వర్షాకాలం, చలికాలంలో పిల్లలకు తేలికగా
జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. మెత్తగా
ఉడికించిన అన్నంకి, కొద్దిగా పెరుగు, పంచదార కలిపి బాగా మెత్తగా చేసి
పెట్టాలి. పిల్లలకు తినిపించే ఆహారాల్లో ఇదొక బెస్ట్ ఫుడ్.
కావల్సినన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్
పెరుగన్నంలో ఉన్నాయి. సాధారణంగా పిల్లల పెరుగుదలకు నెయ్యితో కూడిన
ఆహారాన్ని తినిపించాలి. ఇది పెరుగుదలకు మాత్రమే కాకుండా శక్తి, ఎముకలకు
బలాన్ని చేకూర్చుతాయి.
రైస్ లేదా రోటితో పప్పు వంటివి పిల్లలకు
పెట్టొచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాదు వెజిటేబుల్ లేదా చికెన్
తినిపించాలనుకొన్నప్పుడు అందులో పెప్పర్ను చేర్చడం వల్ల కావల్సినన్ని
న్యూట్రిషియన్స్ అందిస్తాయి.
అలాగే వెరైటీగా రైస్ తినిపించవచ్చు.
కిచిడి అనేది పప్పు, రైస్, కూరగాయలతో చాలా మృదువుగా తయారు చేసి
తినిపించవచ్చు. ఇది చాలా రుచిగా ఉండటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తినడమే
కాకుండా అధిక న్యూట్రీషన్లు అందిస్తుంది.
ఇంకా గోధుమ రవ్వను చాలా మెత్తగా ఉడికించి,
కూరగాయలు కూడా చేర్చి తినిపించవచ్చు. చివరగా నెయ్యిని గార్నిష్ చేసి పెడితే
పిల్లలు చాలా ఇష్టంగా తింటారని న్యూట్రీషన్లు అంటున్నారు.
0 comments:
Post a Comment