CSS Drop Down Menu

Friday, June 26, 2015

"యాభై ఏళ్ళ"నుంచి తల్లిగర్భంలోనే "బిడ్డ"

యాభై ఏళ్ళనుంచి తల్లిగర్భంలోనే ఉండిపోయిన బిడ్డను డాక్టర్లు గమనించి బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే...
 చిలీలోని శాన్ అంటోనియా సిటికి చెందిన హాప్పిటల్‌‌‌‌‌‌కు వచ్చిన 92 సంవ త్సరాల మహిళకు ఎక్స్‌‌‌రే తీశారు. దానిని పరిశీలిస్తే ఆమె గర్భంలో నాలుగు పౌండ్ల బరువుండి బాగా ఎదిగిన గర్భస్థ పిండాన్ని కనుగొన్నారు. అయితే అది మృతి చెందిఉన్నట్టు గమనించారు.
 ఎదిగిన పిండం గర్భంలోనే ఇలా గట్టిగా మారిపోవడాన్ని వైద్య పరిభాషలో ‘లిథోపిడియన్’ లేదా ‘స్టోన్ బేబీ’ అని పిలుస్తారని వైద్యులు తెలిపారు. మెడికల్ హిస్టరీలో ఇప్పటిదాకా ఇటువంటివి 300 కేసులు రిజిస్టర్ అయినట్టు డాక్టర్లుచెబుతున్నారు.


0 comments:

Post a Comment