మెగాఫ్యామిలీలో ఒక న్యూస్ కలకలం
రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు వైసీపీలో చేరడానికి
రంగం సిద్దం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాన్
బీజేపీ-టీడీపీలకు మధ్యలో ఉన్నాడు. చిరంజీవి కాంగ్రెస్ ఎంపీగా
కొనసాగుతున్నారు. ఇప్పుడు మెగా బ్రదర్ నాగేంద్రబాబు వైసీపీలో చేరుతారని
ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. జబర్దస్త్ లో జడ్జిగా చేస్తున్న నాగబాబును తన
తో పాటు కోజడ్జిగా ఉన్న రోజా ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించారట. మంచి
భవిష్యత్ ఉంటుంది. వచ్చేసారి జగనే సీఎం అవుతారు.
మీకు అసెంబ్లీకి రావడం ఇష్టం లేకుంటే మీరు
కోరుకున్నదగ్గర్నుండి లోక్ సభకు పంపే బాధ్యత నాదిఅని ఆమె మధ్యవర్తిత్వం నడిపినట్లు సమాచారం.జగన్ కూడా నాగబాబు వస్తే సంతోషం. రెడీ గా ఉంటే నేనే
మాట్లాడుతా అని కూడా అన్నారట. అయితే ఇద్దరి సోదరులతో చర్చించి వైసీపీలో
చేరుతారని సమాచారం. వేరే ఏ పార్టీలో చేరినా తను సామాన్య నేతగానే
కొనసాగాల్సి ఉంటుంది. అదే వైసీపీలో మంచి పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చారట
జగన్. తన సోదరులతో ఒక మాట అని ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్. ఇటు
కాపు ఓట్లు కూడా నాగేంద్రబాబు చేరికతో కొంతైనా వస్తాయనే ఆలోచనలో జగన్
ఉన్నట్లు టాక్.
0 comments:
Post a Comment