ఆ
భార్యాభర్తలిద్దరు ఇంత జరిగాక కలిసి జీవించలేమని ఓ నిర్ణయానికి
వచ్చేశారు. విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. చూశారుగా
ఇలాంటి ఫేక్ ఐడీలు కాపురాలను ఎలా కూల్చుతాయో.. తస్మాత్ జాగ్రత్త!
0 comments:
Post a Comment