CSS Drop Down Menu

Monday, August 31, 2015

"అవాంచిత సెక్స్‌కు దారితీస్తున్న మహిళల మద్య సేవనం"

మారుతున్న కాలంతో పాటు యువతీ యువకుల పోకడలు కూడా విపరీతంగా మారిపోతున్నాయి. దీంతో అనేక చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఇలాంటి వాటిలో మద్యపానం ఒకటి. అయితే, యువతులు మద్యపానం చేయడం వల్ల అనేక సమస్యలకు లోనవుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఊహించని, అనాలోచిత, అనారక్షిత శృంగారానికి మద్య సేవనం ప్రేరేపిస్తున్నట్టు తేలింది.

సుఖవ్యాధులకు చికిత్స చేసే బల్టీమోర్ క్లినిక్‌కు వచ్చిన 20 మంది ఆఫ్రికన్ - అమెరికన్ మహిళల వద్ద లోతైన అధ్యయనం చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా ఆరు నెలలుగా మద్యం సేవిస్తున్నవారు, ఆల్కహాల్ ప్రభావం కారణంగా సెక్స్‌లో పాల్గొన్నవారు ఉన్నారు. మద్యం సేవించిన మహిళల్లో ప్రధానంగా ఐదు ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి. 
 
వాటిలో కొత్తకొత్త భాగస్వాములతో సంభోగంలో పాల్గొనడం, ప్రత్యామ్నాయ శృంగార చర్యలు, యానల్ సెక్స్, మొరటు శృంగారం, అనారక్షిత శృంగారం, అత్యాచారం వంటి సంఘటనలు జరుగుతున్నట్టు తేలింది. ఈ అధ్యయనం నివేదికను ఉమెన్స్ హెల్త్ సంచికలో ప్రచురించారు.
 


Saturday, August 29, 2015

"కొండపైకి కారును లాక్కేల్లే" అయస్కాంతం కొండ ?

అయస్కాంత పర్వతం ఇదొక వివరించ సాధ్యం కాని అద్భుతం. సాధారణంగా కొండపైకి ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఆ కొండ మీదకు రోడ్డు వేసి కారులో వెళ్లమన్నా కారు నెమ్మదిగా పైకి వెళుతుంది. ఎంతో ఇంధనం వృధా అవుతుంది. 

కాశ్మీర్‌ లోని లడక్‌ ప్రాంతంలో లేహ్ సమీపంలో ఉన్న ఈ కొండ మాత్రం మిగిలిన కొండల్లాగా కాదు. తన దగ్గరకు వచ్చే వారిని ఎంతో ఆప్యాయంగా పలుకరించి, తనే స్వయంగా తీసుకువెళ్లిపోతుంది. అంటే, ఈ కొండ మీదకు కారులో వెళ్లాలనుకునేవారు హాయిగా ఇంజన్‌ను ఆఫ్‌ చేసి స్టీరింగ్‌ పట్టుకుని కూర్చుంటే చాలు. ఇనుపముక్కను అయస్కాంతం ఆకర్షించినట్లు కారును పైకి లాక్కుంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన అయస్కాంత తత్వమున్న ఈ కొండపైకి వెళ్లేవారు దీనిలోని అయస్కాంత శక్తికి అబ్బురపోతారు.


Friday, August 28, 2015

రాశిఖన్నాడ్రెస్సింగ్ పై "అలీ డబుల్ మీనింగ్ డైలాగులు" !

టాలీవుడ్ హాస్య నటుడు అలీ ఏదైనా సినిమా వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడంటే చాలు ఎవరో ఒక సెలబ్రిటీపై డబుల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బంది పెట్టడం ఖాయం. యాంకర్ సుమ, శ్యామలతో పాటు హీరోయిన్ సమంత వంటి వారు చాలామంది అలీ బాధితులుగా చెప్పుకోవచ్చును. ఇప్పుడు ఆ జాభితాలోకి మరో హీరోయిన్ చేరింది. రాశిఖన్నాపై తాజాగా అలీ చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల మాటీవీ సినిమా అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది, ఆ వేడుకకు అలీ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు చాలామంది పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది హీరోయిన్లు హాట్ గా తయారయి వచ్చారు. వారందరిలో రాశిఖన్నా వేసుకొచ్చిన గౌను హాట్ టాపిక్ అయింది. అది కాస్త అలీ దృష్టిలో పడడంతో వెంటనే రాశిఖన్నాపై సెటైర్లు వేశాడు అలీ. ఆ సెటైర్లలో డబుల్ మీనింగ్ వచ్చేలా ఆ అవార్డు ఫంక్షన్ కు వచ్చిన వారంతా అలీ మాటలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

రాశిఖన్నా గౌను పై కామెంట్ చేస్తూ అలీ….’ఈసారి ఇటువంటి పెద్ద ఫంక్షన్స్ కు వచ్చేటప్పుడు ఇలాంటి గౌనులు వేసుకోచ్చేటప్పుడు నా సేవలు ఉపయోగించుకో గౌను ఎత్తి పట్టుకొని నీకూడ నడిచి వస్తూ నీకు సహాయం చేస్తాను’ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు అలీ. అంతేకాదు రాశిఖన్నా డ్రస్ ని చూస్తూ ఉంటె స్వచ్చ భారత్ కార్యక్రమానికి రాశి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతుందా అనే అనుమానం వస్తుంది అన్నాడు .

Thursday, August 27, 2015

"సుఖాల"నే కాదు ! "జబ్బుల్ని" కూడా ఇచ్చే "డబ్బు" ?

ఇది నిజంగా షాకింగ్ న్యూసే. కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొస్తాయంటే నమ్మబుద్దికాదు కానీ, ఇది జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికారక మైక్రో ఆర్గానిజమ్స్ డజన్లకొద్దీ కరెన్సీ నోట్లను అంటిపెట్టుకుని ఉంటాయట. రూ. 10, రూ. 20, రూ. 100 కరెన్సీ నోట్లపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు ఢిల్లీకి చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. ఈ కరెన్సీ నోట్ల కారణంగా సుమారు 78 వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ గుర్తించింది. 
 
వీటిలో చాలామటుకు ఫంగై, బ్యాక్టీరియా కారక రూపంలో నోట్లను అంటిపెట్టుకుని ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. వీటి ఫలితంగా డీసెంట్రీ, ట్యుబర్కులోసిస్, అల్సర్లు కూడా వచ్చే అవకాశం లేకపోలేదని చెపుతున్నారు. ఈ కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొచ్చే వాహకాలుగా కూడా పనిచేసే అవకాశం ఉందని చెపుతున్నారు. 

Wednesday, August 26, 2015

నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే ?

కొందరు నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్లు ఎన్నిసార్లు బ్రష్ చేసినా నోటి దుర్వాస తగ్గదు. అలావంటి వారు తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. వారు ముఖ్యంగా వెల్లుల్లిని దూరంగా ఉంచాలి. ఇందులో ఉన్న సల్ఫర్ కారణంగా నోటి నుంచి, శరీరం నుంచి దుర్వాస వస్తుంది. కనుక వెల్లుల్లిని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి.
 
నోటి నుంచి దుర్వాసన రావడానికి పాలు కూడా ఒక కారణమే అంటున్నారు వైద్య నిపుణులు. పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీటితో పాటు ఇందులో బ్యాక్టీరియా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి ఎక్కువ మందికి పడవు. ఇవి పొట్టలో సల్ఫర్ కాంపౌడ్స్‌ని విడుదల చేస్తాయి. ఇవి దుర్వాసనకు కారణమవుతాయి.

కనుక నోటి దుర్వాసన సమస్య ఉన్న వారు వీటి జోలికి వెళ్లకపోవడమే మేలు. అన్నిటి కంటే ముఖ్యంగా రోడ్డు సైడ్‌లో లభించే కబాబ్స్, జంక్ ఫుడ్‌‌ల జోలికి వెళ్లకండి. వీటిని ఎక్కువ మొత్తం తీసుకున్నా నోటి దుర్వాసన ఎక్కువగా ఏర్పడుతుంది.
 


Tuesday, August 25, 2015

" పురుషులే లేని గ్రామం" ఎక్కడుందో తెలుసా ?

స్త్రీ, పురుషులతో కలిసి జీవించేదే సమాజం. మహిళలు లేని ప్రపంచాన్ని ఊహించలేని విధంగా పురుషులు లేని లోకం కూడా ఉండదు. అయితే కెన్యా దేశంలో పురుషులే లేకుండా మొత్తం మహిళలే జీవిస్తున్న ఒక గ్రామం ఉంది. నమ్మలేకపోతున్నారా..? ఇదేదో అలనాటి తెలుగు సినిమా అనుకునేరు. అవును ఇది నిజమే. దక్షిణ కెన్యా దేశ రాజధాని నైరోపి నగరం నుంచి 380 కిలో మీటర్ల దూరంలో ఉన్న సంబురు ప్రాంతంలోనే ఈ గ్రామం ఉంది. 
 
ఉమేంజో అనే ఈ గ్రామంలో మహిళలు మాత్రమే జీవిస్తున్నారు. గృహ హింస, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు లాంటి పలు కారణాల చేత బాధింపబడిన 15 మంది మహిళలు కలిసి 1990లో ఈ గ్రామాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 47 మంది మహిళలు, 200 మంది చిన్నారులు జీవిస్తున్నారు. పురుషులే లేని ఈ గ్రామానికి బ్రిటన్ సైన్నికుల చేత అత్యాచారానికి గురైన రెబెక్క లోలోసేలి అనే మహిళ అధ్యక్షురాలిగా ఉంటుంది. 
 
ఈ గ్రామంలో మహిళలు ఆభరణాలను తయారుచేసి విక్రయించడం ద్వారాను, ఈ ప్రాంతంలో గుడారాల చేత పర్యాటక ప్రాంతంగా ఏర్పాటుచేసి తద్వారా వచ్చే ఆదాయంతోనూ వీరు జీవనోపాధి పొందుతున్నారు. ఈ గ్రామంలో పురుషులకు నిషేధం లేదు. అయితే ఇక్కడి మహిళల అనుమతించినన్ని రోజులు మాత్రమే ఉండాలి. తద్వారా పురుషుల కింద బానిసలుగా కాకుండా స్వేచ్ఛా జీవులుగా తమ జీవితాన్ని గడుపుతున్నట్టు ఇక్కడి మహిళలు తెలుపుతున్నారు.

మహిళలు మాత్రమే ఉంటున్న గ్రామం కావడంతో ఇరుగుపొరుగు గ్రామాల్లో ఉన్న పురుషులు అప్పుడప్పుడు హద్దుదాటి లోపలికి ప్రవేశిస్తుంటారు. అయినప్పటికీ వారిని ధైర్యంగా ఆ మహిళలు ఎదుర్కొంటుంటారు. ఈ గ్రామంలో ఉన్న 247 మంది కలిసి పది కుటుంబాలుగా జీవిస్తున్నారు.

Monday, August 24, 2015

శృంగారంలో "పూర్తిస్థాయి తృప్తి చెందే" సమయం ఎప్పుడో తెలుసా ?

ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు అసలు ఏ సమయంలో జంట సెక్స్ చేసుకుంటే పూర్తిస్థాయి ఆనందాన్ని సొంతం చేసుకుంటారన్న దానిపై అధ్యయనం చేశారు. ఇందులో తేలిందేమిటంటే... వేకువ జామున గం.5.48 నిమిషాలకు స్త్రీ,పురుషుడు మంచి సెక్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని పేర్కొన్నారు. దీనికి కారణం ఆ సమయంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల సమర్థవంతంగా వారు సెక్స్ చేయగలుగుతారనీ, ఫలితంగా ఇద్దరూ పూర్తిస్థాయి తృప్తి చెందుతారని వారి పరిశోధనల్లో తేలిందట. కాబట్టి వేకువ జామున చేసుకునే సెక్స్ ఇద్దరికీ మంచి తృప్తిని కలిగిస్తుంది.

Saturday, August 22, 2015

పత్రికల్లో స్వీట్స్ గురించి చదివితే ఒబిసిటీ వస్తుందట ?

పత్రికల్లో వచ్చే ఆహార సంబంధ వార్తలకూ, ఊబకాయానికి సంబంధం ఉందని ఇటీవల అధ్యయనంలో తేలింది. పత్రికల్లో ఏ విధమైన ఆహార విషయాలను చదువుతున్నారో తెలుసుకుంటే, దానిని బట్టి మూడేళ్లలో దేశ జనాభాలో ఎంతమంది ఒబిసిటీతో బాధపడుతారో కనిపెట్టడం సులభమేనని ఇటీవల అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ టైమ్స్, లండన్ టైమ్స్ వంటి పత్రికల్లో 50 ఏళ్లుగా వచ్చిన ఆహార పదార్థాల పేర్లను ఇందులో విశ్లేషించారు. 
 
ఇందులో వివిధ పత్రికల్లో ఆహార పదార్థాలపై వచ్చిన కథనాలను, దేశంలోని జనాభా సరాసరి బీఎంఐకి గల సంబంధాన్ని అధ్యయనం చేశారు. దీని ప్రకారం తియ్యటి పదార్థాల గురించి చదివినవారు మూడేళ్లలో ఊబకాయులుగా మారారని తేలింది. కూరగాయలు, పండ్లు వాటి గురించి చదివిన వారిలో ఊబకాయ సమస్య తక్కువగా ఉందని నిర్ధారించారు.


Friday, August 21, 2015

బాలీవుడ్‌‌‌లో"భారీరెమ్యూనరేషన్"తీసుకునిసంచలనంసృష్టిస్తున్నహీరోయిన్‌‌‌ ?

ఈ మధ్య హీరోలకంటే మేమేం తక్కువ కాదంటున్నారు హీరోయిన్లు. రెమ్యూనరేషన్‌‌‌‌‌లు కూడా బాగా పెంచేసి హీరోలతో పోటీ పడుతున్నారు. లేటస్ట్‌‌‌గా బాలీవుడ్ భామ విద్యాబాలన్ తన కొత్త సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని సంచలనం సృష్టిస్తోంది. 
  ఎంటర్‌‌‌టైన్‌‌మెంట్ అంటూ బాలీవుడ్‌‌‌‌‌లో డర్టీ‌పిక్చర్‌‌‌తో సక్సెస్ కొట్టిన విద్యాబాలన్ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు ఏకంగా పద్దెనిమిది కోట్ల పారితోషకం డిమాండ్ చేసిందట.
దీనికి దర్శక నిర్మాతలు కూడా ఒకే అన్నారట. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితచరిత్ర నేపథ్యంగా రూపొందబోతున్న ఈ సినిమాలో విద్యాబాలన్ లీడ్‌‌‌రోల్  చేసేందుకు ఇంత డిమాండ్ చేసిందట. అంతే కాదు బాలీవుడ్‌‌‌లో ఇంత పెద్దమొత్తంలో పారితోషికం తీసుకున్న హీరోయిన్‌‌‌గా విద్యాబాలన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందట.   

Thursday, August 20, 2015

మొక్క‌జొన్న‌ తింటే ?

మొక్కజొన్న చూస్తే కొందరికి ముఖం ముడతలు పడుతుంది. మరీ అంత ఎక్కువగా ఏమి తినరు. కానీ మొక్కజొన్న రోజువారి ఆహారంలో భాగమైతే ఎంతబాగుంటుందంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కొవ్వు పదార్థాలను తగ్గిస్తుందట. బలానికి బలం చేకూర్చుతుందట. ఇంకా ఎన్నెన్నో మేళ్ళు.. వివరాలిలా ఉన్నాయి. 
 
ప్ర‌తిరోజూ మొక్క‌జొన్న‌ను ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల‌న మంచి ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా మొక్క‌జొన్న‌ల్లో కొవ్వును త‌గ్గించే సుగుణం ఉంది. మొక్క‌జొన్న‌లు ప‌చ్చివి, కాల్చిన‌వి, ఉడ‌క‌బెట్టిన‌వి ఏవైనా స‌రే మ‌న శ‌రీరంలోని కొవ్వు పని పడతాయట. కొవ్వును కరిగించి నియంత్రిస్తాయట.  
 
అంతేకాదు వీటిలో ఉన్న లినోలికాసిడ్‌, ఫోలికాసిడ్‌, విట‌మిన్ ఇ, బి1,బి6, నియాసిన్‌, రిబోఫ్లావిన్ వ‌ల్ల చిన్నారుల‌కు, మ‌ధుమేహ‌రోగుల‌కు కూడా ఎంతో మంచిందట. జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రిచి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారిస్తుంది. ర‌క్త‌లేమిని త‌గ్గిస్తాయి. ఇన్ని సలక్షణాలు ఉన్న మొక్కజొన్న రోజూ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి..? లెటజ్ ట్రై...! 


Wednesday, August 19, 2015

అవార్డు సినిమాల ఫై సమంత సంచలన వాఖ్యలు ?

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి నలుగురి నోళ్ళల్లో నానకపోతే సమంతకు నిద్రపట్టేట్టు లేదు. మొన్నటి దాకా తోటి హీరోయిన్ల మీద పడింది. ఇప్పుడు అవార్డుల సినిమాల మీద పడుతోంది. అవార్డుల సినిమాలు ఎందుకు తీస్తారో తెలియదు. డబ్బులు రావు, పాడు రావు అంటూ నోరు పారేసుకుంది. అవార్డుల సినిమాల్లో వున్న గొప్పతనాన్ని అర్థం చేసుకునే శక్తి లేకనే సమంత అలా మాట్లాడుతోందని కొందరు సినీ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే బదులు చేసే సినిమాల మీద దృష్టి పెడితే బాగుంటుందని వారు సలహా కూడా ఇస్తున్నారట!
 

Tuesday, August 18, 2015

కొడుకుతో " ఫైన్ " కట్టించిన మంత్రి!

శివసేన పార్టీకి చెందిన మహారాష్ట్ర రవాణా శాఖామంత్రి దివాకర్ రావోతే ఇతర రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు. గతంలో ఓసారి.. హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళుతున్న పోలీసు కానిస్టేబుల్‌తో ఫైన్ కట్టించి వార్తలెక్కాడు. ఇపుడు తన తనయుడు పోలీసులతో వాదనలకు దిగినందుకు రూ.వెయ్యి ఫైన్ కట్టాలంటూ ఆదేశించి ఆదర్శంగా నిలిచారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే దివాకర్ రావోతే తనయుడు ఉన్మేశ్ రావోతేను డ్రంకన్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు నిలువరించారు. అతడిని ప్రశ్నించగా, పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారితో వాదనకు దిగాడు. దీంతో అతన్ని పోలీసులు అతన్ని వదిలివేశారు. అయితే, ఈ విషయం మరుసటి రోజు ఉదయం మంత్రి చెవికి చేరింది. వెంటనే ఆయన తన కుమారుడిని మందలించి, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు రూ.1000 ఫైన్ కట్టాలంటూ స్పష్టం చేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ "పోలీసులు వారి విధి వారు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తుంటారు, కొన్నిసార్లు జరిమానా కూడా విధిస్తుంటారు. నేను మంత్రినైనా గానీ, ఇలాంటి విషయాల్లో నా కుమారుడికీ మినహాయింపు ఇచ్చేదిలేదని నిరూపించాను" అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అమలు చేసే నిబంధనలు అందరికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు.
 


Monday, August 17, 2015

నాగార్జునను బాధకు గురిచేసిన 'బాహుబలి'

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పిన రాజమౌళి 'బాహుబలి',  కింగ్ నాగార్జునను బాధకు గురిచేసింది. ఏఎన్‌ఆర్‌, ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి పాత్రలు చేయాలని ఉందని నాగ్ తన మనసులోని మాట బయటపెట్టారు. కానీ అందుకు తగ్గ సందర్భం రావడం లేదన్నారు. బాహుబలి చిత్రం చాలా గొప్పగా ఉంది.  అందులో నటించిన వారందరూ నిజంగా అదృష్టవంతులని ఆయన అభినందించారు. 'బాహుబలి' చిత్రంలో నటించలేకపోవడం తనకు బాధగా ఉందని సాక్షాత్తూ నాగ్ స్వయంగా వెల్లడించారు. అనంద్‌ నీలకంఠన్‌ రాసిన 'అజయ2 - రైజ్‌ ఆఫ్‌ కలి' పుస్తక విడుదల కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

Saturday, August 15, 2015

"సెక్స్ కోరిక"లను తీర్చే రోబోలు ?

మనిషి సృష్టించిన వాటిలో అత్యద్భుతమైనది రోబో. ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో చిత్రం చూసే ఉంటారు. అందులో రజనీకాంత్ తయారు చేసే చిట్టి రోబోకు మనిషివలే కోపం, సంతోషం వంటి ఫీలింగ్స్‌ను తెప్పిస్తాడు. అయితే చిట్టి రోబో ఐశ్వర్యారాయ్‌ని ప్రేమించి, పెళ్లాడేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం మనిషికి ఉండే శృంగార శక్తిని కూడా అందుకుంటుంది.
 
అది సినిమా కథే కావచ్చు. అయితే ఆ కథ నిజం కావడానికి ఎంతో కాలం పట్టదు. మరో 50 ఏళ్ల కాలంలో మనిషి సెక్స్ కోరికలను తీర్చే రోబోలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని సండర్‌ల్యాండ్ యూనివర్శిటీ అధ్యాపకులు డాక్టర్ హెలెన్ డ్రిస్కోల్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఇంటి పని, ఆఫీసుల్లో పని కోసం రోబోలను తయారు చేసి వినియోగిస్తున్నారు. భవిష్యత్‌లో శృంగార కోరికలను తీర్చగలిగే రోబోలను తయారుచేస్తున్నట్టు తెలిపారు. 
 
ఈ సందర్భంగా డాక్టర్ డ్రిస్కోల్ మాట్లాడుతూ.. అత్యధునిక పరిజ్ఞానంతో రోబో ఫిలియా అనే ఒక రోబోను తయారు చేసినట్టు తెలిపారు. దీన్ని మరింత అభివృద్ధి పరిచి మనిషికి తృప్తినిచ్చే శృంగార శక్తిని ఆ రోబోలో ఉండేలా చేస్తామని అన్నారు. ఇక మనిషి తన సెక్స్‌ తృప్తిని తీర్చుకునేందుకు రోబో సెక్స్‌‌లను తమ ఇంట్లో ఉంచుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయని డాక్టర్‌ డ్రిస్కోల్ తెలిపారు. 2070 సంవత్సరంలో సెక్స్ రోబోలు అందుబాటులోకి వస్తాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
 


Friday, August 14, 2015

తోటి నటుల్ని" కొట్టే " అలవాటున్న నటుడు ?

బాలీవుడ్‌లో అతను పేరున్న యాక్టర్. కానీ అతనికి తోటి నటుల్ని కొట్టే అలవాటుంది. విచిత్రంగా ఉందా? అతనెవరో తెలుసుకోవాలని యాగ్జైంటీ‌గా ఉందా? అతనే ఆదిత్య పంచోలి.. ఈ నటుడి చేతికి దూకుడు ఎక్కువే.. అయితే ఎప్పుడూ ఆ దూకుణ్ని తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు. సెట్లో అనేక సార్లు సాటి నటుల మీద చేయి చేసుకుని వివాదాలు కోరి తెచ్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కారణం లేకుండానే సహనటుల మీద కేకలు వేయడం, తగాదాలు పెట్టుకోవడం ఆదిత్య పంచోలికి అలవాటే.

తాజాగా 'లాఖోం హై యహా దిల్‌వాలే' షూటింగ్ సమయంలో అతనితో సెట్లో షూటింగ్‌లో పాల్గొంటున్న విజయ్ భాటియా మీద చేయి చేసుకున్నాడట. షాట్ తీసేందుకు రెడీ గా ఉన్న సమయంలోనే  ఆదిత్య పంచోలీ విజయ్ భాటియాను గట్టిగా చెంప దెబ్బ కొట్టడంతో సెట్లో అందరూ నిశ్చేష్టులయ్యారట. కారణం లేకుండా విజయ్ భాటియా మీద చేయి చేసుకోవడంపై సెట్లో అందరూ తలలు పట్టుకున్నారట. ఇంతలో డైరెక్టర్ తేరుకుని పరిస్థితిని చక్కబెట్టారట. గతంలో  సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న బాజీరావ్ మస్తానీ సినిమా షూటింగ్‌లో కూడా ఈ నటుడు టెక్నికల్ టీమ్ పై  చేయిచేసుకున్నట్టు  మీడియాలో వార్తలొచ్చాయి.


Wednesday, August 12, 2015

"పేదోడి పెద్దమనసు"

చదువులేదు, ధనవంతుడు కాదు.. అయినా బుద్ధిలో మాత్రం కోటీశ్వరుడే. అతనే రాజస్థాన్‌‌లోని జైపూర్‌‌కు చెందిన రిక్షావాలా మహ్మద్ అబిద్ ఖురేషీ. రోడ్డు మీద తనకు దొరికిన నోట్ల కట్టలను పోగొట్టుకున్న వ్యక్తికి ఇవ్వాలని తపించాడు. రెండో ఆలోచన లేకుండా అందుకోసం మూడు గంటల పాటు డబ్బు దొరికిన చోటే వేచి చూశాడు. ఎంతకీ ఆ వ్యక్తి రాక పోవడంతో ఆ రూ. 1.17లక్షలను అచ్చంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి సదరు వ్యక్తికి ఇవ్వాలని కోరాడు. కాళ్ల పట్టీలకోసం కాళ్లే నరుక్కుపోయిన దుష్టులున్న ప్రస్తుత సమాజంలో బీదవాడైన ఖురేషీ నిజంగా హీరోనే.  'నిజాయితీ' అనేది మనిషి యొక్క చదువో లేదా స్టేటస్ ని బట్టో ఉండదనేదానికి ఉదాహరణే ఈ ఘటన. 



26 ఏళ్ల మహ్మద్ అబిద్ ఖురేషీ జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిక్షా నడుపుతాడు. అతనికి భార్య అమీనా, పసిపాప ఉంది.  రోజుకు రూ. 200 వందల నుంచి రూ. 300 వరకూ సంపాదిస్తాడు. రోజూ లాగే ఒక షాపులో సరుకు దింపి తిరిగి వస్తున్న క్రమంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ సర్కిల్ దగ్గర ప్లాస్టిగ్ బ్యాగ్ కనిపించింది. అందులో లక్షా 17వేల రూపాయలు ఉన్నాయి. ఎంత సేపు వెయిట్ చేసినా బ్యాగ్ యజమాని రాకపోవడంతో ఇంటికి వెళ్లి భార్య అమీనా కు విషయం చెప్పాడు.  దీంతో భార్యాభర్తలిద్దరూ కలిసి స్థానిక సోషల్ వర్కర్ సబీర్ ఖురేషీ సాయంతో పోలీస్ కమీషనర్ ఆఫీస్ కు వెళ్లి క్యాష్ బ్యాగ్ అందజేశాడు. అబిద్ ఖురేషీ ని అభినందించిన  కమిషనర్ జంగా శ్రీనివాసరావు అబిద్ నిజాయితీ అందరికీ ఆదర్శం కావాలన్నారు. స్వాతంత్యదినోత్సవంగా మహ్మద్ అబిద్ ఖురేషీని సన్మానిస్తామని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. 

Tuesday, August 11, 2015

వారానికి ఒకసారైనా "చేపలు" తినాలి ! ఎందుకంటే ?

కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే వారానికి ఒకసారైనా చేపలు తినాలని అధ్యయనంలో తేలింది. చేపలను తినడం వల్ల పలు రకాలైన ప్రయోజనాలున్నాయి. అయితే తాజా అధ్యయనంలో తేలిన విషయమేమిటంటే..? వారానికి ఒకసారైనా చేపలను తినడం వల్ల రుమటాయిడ్‌, ఆర్థ్రరైటిస్‌ వంటి కీళ్లనొప్పుల ముప్పును సగం వరకూ తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 
 
స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం సుమారు 32 వేలమంది స్వీడన్‌ మహిళలపై అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధకుల బృందం తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్న మహిళల ఆహారపు అలవాట్లను గురించి విశ్లేషించింది. వీరిలో ఒమెగా`3 కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా తీసుకున్న వారిలో కీళ్లనొప్పుల ముప్పు తక్కువగా ఉన్నట్టు తేలింది. 
 
సాల్మొన్‌, తాజా ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఈ ఒమెగా`3 కొవ్వు ఆమ్లాలు లభ్యమవుతాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 27 శాతం మంది ఈ కొవ్వు ఆమ్లాలను తక్కువగా తీసుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మొత్తంగా కీళ్లనొప్పులకు ఎక్కువగా గురయ్యే మహిళలు వారానికి ఒకసారైనా నూనెతో కూడిన చేపల్ని తినాలని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ అలన్‌ సిల్మాన్‌ చెబుతున్నారు.

Monday, August 10, 2015

" ఆ ఊరిలో ఇంటికో ఐఏయస్, ఐపీయస్"

భారతదేశ చరిత్రలో  ఏ గ్రామానికీ  లేని ప్రత్యేకతను ఆ గ్రామం సొంతం చేసుకుంది. ఇంటికో ఉద్యోగి ఉంటే గొప్పగా చెప్పుకుంటారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఐఏయస్ అధికారులు ఎంపిక అయ్యారంటే ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. అదే మరి గ్రామంలో ఇంటికో ఐఏయస్ ఉంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది? నిజంగా అసలు అలాంటి గ్రామం ఒకటి ఉందా? అనేగా మీ డౌట్. అదే ఉత్తరప్రదేశ్.. జౌన్‌పూర్ జిల్లాలోని 'మేధోపట్టి' గ్రామం. ఈ గ్రామంలో ఇంటికో ఐఏయస్ ఉన్నారు. అక్కడ ఉండే మొత్తం 75 కుటుంబాల్లో.. ప్రతి ఇంటినుంచీ ఓ ఐఏయస్ లేదా ఐపీయస్  అధికారి ఉన్నారు.
 గ్రామంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేటూ సివిల్స్‌కు ప్రిపేర్ కావడం తమకెంతో గర్వంగా ఉంటుందంటారు ఆ గ్రామ పెద్దలు. అసలింతకీ ఇంత మారుమూల గ్రామం ఈరికార్డు  సాధించడానికి కారకుడు మొదట ముస్తఫా హుస్సేన్ అనే వ్యక్తి. తొలుత ఈ గ్రామం నుంచి 1914 లో సివిల్ సర్వీసెస్‌లో చేరడమే స్ఫూర్తి కలిగించింది. అతని తరువాత ఇదే గ్రామం నుంచి ఇందు ప్రకాష్ అనే వ్యక్తి  సివిల్ సర్వీస్‌లో రెండో ర్యాంక్ సాధించి ఐఏయస్‌కు సెలెక్ట్ అయ్యాడు. అది మొదలు సివిల్స్‌లో ర్యాంకుల పంట పండిస్తూనే ఉంది. ఈ గ్రామానికున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒకే ఇంటినుంచి నలుగురు అన్నదమ్ములు సెలెక్ట్ కావడం.ఈ రికార్డును కూడా   మేధోపట్టి గ్రామం సొంతం  చేసుకుంది.

Saturday, August 8, 2015

"స్మార్ట్‌ఫోన్‌" వినియోగదారులూ బహుపరాక్ !

టెలికాం విప్లవం పుణ్యమాని ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ కనిపిస్తోంది. అయితే, ఆ ఫోన్ పని చేయాలంటే మాత్రం విధిగా బ్యాటరీ ఉండాల్సిందే. మారుతున్న టెక్నాలజీతో పాటు.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇపుడు స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతోంది. అయితే, ఈ ఫోన్లలో వినియోగించే బ్యాటరీలు నిగూఢ శత్రువుల్లా పని చేస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. 
 
ఇంటర్నెట్‌ వినియోగించే సమయంలో... ఫోన్లు చేసేటపుడు ప్రైవసీ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ గూఢచారి బ్యాటరీ ముందు ఆ పప్పులేవీ ఉడకవని సైబర్‌ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్ని ప్రైవసీలు పెట్టుకున్నా స్మార్ట్‌ఫోన్‌ వాడే వ్యక్తి వివరాలన్నీ ఆ బ్యాటరీ ద్వారా ట్రాప్ చేయవచ్చని తేలింది. హెచ్‌టీఎంఎల్‌5లోని ఓ సాఫ్ట్‌వేర్‌.. ఈ బ్యాటరీ ద్వారా మొబైల్ వినియోగదారుని వివరాలను పసిగట్టేస్తుందట. 
 
నిజానికి ఈ సాఫ్ట్‌వేర్ వెబ్‌లోని కొన్ని సైట్లను ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఇదే సాఫ్ట్‌వేర్ ద్వారా వినియోగదారుడి ఫోన్లో ఉన్న బ్యాటరీ నిడివి గురించి పలు వెబ్‌సైట్లకు సమాచారం ఇస్తుందట. ఆ సమాచారంతోనే వినియోగదారుడు నెట్‌ వాడుతున్నప్పుడు ఫోన్‌ వివరాలు, వినియోగదారుడి వివరాలను గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్‌ చేసేస్తారట. 
 
ఇంటర్నెట్‌ వాడే ఓ వినియోగదారుడి వివరాలను తెలుసుకునేందుకు సాధారణంగా వీపీఎన్‌, ప్రైవేట్‌ బ్రౌజింగ్‌లు చాలు. అయితే ఇప్పుడు దానికి అదనంగా బ్యాటరీ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు తోడయ్యాయి. ‘ద లీకింగ్‌ బ్యాటరీ: ఎ ప్రైవసీ అనాలసిస్‌ ఆఫ్‌ ద హెచ్‌టీఎంఎల్‌5 బ్యాటరీ స్టేటస్‌ ఏపీఐ’ అనే అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 


Friday, August 7, 2015

పాతికేళ్ళలోపు తండ్రి అయితే ! త్వరగానే మరణిస్తారట ?

యువకులకు ఇది నిజంగానే చేదువార్తే. పాతికేళ్ళలోపు తండ్రి అయితే వారు త్వరగానే చనిపోతారని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఫిన్లాండ్‌లోని హెల్సింకీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పురుషుల జీవనప్రమాణాలపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో కొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి.
 
ఈ యూనివర్శిటీకి చెందిన ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం... యుక్త వయసులోనే తండ్రయితే... తొందరగా మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 25 ఏళ్ల లోపు పిల్లల్ని కంటే దాని ప్రభావం మహిళల కంటే పురుషులపైనే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. భర్తగా, తండ్రిగా, కుటుంబ యజమానిగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, దానిని తట్టుకోలేకపోతే ఆరోగ్యం క్షీణించి, త్వరగానే మృత్యువాతపడుతున్నారని పేర్కొంది. 
 
చిన్న వయసులోనే తండ్రి కావడం వల్ల పదేళ్లలో ఒకటి నుంచి 20 మంది వరకు అర్థాయుష్కులవుతున్నారని ఈ పరిశోధన తేల్చింది. 21 శాతం మంది తీవ్ర గుండెజబ్బులు, 16 శాతం మద్యపాన సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్నారని తెలిపింది. 25 ఏళ్లకు ముందే తండ్రి అయితే 40 నుంచి 45 ఏళ్ల మధ్య మరణించే ప్రమాదముందని పరిశోధన వెల్లడించింది.
 


Saturday, August 1, 2015

"శృంగారం" పై" అమ్మాయిలు" ఓపెన్‌గా మాట్లాడుతున్నారా ?

సెక్స్ అనేది ఇప్పుడు అమ్మాయిలకు నిషిద్ధ పదం కాదట. 15-20 ఏళ్ల క్రితం వాళ్లు సెక్స్ అంటే బిడియపడేవారని, సిగ్గుపడేవారని.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మహేందర్ వాత్సా. రోజులు చాలా మారిపోయాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈయన ‘ముంబై మిర్రర్’ పత్రికలో వ్యాసాలు రాసే కాలమిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. దేశంలో ఇంచుమించు ప్రతిసిటీలో సెక్స్ కౌన్సెలింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడమేగాక మన దేశంతోబాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్టు, ఇండోనేషియా, మెక్సికోలలో సైతం వర్క్‌షాపులు నిర్వహించారు. యువకులు సెక్స్‌ను ఎంజాయ్ చేస్తే.. లోగడ అమ్మాయిలు బిడియపడేవారు.
 కానీ.. వాళ్లిప్పుడు ఓపెన్‌గా మాట్లాడుతున్నారని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వాళ్లు కేవలం కౌగిలింతలు, కిస్సింగులకే పరిమితమయ్యేవారు అని ఆయన చెప్పారు. తరాలు మారుతున్నాయన్నారు. శృంగారం అంటే కేవలం లైంగిక క్రీడ మాత్రమే కాదని, భావోద్వేగాలు (ఎమోషన్స్) కూడా కీలకపాత్ర వహిస్తాయని మహేందర్ వాత్సా స్పష్టం చేశారు. ప్రస్తుతం యువతీయువకులు ఉద్యోగాల్లో, ఇతర వ్యాపకాల్లో ఎక్కువసేపు పనిచేయడం వల్లనో.. టెన్షన్స్ పెరుగుతుండడం వల్లనో వారిలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతోందని ఆయన తెలిపారు. అందువల్లే తాము కౌన్సెలింగ్ సెంటర్స్, వర్క్‌షాపుల వంటివి నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.