CSS Drop Down Menu

Saturday, August 1, 2015

"శృంగారం" పై" అమ్మాయిలు" ఓపెన్‌గా మాట్లాడుతున్నారా ?

సెక్స్ అనేది ఇప్పుడు అమ్మాయిలకు నిషిద్ధ పదం కాదట. 15-20 ఏళ్ల క్రితం వాళ్లు సెక్స్ అంటే బిడియపడేవారని, సిగ్గుపడేవారని.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మహేందర్ వాత్సా. రోజులు చాలా మారిపోయాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈయన ‘ముంబై మిర్రర్’ పత్రికలో వ్యాసాలు రాసే కాలమిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. దేశంలో ఇంచుమించు ప్రతిసిటీలో సెక్స్ కౌన్సెలింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడమేగాక మన దేశంతోబాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్టు, ఇండోనేషియా, మెక్సికోలలో సైతం వర్క్‌షాపులు నిర్వహించారు. యువకులు సెక్స్‌ను ఎంజాయ్ చేస్తే.. లోగడ అమ్మాయిలు బిడియపడేవారు.
 కానీ.. వాళ్లిప్పుడు ఓపెన్‌గా మాట్లాడుతున్నారని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వాళ్లు కేవలం కౌగిలింతలు, కిస్సింగులకే పరిమితమయ్యేవారు అని ఆయన చెప్పారు. తరాలు మారుతున్నాయన్నారు. శృంగారం అంటే కేవలం లైంగిక క్రీడ మాత్రమే కాదని, భావోద్వేగాలు (ఎమోషన్స్) కూడా కీలకపాత్ర వహిస్తాయని మహేందర్ వాత్సా స్పష్టం చేశారు. ప్రస్తుతం యువతీయువకులు ఉద్యోగాల్లో, ఇతర వ్యాపకాల్లో ఎక్కువసేపు పనిచేయడం వల్లనో.. టెన్షన్స్ పెరుగుతుండడం వల్లనో వారిలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతోందని ఆయన తెలిపారు. అందువల్లే తాము కౌన్సెలింగ్ సెంటర్స్, వర్క్‌షాపుల వంటివి నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

0 comments:

Post a Comment