గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్- బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని
వార్తలు వస్తూనే ఉన్నాయి. సినీ, రాజకీయ పరంగా వీరిమధ్య విభేదాలు వచ్చాయని
ప్రచారం జరిగింది. అయితే, వీటికి బలం చేకూర్చేవిధంగా జూనియర్ ఎన్టీఆర్,
బాలయ్యకు సారీ చెప్పారంటూ ఓ ఇంగ్లీష్ డైలీ తాజాగా ఓ వార్తా కథనం
ప్రచురించింది. ఇటీవలే బాలకృష్ణకు ఫోన్ చేసి జూ. ఎన్టీఆర్ క్షమాపణ
చెప్పారని తెలిపింది. ఇద్దరికి సన్నిహితుడైన ఒక సీనియర్ నటుడి ఫోన్ నుంచి
జూనియర్ ఫోన్ చేసి బాలకృష్ణకు క్షమాపణలు చెప్పారని చెప్పింది.
అంతేకాదు, కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల ప్రభావం ఎన్టీఆర్
కెరీర్ పై పడిందని చెప్పింది. ఇదిలాఉంటే, సంక్రాంతికి బాబాయ్, అబ్బాయ్
పోటాపోటీ గా సినిమాలు రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమైపోయారు. కాని తాజా
పరిణామాల అనంతరం జూ. ఎన్టీఆర్ ఓ అడుగువెనక్కువేసి తన సినిమా రిలీజ్ ని వారం
పాటు వాయిదా వేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో
జూనియర్ సినిమా ఆడియో విడుదలకు బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని
అంటున్నారు. అయితే, దీనికి బాలకృష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని
సమాచారం.
0 comments:
Post a Comment