హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయంటే ఫ్యాన్స్ భారీ హోర్డింగులు పెట్టి నానా
హంగామా చేయడం షరామామూలే! కానీ ఈ పిచ్చి మరింత ముదిరింది.. అందరిముందు
మేకలను బలిచ్చి, ఆ రక్తాన్ని ధియేటర్ల ముందు పోస్టర్స్పై జల్లుతున్నారు
పిచ్చి అభిమానులు. ఇలా చేస్తే ఆ సినిమా హిట్టవుతుందన్నది వాళ్ల నమ్మకమే
కావచ్చు.. కానీ బహిరంగంగా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పేనంటున్నారు జంతు
ప్రేమికులు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కడప జిల్లాలో జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ ‘నాన్నకు ప్రేమతో’ రిలీజ్ సమయంలో పులివెందులలోని
లక్ష్మి హాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు
ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇలాంటి చర్యను అత్యంత పాశవిక, ఆటవికంగా
పేర్కొంటున్నారు. ఈ యవ్వారంపై ఓ స్వచ్ఛంద సేవా సంస్థ లీగల్గా ప్రొసీడ్
అయ్యేందుకు రెడీ అవుతోంది.
గతంలో ‘బాహుబలి’ రిలీజ్ సమయంలో వికారాబాద్ పట్టణంలోనూ ఇలాగే జరిగింది.
ఇలా హీరోల సినిమాలు హిట్ కావడం కోసం మూగజీవాలు బలివ్వడం ఏంటని
ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు ‘బాహుబలి’కే పరిమితమైన ఈ ఒరవడి.. ఇప్పుడు
‘నాన్నకు ప్రేమతో’ వరకు వచ్చింది. రేపటి రోజున మిగతా హీరోల ఫ్యాన్స్ వీటికి
ఫుల్స్టాప్ పెడతారా? లేదా? అనేది చూడాలి. వీటిపై హీరోలు
స్పందించకపోవడాన్ని జంతుప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
0 comments:
Post a Comment