తన భార్య కన్నె తనాన్ని నాశనం చేసిన ఓ రేపిస్ట్ మర్మావయాలను కోసి కూర వండుకు తింటే గాని అతగాడి గుండె మంట చల్లారలేదు.షాక్ పుట్టించే ఈ సంఘటన రెండు నెలల కిందట ఇండోనేషియాలోని లాంపంగ్ లో
జరిగింది. వివరాల్లోకి వెళితే.. అతని పేరు రూడీ ఎఫెండీ.. ఉండేది
జకార్తాలో..30 ఏళ్ల రూడీకి పెళ్లయింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. పెళ్ళయిన
తరువాత మామూలుగా జరిగే తొలిరాత్రి నాడు తన భార్య కన్య కాదని
తెలుసుకున్నాడు. పట్టరాని కోపం తెచ్చుకున్నాడు.సంభాళించుకున్నాడు. భార్య నూరియాను అనునయించి అసలు విషయం చెప్పమన్నాడు.
దీంతో నూరియా తను డేటింగ్ చేసిన ఫ్రెండ్ తోనే అత్యాచారానికి గురయ్యానని
చెప్పింది. ఇది విన్న ఎఫెండి మనసులో క్రూరమైన ప్లాన్ రెడీ అయిపోయింది. సరే
.. జరిగిందేదో జరిగింది. అతనితో మాట్లాడాలి. ఒక్కసారి రమ్మనమని భార్య
నూరియాతో చెప్పాడు. ఆమె మాట విని తన మాజీ ప్రియుడు నూరియా తో మాట్లాడేందుకు
ఇంటికి వచ్చాడు. అతను రావడమే ఆలస్యం.. ఎఫెండీ ఆ మాజీ ప్రియుణ్ని కత్తితో
కసిదీరా చనిపోయిన దాకా పొడిచాడు. ఆ తరువాత అతన్ని తగులబెట్టాడు. ఈ
దారుణానికి ఒడిగట్టే ముందు ఎఫెండీ ఆ వ్యక్తి ప్రవేట్ పార్ట్ ను కోసివేసి
రాత్రికి కూర వండమని భార్యకు చెప్పాడు. పైగా తనతో బాటు భార్యను కూడా
తినమన్నాడు. అలా చేస్తేనే కానీ తన కోపం చల్లారదని చెప్పాడట ఎఫెండీ.
అదీ విషయం.
ఇంత దారుణమా సర్?
ReplyDeletehttp://www.alltechbook.net/