అమ్మాయిలు అందానికి ఎంతో
ప్రాముఖ్యతనిస్తుంటారు. కొంతమంది తమ పళ్లు ముత్యాల్లా తళతళలాడిపోవాలని
ఏవేవో పద్ధతులు పాటిస్తుంటారు. వీటిలో బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పళ్లు
తోమడం. ఈ రెండూ కలిస్తే రసాయనిక క్రియ జరుగుతుంది. వీటిని బ్రెష్ పై
అద్దుకుని పళ్లు తోముకుంటే పళ్లు తళతళలాడిపోతాయి.
ఐతే వీటిని వారానికి ఒక్కసారి మాత్రమే
వాడాలి. అలాకాకుండా పదేపదే వాడితే పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినే అవకాశం
ఉంది. బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి దంతాలకు పట్టించి ఒక నిమిషం తర్వాత
బ్రష్ తో సున్నితంగా రుద్దుకుని ఆ తర్వాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక్క
నిమిషానికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదు.
0 comments:
Post a Comment