CSS Drop Down Menu

Tuesday, March 31, 2015

"వేసవి"లో "కీరదోస" తీసుకోండి.

 
వేసవిలో కీరదోస తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి. నోరెండిపోవడానికి చెక్ పెట్టే కీరదోస ఆకలిని పెంచుతుంది. శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కీరదోసలో విటమిన్లు లేకపోయినా.. సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సిలికాన్, క్లోరిన్ పుష్కలంగా ఉన్నాయి. 
 
కీరదోసలోని పొటాషియం రక్తంలోని ఎరుపు కణాలను పెంపొందింపజేస్తాయి. ఊపిరితిత్తులు, కాలేయంలోని వేడిని నిరోధిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ వ్యాధులను నిరోధిస్తుంది. శరీరంలో విష పదార్థాలు చేరనీయకుండా చేయడంలో కీరదోస మెరుగ్గా పనిచేస్తుంది. దోస మెదడును బలపరుస్తుంది. తల ఉష్ణోగ్రతను నిరోధిస్తుంది. మెదడును ఉత్సాహపరుస్తుంది. కఫం, వాతాన్ని నిరోధిస్తుంది. 

Monday, March 30, 2015

సమాధానం తెలిస్తే? పంపండి!

                         
                          దీనికి  జవాబు 3వ తారీఖు న చూడండి!   

Saturday, March 28, 2015

"కొత్త వివాదానికి" తెరలేపిన లాలూ ప్రసాద్ యాదవ్

తాము అధికారంలో ఉన్నట్టయితే పబ్లిక్ పరీక్షలు రాసేందుకు హాజరయ్యే విద్యార్థులకు తామే పుస్తకాలు పంపిణీ చేసి కాపీ కొట్టమని చెప్పేవాళ్లమంటూ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. 
 
ఇటీవల బీహార్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విషయం తెల్సిందే. బీహార్‌లో టెన్త్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జాకీచాన్‌లాగా బిల్డింగు ఎక్కి మరీ కొందరు చిట్టీలు అందించారు. ఇదో ఉత్సవంలా జరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా సంచలనం చోటు చేసుకుంది. 
 
దీనిపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ.. ‘విద్యార్థులకు చిట్టీలు ఇవ్వడానికి బల్లుల్లాగా భవనాలు ఎక్కారు. ఎంత కష్టం. మేమైతే కాపీ కొట్టేందుకు పుస్తకాలే అందించేవాళ్లం’ అంటూ సరికొత్త వివాదానికి తెరలేపారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా బీహార్‌ ప్రభుత్వాన్ని కేంద్రం కోరిన తర్వాత ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. 


Friday, March 27, 2015

"ఒక్క నిమిషానికి పది కోట్ల" పారితోషికం !

వెండితెరపై వెలిగే స్టార్స్ సినిమాల్లో నటించడం కంటే కూడా బుల్లి తెర షోలు, ప్రకటనల ద్వారానే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ వరుసలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఒక ప్రకటనలో నటించేందుకు పది కోట్లు డిమాండ్ చేశాడట.
 
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాలను ఎలా ఎంచుకుంటున్నాడో అలాగే యాడ్స్‌ని కూడా సెలక్టీవ్‌గా ఎంపిక చేసుకుంటున్నాడు. ఆఫర్ వచ్చింది కదా అని ఏది పడితే అది చేయడు. అప్పట్లో టైటాన్ వా‌చ్‌లకు, ఇన్ క్రెడిబుల్ ఇండియా యాడ్ లోనూ కనిపించాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ మరో యాడ్‌ని ఒప్పుకోలేదు.
 
అయితే తాజాగా అమీర్ ఖాన్ ఓ ఈ కామర్స్ సంస్థ యాడ్ చేశాడట. నిమిషం పాటు కనిపించే ఆ యాడ్ కోసం అమీర్ ఖాన్ దాదాపు 10 కోట్లు డిమాండ్ చేశారట. అయినా ఆ రేటు ఇచ్చేందుకు సదరు ఆన్‌లైన్ సంస్థ కూడా ఓకే చెప్పిందట. దాంతో చకచకా యాడ్‌ను ముగించేసి పది కోట్ల రూపాయలు తీసుకున్నారట. 
 
ఒకే ఒక్క నిమిషానికి 10 కోట్ల రూపాయలు తీసుకున్న విషయం తెలిసి, పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ యాడ్ త్వరలో బుల్లితెరపై కనిపించనున్నదని బాలీవుడ్ సమాచారం.


Thursday, March 26, 2015

"ప్రేమను కూడా కొలవవచ్చు" ! ఎలాగో తెలుసా?

ప్రేమ.. చాలా లోతైంది.. అంటూ ఎన్మో కొటేషన్స్ వినివుంటాం.. అలాంటి మధురమైన ప్రేమను కూడా కొలవవచ్చని చైనా పరిశోధకులు అంటున్నారు. యువతీయువకుల మధ్య ఆకర్షణకు, ఆప్యాయతకు ప్రేమ అనే అర్థం ఎప్పటి నుంచో ఉంది. ఈ అపురూపమైన భావనను కొలవవచ్చంటున్నారు చైనా పరిశోధకులు. 
 
ఈ క్రమంలో నిజమైన ప్రేమ ఎంతో తెలుసుకోవచ్చని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జియావో చు ఝంగ్ అంటున్నారు. ప్రేమలో పడిన, పడని వ్యక్తుల మెదళ్లలో రసాయనిక మార్పులు భిన్నంగా ఉంటాయని తెలిపారు. సుమారు 100 మంది మెదళ్లను స్కాన్ చేసి ఈ వివరాలు రాబట్టామని వివరించారు. వారిలో ప్రేమ శాతం ఎంతుందన్న విషయాన్ని రసాయనిక మార్పులను బట్టి ఇట్టే చెప్పేయవచ్చని ఝుంగ్ చెబుతున్నారు. 
 
ప్రేమలో పడిన వారి యాక్టివిటీస్‌ను ఎమ్మారై స్కాన్ ద్వారా కనుగొనడం జరిగిందని.. ప్రేమించే వారు.. ప్రేమలో పడిన వారి మెదడు పనితీరు, భావోద్వేగం ఎక్కువే ఉన్నట్లు తేలిందని ఝంగ్ చెప్పారు. అదే ప్రేమ లేని వారిలో మెదడు మెరుగ్గా పనిచేయట్లేదని, మిగిలిన యాక్టివిటీస్ శాతం కూడా తక్కువగా నమోదైనట్లు పరిశోధకులు తెలిపారు.
 


Wednesday, March 25, 2015

"నగ్నంగా నిద్రిస్తే" ఎన్నో లాభాలు ?

రోజంతా శారీరకంగాను, మానశికంగాను అలసిపోయే వారు రాత్రి పూట నిద్రించే సమయంలో ఒంటిపై నూలుపోగు లేకుండా, నగ్నంగా నిద్రిస్తే ఎన్నో లాభాలు చేకూరుతాయని స్లీప్ ఫౌండేషన్ తెలుపుతోంది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.
 
అందులో రాత్రిపూట నగ్నంగా పడుకొని నిద్ర పోవడం వల్ల అదనపు వేడి తగ్గి మరింత గాఢమైన నిద్రలోకి పోతారు. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండి మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మరింత సుఖమైన నిద్ర పడుతుంది. దిగంబర నిద్రతో పురుషులలో వీర్య కణాల వృద్ధి, లైంగిక సామర్థ్యం పెరుగుతాయి. మహిళల్లో యోనిని తాకే బ్యాక్టీరియాలు దూరం అవుతాయి. 
 
సుఖనిద్రలో గ్రోత్ హార్మోనుల ఉత్పత్తి పెరిగి స్ట్రెస్ హార్మోనుల ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా స్థూలకాయానికి దూరం కావచ్చు. శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. మంచి నిద్ర ఒత్తిడిని దూరం చేస్తుంది. అధిక బరువు పెరిగేందుకు గల కారణాలలో ఒత్తిడి కూడా ఒకటి. గ్రోత్ హార్మోనుల వృద్ధి వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గాఢ నిద్ర కారణంగా రక్త కణాలు మరింత శక్తిని పొందుతాయి. 
 
ఇంతేకాకుండా జీవిత భాగస్వామితో కలసి నగ్నంగా నిద్రిస్తే, ఇద్దరి మధ్యా 'ప్రేమ' హార్మోనులు పెరిగి, భౌతిక, మానసిక బంధం దృఢపడుతుంది. ఇది పగటిపూట అనుబంధాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. దీంతోపాటు ఇరువురి శరీరాల్లో ఆక్సీటోసిన్ పెరిగి బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. 
 
నగ్నంగా నిద్రించడం వల్ల మంచి కొవ్వుగా పేరున్న 'బ్రౌన్ ఫ్యాట్' మరింత యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల బరువు పెంచే చెడు కొవ్వు కరుగుతుంది. నగ్నంగా నిద్రించడం వలన ఎన్ని లాభాలున్నాయో చూసారుగా. 

Tuesday, March 24, 2015

"వెజ్ వండర్స్"




Monday, March 23, 2015

"సోఫియా బికినీ వివాదం"


సాదారణంగా పండుగ అంటే అమ్మాయిలు చక్కగా తలస్నానం చేసి , నిండా బట్టలేసుకొని చక్కగా దేవుడికి దణ్ణం పెడుతారు. కొంతమంది చీరకట్టులో , మరికొంతమంది లంగాఓణి తలనిండా పూలు పెట్టుకొని చక్కగా పండుగ రోజు ముస్తాబు అవుతారు. కానీ బికినీలో ఎవరైనా పండుగ చేస్తారా? కానీ హాట్ బ్యూటీ సోఫియ హయత్ అలాగే చేసింది. అందుకు నిదర్శనం ఇటీవల సోఫియా జరుపుకున్న హోలీ పండుగ. ఆ పండుగ సంబరాలు వివాదం అయ్యాయి. వివరాల్లోకి వస్తే….హోలీ పండుగ సందర్భంగా సోఫియా టూపీస్ బికినీ వేసింది.

 



ఒంటినిండా రంగులు చల్లుకొని ఫోటోలు దిగడమే కాకుండా వాటిని బయటపెట్టింది. ప్రస్తుతం యువకులు ఎక్కువగా నెట్లో ఆ ఫోటోలని వెతికి మరి సోఫియా అందాలని చూస్తున్నారు. ఈ అమ్మడి  బికినీ అందాలు యువకులని అలరిస్తుంటే, హిందూ మత సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్ర హోలీ పండుగని జరుపుకునే పద్ధతి ఇదేనా? ఇదేమి బాగోలేదు అని అంటున్నారట. సోఫియాపై కేసు నమోదు చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ అదే జరిగితే ఈ అమ్మడు ఆ సమస్యని ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి.  పైనున్న  సోఫియా ఫోటో హోలీ పండుగకు సంబందించినదే.


 

Saturday, March 21, 2015

"బరువు తగ్గించుకోవడం"లో "పుదీనా" పాత్ర !


బరువు తగ్గించుకోవడంలో పుదీనా చాలా ముఖ్య పాత్రను తగ్గిస్తుంది. ఇది డైజస్టివ్ సిస్టమ్‌ను క్రమబద్ధం చేస్తుంది. శరీరం ఎక్కువ న్యూట్రీషియన్స్‌ను గ్రహించడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే మీ శరీరంలో చాలా ఎఫెక్టివ్‌గా కొవ్వు కరగడం ప్రారంభం అవుతుందో అప్పుడు సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. కాలేయంను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.
 
పుదీనాలో మెంతాల్ అధికంగా ఉంటుంది. మెంతాల్ డీకంజెస్టాంట్ గొంతులో గరగర వంటి ఇబ్బందులకు లోనయినప్ఫుడు కప్ఫు పుదీనా చాయ్ తాగండి. నిమిషాల్లో సాంత్వన పొందొచ్చు. నాసల్ పాసేజ్ ఫ్రీ అవుతుంది. దాంతో సైనస్ సమస్య ఉండదు. 
 
స్కిన్ ఇరిటేషన్ తో బాధపడే వారు పుదీనా టీ తీసుకోవడానికి ట్రై చేయండి. తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు, ఈ టీ కొన్ని రకాల స్కిన్ అలర్జీలకు, కాలిన గాయాలకు, స్కిన్ రాషెస్ మరియు ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా గ్రేట్‌గా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  


Friday, March 20, 2015

"పురుషులకు శుభవార్త "



పిల్లలు వద్దనుకునే మగాళ్ళు వేసెక్టమీ చేయించుకునేందుకు  ఇబ్బందులు పడుతుంటారు. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఇంజెక్షన్‌తో  వేసెక్టమీకి గుడ్ బై చెప్పొచ్చంటున్నారు  శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డాక్టర్లు.  వేసెక్టమీ వద్దనుకుకునే వారికోసం కనిపెట్టిన వాసా జెల్‌ను ఇంజెక్షన్ ద్వారా బాడీలోకి పంపుతారు. ఇది వీర్యాన్ని మోసుకెళ్లే సన్నని ట్యూబ్‌ను  మూసివేస్తుంది.

మళ్ళీ అవసరం అనుకుంటే తేలిగ్గా ఈ జెల్‌ను తొలగించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే గనుక అందుబాటులోకి వస్తే.. ఇక పురుషులకు  సంతాన నిరోధకాల బాధ తప్పినట్టే! ఈ వాసాజెల్ ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. సత్ఫలితాలొస్తే  వచ్చే ఏడాది మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.

Thursday, March 19, 2015

"పళ్ల" రసాలు "అతి"గా తాగితే ?

ఆరోగ్యానికి మేలు చేస్తాయని పళ్ల రసాలు తెగ తాగేస్తున్నారా? అయితే జాగ్రత్త పండండి. రోజూ తియ్యటి పళ్ల రసాలు తాగే వాళ్లలో రక్త పీడనం బాగా పెరుగుతుంది. దాంతో హార్ట్ ఎటాక్ రిస్క్ లేదా యాంజినా (ఛాతిలో నొప్పి) ఏర్పడే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పళ్ల రసాల్లో అవసరమైన విటమిన్లు ఉన్నమాట వాస్తవమే కానీ వాటి పాటు అధిక మొత్తంలో చక్కెర కూడా ఉంటుందనే విషయాన్ని మరిచిపోకూడదు. 
 
ఇంతకుముందు జరిగిన పరిశోధనల్లో కమలా పళ్ల రసం, స్వీటెన్డ్ డ్రింక్‌లంత హానికరం అని తేలింది. 250 మిల్లీలీటర్ల కమలా పళ్ల రసంలో 115 కాలరీలు లేదా ఏడు టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం రోజుకి ఆరు స్పూన్ల చక్కెర మాత్రమే వాడాలి. అందుచేత ఆరెంజ్ జ్యూస్‌ను పంచదార కలపకుండా  తాగాలి. లేకుంటే ఆరెంజ్ జ్యూస్‌లో కాస్త నీటి మోతాదు పెంచాలి. రోజూ కాకుండా వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు. 


Wednesday, March 18, 2015

"కుమార్తె కోసం అద్దె తల్లిగా మారిన కన్నతల్లి" !


నేటి ఆధునిక వైద్య ప్రపంచంలో గర్భసంచి లేని యువతికి, మరో మహిళ గర్భసంచిని అద్దెకు తీసుకుని బిడ్డను కని ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ యువతి కోసం ఆమె కన్నతల్లే, అద్దె తల్లిగా మారి తన కుమార్తె కోసం నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించి ఇచ్చిన సంఘటన ఇటీవల చెన్నైలో చోటుచేసుకుంది. 
 
వైద్యుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన 27 ఏళ్ల యువతి వివాహమైన ఏడాదిలోనే గర్భం దాల్చింది. అయితే ఆమె ఏడో నెల గర్భవతిగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు వచ్చి రక్తస్రావమై అనుకోనివిధంగా బిడ్డ కడుపులోనే చనిపోయింది. 
 
ఆ తర్వాత వైద్యులు శస్త్రచికిత్స చేసి, బిడ్డను బయటకు తీసినా, గర్భసంచి పెద్దదిగానే ఉండటంతో ఆమెకు ప్రాణాపాయం ఉంటుందని దానిని తొలగించేశారు. దీంతో ఆ యువతికి బిడ్డ దక్కకపోగా గర్భసంచి లేకపోవడంతో తిరిగి పిల్లలు పుట్టే అవకాశం లేక కుమిలిపోయింది. దీంతో ఆమెకు అద్దె తల్లి ద్వారా బిడ్డను పొందవచ్చని వైద్యులు సూచించారు.
 
ఆ తర్వాత 2013లో ఆ యువతిని, ఆమె భర్తను పరీక్షించిన వైద్యులు అద్దె తల్లికోసం విచారించగా దాని కోసం ఎవరూ ముందుకు రాలేదు. తన కుమార్తె పడుతున్న ఆవేదనను చూసి ఆ యువతి కన్నతల్లి (61 ఏళ్లు) అద్దె తల్లిగా మారేందుకు అంగీకరించింది. ఆమె ముగ్గురు పిల్లలను కని, బయిస్టు ఆగిపోయి ఐదేళ్లు అయినట్లు తెలిపింది. 
 
ఐతే తన కన్నబిడ్డ కోసం, తానే మరోసారి అద్దెతల్లిగా మారి బిడ్డను ప్రసవించేందుకు ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆ యువతి నుంచి అండాలను, ఆమె భర్త నుంచి వీర్యాన్ని సేకరించి వృద్ధ తల్లి గర్భంలో ప్రవేశపెట్టారు. ఆమెను తొమ్మిది నెలలపాటు వైద్య పర్యవేక్షణలో ఉంచిన పిమ్మట ఆమెకు ఇటీవల 2.7 కిలోల బరువుతో పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఈవిధంగా తల్లే కుమార్తెకు మరో బిడ్డను కని ఇవ్వడం ప్రపంచంలోనే ఇది రెండోసారి అని వైద్యులు చెపుతున్నారు.
 
ఈ విధంగా తొలిసారిగా లండన్‌లో జరిగింది. అయితే అప్పుడు వృద్ధ తల్లి గర్భసంచిని అవయవ మార్పిడి ద్వారా తల్లి కడుపులో పెట్టారు. తద్వారా ఆమె ప్రకృతి సహజంగానే భర్తతో సంయోగం చెంది, బిడ్డను ప్రసవించింది.

Tuesday, March 17, 2015

" అమెరికా యాపిల్స్‌‌‌‌ యమ డేంజర్"


యాన్ యాపిల్ ఎ డే..కీప్స్ డాక్టర్ ఎవే’..అనే నానుడిని మార్చుకోవలసి వస్తోంది. ఇప్పుడు దీన్ని ‘యాన్ యాపిల్ ఎ డే..కీప్స్ నియర్ ఎ డిసీజ్’ అని సవరించుకునే రోజులొచ్చాయి. ఇప్పడు వస్తున్న యాపిల్స్‌‌‌‌లో హానికరమైన లిస్టీరియోసిస్ అనే బ్యాక్టీరియా ఉంటోందట..దీనితోబాటు మరో రకం ప్రమాదకరమైన యాపిల్ కూడా ఉంది. అందువల్లే అమెరికానుంచి ఇలాంటి డేంజరస్ యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేశామని మలేసియా ప్రభుత్వం అంటోంది.

ముఖ్యంగా కాలిఫోర్నియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ‘గలా, గ్రానీ స్మిత్’ గ్రీన్ యాపిల్స్ ఇలా మనుషుల ఆరోగ్యానికి చేటు తెచ్చేవిగా ఉన్నాయని అక్కడి వ్యవసాయ శాఖ మంత్రి సబ్రి యాకూబ్ తెలిపారు. వీటిని తినడంవల్ల జ్వరం, తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి, ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చునని ఆయన అన్నారు. యూఎస్ యాపిల్స్‌‌ను దిగుమతి చేసుకోవడాన్ని థాయ్‌‌‌ల్యాండ్, ఫిలిప్పీన్స్ దేశాలు కూడా నిలిపివేశాయి.


Monday, March 16, 2015

"15 ఏళ్లకే" అన్ని "అనుభవాలు" పొందానన్న నటి ?

 
ఎవరి పేరు వింటే కుర్రకారు నరనరాలు జువ్వుమంటాయో, ఎవరిని తలచుకుంటే యువత మతులు పోతాయో ఆ బ్యూటీనే సన్నీ లియోన్. ఈ అమ్మడు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. 15 ఏళ్లకే అన్ని అనుభవాలు పొందానని తెలిపింది. భారతీయ సాంప్రదాయాలు ఎంత మహోన్నతమైనవో తనకు ఇప్పుడు తెలిసిందని తెలిపింది. 
 
గతంలో తాను చేసిన తప్పులకి ఇప్పుడు ఇలా తలదించుకుంటున్నానని అంటూ వాపోయింది సన్నీలియోన్. తన సంతతి భారదేశంలోనే ఉన్నప్పటికీ, తాను మాత్రం విదేశాల్లో ఉండటం వలన ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు తనకు తెలియవని పేర్కొంది. 
 
భారతీయ మహిళలది మహా ఔన్నత్యం స్వభావమని, అరుదైన వ్యక్తిత్వం కలవారని, తన పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవం తీసుకోస్తారని తెలిపింది. ఇక్కడికి వచ్చాక తాను చేసిన తప్పులు తలుచుకుంటే చాలా బాదేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
గతంలో సన్నీలియోన్ పోర్న్ సినిమాల్లో నటించే విషయం అందరికీ తెలుసుకాని, బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ భామ ఆ సినిమాలకి స్వస్తి చెప్పింది. జాతీయ మహిళా దినోత్సవం రోజున తన గతం గురించి మాట్లాడతూ అవి పీడకలలు అని భారతదేశ మహిళ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. 
 

Saturday, March 14, 2015

భారతీయ విద్యార్థుల్ని చేర్చుకోం?ఎందుకంటే,మీది " రేపిస్టు"ల దేశం !

 
భారత్ లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండటం విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల పాలిట పెనుశాపంగా మారుతోంది. విద్యార్థినులు ఉన్నచోట భారతీయ విద్యార్థిని ఇంటర్న్ షిప్ కు అనుమతించబోనని ఓ మహిళా ప్రొఫెసర్ తేల్చిచెప్పింది. ఇరుదేశాల విద్యా సంబంధాలపై పెను ప్రభావం చూపేదిగా ఉంది. 
 
‘మీది రేపిస్టుల దేశం.. అక్కడ నిత్యం అత్యాచారాల సమస్య ఉంది. మీ ఇటర్నెషిప్‌కు అనుమతించేది లేదు. అది సాధ్యం కాదు. మా దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి మీ ఇంటర్నెషిప్‌కు అనుమతించలేం..’ ఇదీ అంతర్జాతీయ విద్యాసంస్థలలో మన దేశానికి ఉన్న పేరు ప్రతిష్టలు.. ఇలా మాట్లాడింది ఓ జర్మనీ ప్రొఫెసర్. ముఖం మీద కొట్టినట్లు సమాధానం చెప్పి.. భారతీయ విద్యార్థి ఇంటర్నెషిప్‌ను తిరస్కరించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
భారతీయ విద్యార్థి ఒకరు తన ఇంటర్నెషిప్ కోసం జర్మనీకి చెందిన లీప్జిగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ బెక్ సికింజర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తన దరఖాస్తును మెయిల్ ద్వారా పంపారు. ఆమె దీనిపై వెంటనే స్పందించారు. ముఖం మీద కొట్టినట్లు తాను విన్నపాన్ని అంగీరించడం లేదని చెప్పేశారు. భారతదేశంలో అత్యాచార సమస్యలు చాలా ఉన్నాయని వింటున్నాం. మా దగ్గర చాలా మంది అమ్మాయిలు ఇంటర్నెషిప్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో అత్యాచారాల సమస్య ఉన్న దేశం నుంచి వచ్చే వారికి మద్దతు ఇవ్వలేమని తెగేసి చెప్పేశారు. 
 
దీనిపై ఇండియాలోని జర్మనీ రాయబారా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తర్వాత ఆ ప్రొఫెసర్ భారతదేశానికి క్షమాపణలు చెప్పినట్లు వివరించారు. భారతదేశంలో అత్యాచార సంఘటనలపై చాలా సీరియస్‌గా స్పందిస్తుందని జర్మనీ ఎంబసీ తెలిపింది. 


Friday, March 13, 2015

"40 నిమిషాలు" డాన్స్‌కు "11 కోట్లు"

హాలీవుడ్ నటి, అమెరికన్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ గురించి, ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆమె ఆస్తుల విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లు(2500 కోట్లు). అయినప్పటికీ డబ్బు సంపాదించడానికి వచ్చే ఏ ఆఫర్ కూడా ఆమె వదులుకోవడం లేదు.

 ఆమె మకావ్‌లో ఓ ప్రైవేట్ పార్టీలో 40 నిమిషాల పాటు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందుకు గాను ఆమె రూ. 1.75 మిలియన్ డాలర్లు (రూ. 11 కోట్లపైనే) చార్జ్ చేసారు. 45 ఏళ్ల జెన్నిఫర్ లోపెజ్ ఇప్పటికీ తన సెక్సీ అందాలు, అదరగొట్టే  పెర్పార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది.

 ఆమెకు 40 నిమిషాల పెర్ఫార్మెన్స్ కోసం ఆమెకు 1.75 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్ తో పాటు అమెరికా నుండి మకావ్ వరకు ప్రత్యేక విమానం ఏర్పాట్లు గట్రా చేసారట. దీన్ని బట్టి ఆమె షోలకు ఉన్న ఫాలోయింగ్, డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.


Thursday, March 12, 2015

" అల్సర్‌"కు దివ్యౌషధం " కొబ్బరిబొండాం"

 టైమ్‌కి తినకపోవడం, అధిక కారంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం అల్సర్‌కు దారితీస్తుంది. అందుచేత అల్సర్‌ను దూరం చేసుకోవాలంటే కొబ్బరిబొండాంను తీసుకోవాల్సిందే.

కడుపులో మంట, ఛాతిలో మంట, వేవిళ్ళు వంటి లక్షణాలు తెలుస్తాయి. ఈ లక్షణాలు తెలిస్తే.. చాక్లెట్, కూల్ డ్రింక్స్, మద్యపానం, పెప్పర్‌మింట్, కాఫీ, బ్లాక్ టీ, ఆరెంజ్, ద్రాక్ష, వెల్లుల్లి, మిరప, పాల ఉత్పత్తులు, కారపు పదార్థాలు తీసుకోకపోవడం మంచిది.

గోధుమలు, చికెన్, ఫిష్, బీన్స్, కోడిగుడ్డు, పెరుగు, ను తీసుకోవచ్చు. కానీ చక్కెర, కొవ్వు అధికంగా గల ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేయాలి. ఉప్పును కూడా తగ్గించాలి. వీటితో పాటు కొబ్బరిబొండాం అల్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

కొబ్బరిబొండాంలోని నీటిని ఉదయం-సాయంత్రం తీసుకుంటే అల్సర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీర ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కంటికి మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత రుగ్మతలను నయం చేస్తుంది.

ఇక మధ్యాహ్నం పూట కొబ్బరిబొండాం నీటిని తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. పచ్చకామెర్లు, కలరా, చికెన్ ఫాక్స్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Wednesday, March 11, 2015

"యానిమేటెడ్ పేస్ ఎక్స్ ప్రెసెన్స్"

ముఖంలో కన్పించే  బాధ నుండి సంతోషం వరకు ఉన్న బావోద్వేగాలు చూడాలనుకుంటే  ఈ  క్రింది  లింక్ ని క్లిక్ చెయ్యండి .

"హత్య చేస్తానంటూ తాప్సీ" సంచలన వాఖ్యలు

నిర్భయ హత్యకేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ వివరాలు బయటకు వచ్చిన వెంటనే దేశ వ్యాప్తంగా పలువురు మండిపడ్డారు. సినీ సెలబ్రిటీలు ముఖేష్ సింగ్ తీరుపై దుమ్మెత్తి పోసారు. 

 ముఖేష్ ఇంటర్వ్యూ చదివాక ఒక్కసారిగా మాట పడిపోయింది. దేవుడా ఒక్క హత్య చేస్తాను నన్ను క్షమించు, వాడిని ఊరికే వదలకూడదు' అంటూ తాప్సీ తీవ్రంగా స్పందించింది. జైలు శిక్ష నిజంగానే ఈ మగాళ్లను మారుస్తుందా? అనే అనుమానం వస్తోంది. ఆ మార్పు రాకపోతే, ఇంకా వాళ్లు అక్కడ ఎందుకు? అని ప్రశ్నించింది.


Tuesday, March 10, 2015

"దగ్గు" తగ్గాలంటే ?

దగ్గుకి తేనెను మించిన ఔషధం లేదు. తేనెలో ఏమీ కలపకుండా నేరుగా తీసుకుంటే గొంతులోపల ఓ పూతలా ఏర్పడి.. గరగరమనే మంటను తగ్గిస్తుంది. తేనెకి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా తక్షణ ఉపశమనం ఉంటుంది. 
 
అల్లం టీ కూడా దగ్గుకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అల్లాన్ని పది పన్నెండు చిన్న ముక్కలుగా కోసి.. మూడు కప్పుల నీటిలో 20 నిమిషాలు వేడి చేయండి. కాస్త చల్లారాక చెంచా తేనె కలపండి. నిమ్మకాయ రెండు చెక్కలు పిండేయండి. రుచి చూసి ఘాటుగా అనిపిస్తే కాసిని నీళ్లు కలపండి. రెండు పూటలా దీన్ని తాగితే దగ్గు తగ్గిపోతుంది. 
 
చెంచా నల్ల మిరియాలకు చెంచా తేనె కలపండి. వీటిలో వేడినీళ్లు పోయండి. ఈ మిశ్రమంపై మూతపెట్టి పావుగంట తరువాత తాగితే ఫలితం ఉంటుంది. అలాగే కప్పు నీటిలో చెంచా పసుపూ, చెంచా వామూ వేసి వేడి చేయండి. నీళ్లు సగానికి సగం తగ్గేదాకా మరగనిచ్చి దించేయండి. దీనికి తేనె కలిపి రోజులో మూడుపూటలా తాగితే మంచిది. 

Monday, March 9, 2015

"తొమ్మిది నిమిషాలకు 30 లక్షలు" తీసుకొంటున్న నటి ?

ఇటీవల కొందరు హీరోయిన్లు వచ్చే అవకాశాలన్నిటిని చక్కగా ఉపయోగించుకుంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో అనే విధానాన్ని పాటిస్తున్నారు. ఈ కోవలో అందాల తార చార్మీ కూడా చేరినట్టుంది. అమ్మడు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే, మరో వైపు ఐటమ్స్ సాంగ్స్‌ కూడా చేస్తూ దూసుకుపోతుంది.
 
ప్రస్తుతం 'జ్యోతిలక్ష్మి' చిత్రంలో నటిస్తున్న కథానాయిక చార్మీ మరోపక్క తమిళంలో ఓ ఐటమ్ పాటలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. విక్రం హీరోగా నటిస్తున్న '10 ఎణ్రుదుకుళ్ళ' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న ఈ ప్రత్యేక గీతాన్ని చాలా రిచ్ గా చిత్రీకరిస్తున్నారు. పైగా, తొమ్మిది నిమిషాల పాటు సాగే ఈ ఒక్క పాటకు చార్మీ ఏకంగా 30 లక్షల పారితోషికం తీసుకుంటోందట!


Thursday, March 5, 2015

రామ్ గోపాల్ వర్మ అరెస్టు ?


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కలకలం రేపారు. ఇటీవల ఎప్పుడూ ట్విట్టర్‌లో ఉండే వర్మ తాజాగా తనను పోలీసులు అరెస్టు చేశారంటూ ఫోటోతో పాటు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అయితే 

ఫన్ కోసం ఓ పోలీసు కారెక్కి..  తాను అరెస్టయ్యానంటూ తన ట్విటర్ లో ఆ ఫోటో పెట్టిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సరదా ఆయనను చిక్కుల్లో పడేసేట్టు కనిపిస్తోంది. హైదరాబాద్‌‌లో ఓ ఉదయం పూట జరిగిన ఈ వైనం మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీన్ని సీరియస్ గా పరిగణించిన ఉన్నతాధికారులు డ్యూటీ డ్రైవర్ శ్రీధర్ రెడ్డి నుంచి రాతపూర్వక వివరణ కోరారని తెలుస్తోంది.

ఎవరి అనుమతితో వర్మ ఇలా చేశారని వారు ఆరా తీస్తున్నారట..శ్రీధర రెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా వాళ్ళు వర్మ మీద కేసు నమోదు చేయవచ్చునని  అంటున్నారు.

Wednesday, March 4, 2015

"పెయిన్ కిల్లర్‌"గా పనిచేసే ఫ్రూట్స్ ?

చెర్రీ, బెర్రీ ఫ్రూట్స్ పెయిన్‌గా పనిచేస్తాయి. చెర్రీలు రెడ్‌గా ఉండేందుకు కారణం ఆంథోకైనిక్స్ అనే పదార్థమే. ఇది న్యాచులర్‌ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా జాయింట్ పెయిన్‌లను తగ్గించడంలో విశేషంగా ఉపయోగపడుతుంది. 
 
అలాగే బ్లూబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు వాటి వల్ల కలిగే నొప్పి తగ్గిపోతుంది. పెప్టిక్ అల్సర్లు, జీర్ణసమస్యలు, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. 
 
కాన్‌బెర్రీస్ కూడా బ్లూ బెర్రీస్ లాగానే అల్సర్లను, మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఈ కారణాల వల్ల కడుపునొప్పి వచ్చినట్లైతే కాన్‌బెర్రీ జ్యూస్‌తో నొప్పి మటుమాయమవుతుంది.


Tuesday, March 3, 2015

ఒక్కసారి ఆలోచించండి !



Monday, March 2, 2015

బెంగుళూరు లోని "వెరైటి రెస్టారెంట్లు"

బెంగుళూరు లో ఎన్నో నగరాల నుండి వచ్చిన ప్రజలు నివసిస్తారు. కనుక బెంగుళూరు రెస్టారెంట్ లు వారి వారి అభిరుచులకు తగిన ఆహారాలు అందించాలి. ఇరవై నాలుగు గంటలూ కష్టపడే ఇక్కడి ప్రజలకు ఈ బెంగుళూరు లో రుచికర ఆహారాలు తినటం ఒక ఆనందకర అంశంగా వుంటుంది. కుటుంబ సభ్యులతో, లేదా స్నేహితులతో కలసి సాయంకాల సమయం నుండి రాత్రి బాగా పోద్దు పోయే వరకూ వివిధ రెస్టారెంట్ లలో కూర్చుని రిలాక్స్డ్ గా వారికి నచ్చిన వివిధ రుచికర ఆహారాలు తిని ఆనందిస్తారు. బెంగుళూరు ఆహార ప్రియులకు ఒక మంచి ప్రదేశంగా మారింది. ఈ రెస్టారెంట్ లకు వచ్చే వారు సాధారణంగా, పరిశుభ్ర వాతావరణం, నాణ్యత కల ఆహారం, మంచి సేవలు ఆశిస్తారు. బెంగుళూరు లోని విభిన్న సంస్కృతులు ఆహారాల విషయంలో ఒక ప్రత్యేకత ను సంతరించుకొన్నాయి. వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక రెస్టారెంట్ లు బెంగుళూరు లో వెలిశాయి. ఈ రెస్టారెంట్లలో ఉత్తమమైన సేవలు, ఆహారం, పరిశుభ్రతా నిర్వహణ కల వాటిని కొన్నిటిని పరిశీలిద్దాం.

జల్సా జల్సా రెస్టారెంట్ :-
 ఈ ప్రత్యేక రెస్టారెంట్ మారథ హళ్లి లో కలదు. ఈ రెస్ట రెంట్ వాతావరణం మొగలుల కాలం నాటి ఆహారాలు, ఆ నాటి సంగీతం, డ్రామా, వాతావరణం మీకు గుర్తు చేస్తుంది. మొగలుల కాలంనాటి రుచికర వంటకాలను మీకు అందిస్తుంది. రెస్ట రెంట్ లోకి ప్రవేశిస్తే చాలు, అంతా మొగలుల కాలంనాటి వాతావరణమే. సిబ్బంది నవాబుల కాలం నాటి డ్రెస్ లు ధరించి ఉర్దూ కవితలతో అలరిస్తారు. అద్దాలు కల తలుపులు , అతి పెద్ద చాంది లీయర్లు, వైభవోపేత ఫిట్టింగ్ లతో రెస్టారెంట్ మొగలుల విలాస జీవితం గుర్తుకు తెస్తుంది.

బ్లాక్ పెరల్ రెస్టారెంట్ :-
 బెంగుళూరు లో మరొక ప్రత్యేక హోటల్ బ్లాకు పెర్ల్. ఈ రెస్టారెంట్ ఎంతో సృజనాత్మకతలతో నిర్మించారు. ఒక ఓడ, ఓడ దొంగలు వారి జీవన శైలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దాని చుట్టూ కదా అల్లి ఈ రెస్టారెంట్ ను రూపొందించారు. ఈ రెస్టారెంట్ బెంగుళూరు లోని కోరమంగళ లో కలదు. దీనిని రెండు అంతస్తులలో ఓడకు గల పై అంతస్తు, కింది అంతస్తు గా నిర్మించారు. కింది అంతస్తు వాతావరణం అంతా పూర్తిగా ఓడ వలే ఒక ఇంజిన్, మరియు తెడ్డు వంటివి కలిగి వుంటుంది. పై అంతస్తు ఒక దొంగల షిప్ ను పూర్తిగా పోలి వుంటుంది. ఈ రెస్టారెంట్ సిబ్బంది కూడా ఓడ దొంగలు లేదా పైరేట్ దుస్తులు ధరించి మీకు ఆహారాలు అందించటం ఒక ఆసక్తికర అంశం.

ఫిరంగి పన్నిరెస్టారెంట్ :-
 ఈ విభిన్న రెస్టారెంట్ బెంగుళూరు లోని హోసూర్ రోడ్ లో కలదు. ఈ రెస్టారెంట్ పూర్తిగా ఒక ఇంగ్లీష్ పబ్ ని గుర్తుకు తెస్తుంది. వివిధ సంస్కృతుల ప్రజలు వచ్చే ఈ రెస్టారెంట్ లో మీకు పూర్తిగా ఇంగ్లాండ్ లోని హోటల్ శైలి ఆహారాలు వారి అనుకరనలతో అందిస్తారు. మీరు మెచ్చే రుచికర ఆహారాలు, మంచి కిక్ ఇచ్చే వైన్, లికర్ లు కూడా లభిస్తాయి. ఇక్కడి టేబుల్స్ లికర్ బారెల్ వలే వుంటాయి. ఇక్కడి ఫర్నిచర్ చాలా వరకూ ఇంగ్లాండ్ ఫర్నిచర్ ను పోలి వుంటుంది. హోటల్ మధ్య భాగంలో ఒక షిప్ ఉంచారు. ఇది మరింత బ్రిటిష్ శైలి వాతావరణం చూపుతుంది. రిట్రో మ్యూజిక్, కరాకో రాత్రులు ఆహార ప్రియులను అలరిస్తాయి.

గుఫ్హా గుఫ్హా రెస్టారెంట్ :-
గుఫ్హా గుఫ్హా రెస్టారెంట్ ఒక గుహ వలే వుంటుంది. ఇది బెంగుళూరు నగరంలోని జయనగర్ లో కలదు. ప్రత్యేకమైన ఈ రెస్టారెంట్ సీలింగ్ , గోడలు కొండ రాతి వలే వుంటాయి. చెట్ల బెరడ లు వేలాడుతూ వుంటాయి. లైటింగ్ తక్కువగా వుండి మీరు ఒక గుహలో కూర్చుని తింటున్నట్లు వుంటుంది. మూలలలో నిప్పు మంటలు వెలుగుతూ వుంటాయి. ఈ రకమైన మిస్టరీ పరిసరాలు పిల్లలలో భయం కోల్పుతాయి. ఈ హోటల్ సిబ్బంది, ఫారెస్ట్ ఆఫీసర్ ల వలే డ్రెస్ చేసుకొంటారు. మోకాలు వరకు బూట్లు, పెద్ద టోపీలు పెట్టుకొని వుంటారు.

రోహ్ రోహ్ రెస్టారెంట్ :-
 రోహ్ రోహ్ రెస్టారెంట్ బెంగుళూరు లోని బెలందూర్ ప్రదేశంలో కలదు. ఇక్కడ నోరు ఊరే ఫుడ్ మాత్రమే కాక పరిసరాలు కూడా ప్రత్యేకంగా వుంటాయి. ఎంట్రన్స్ లో తెల్లటి ఇసుక, స్టోన్ చ్లిప్స్ వుంటాయి. వివిధ దేశాల రెస్టారెంట్ల వాతావరణం కలిగి వుంటుంది. స్పెయిన్, అరేబియా మొదలగు సంస్కృతులు కలవు. కర్టెన్ లు కొవ్వొత్తుల వెలుగులు, అద్దాలు మరింత అందాన్ని ఇచ్చాయి. సన్నని వెలుగు పడుతూ వుంటుంది. చిన్నపాటి సంగీతం కూడా వినపడుతుంది.

సిల్వర్ మెట్రో రెస్టారెంట్ :-
 సిల్వర్ మెట్రో రెస్టారెంట్ మడివాల లో కలదు. ఇది మెట్రో ట్రైన్ ఆకారంలో వుంటుంది. మెట్రో స్టేషన్ ఆకారంలో ఆ అనుభూతులు కలిగిస్తూ, ఇక్కడ మీకు వివిధ రకాల వంటకాలు లంచ్ మరియు డిన్నర్ లకు బఫే టైపు లో అందిస్తారు. లోపల ఇందిరానగర్, బ్రిగేడ్ రోడ్ వంటి పేర్లు పెట్టిన ప్రదేశాలు రైలు స్టేషన్ అనుభూతి కలిగిస్తాయి. భోజనం చేస్తూ మీరు ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్లు వుంటుంది. పరిసరాలు, ఆహార నాణ్యత ఉన్నతంగా వుంటాయి.

అంగీతి అంగీతి రెస్టారెంట్ :-
 అంగీతి అంగీతి రెస్టారెంట్ గ్రామీణ ప్రాంత పరిసరాలు కలిగి వుంటుంది. ఇది మ్యూజియం రోడ్ లో కలదు. ఒక డాబా హోటల్ వలే వుంటుంది. బ్రాస్ బొమ్మల లతో అలంకరణ చేసారు. ఒక డాబా వలే అలంకరించారు. ఈ రెస్టారెంట్ లో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రైవసీ వుంది.