CSS Drop Down Menu

Wednesday, January 7, 2015

భారత్‌లో 'అత్యంత సంపన్నుడైన' స్పోర్ట్స్ పర్సన్‌ ?


 భారత్‌లో అత్యంత సంపన్నుడైన స్పోర్ట్స్ పర్సన్‌గా టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అవతరించాడు. ఈ జార్ఖండ్ డైనమెట్ యేడాదికి రూ.141.80 కోట్లు చొప్పున అర్జిస్తున్నట్టు ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన జాబితాలో పేర్కొంది. ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు.

ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు అగ్రస్థానం దక్కింది. సల్మాన్ (రూ.244 కోట్లు) తర్వాత స్థానాల్లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఈ టాప్-10 జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. కోహ్లీకి 6వ స్థానం, సచిన్ కు 10వ స్థానం లభించాయి.

అంతకుముందు, అక్టోబరులో 'ఫోర్బ్స్' విడుదల చేసిన వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్ పర్సన్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక భారత క్రీడాకారుడు ధోనీయే కావడం గమనార్హం. ఆ జాబితాలో జార్ఖండ్ డైనమైట్ కు 22వ ర్యాంకు దక్కగా, ఇపుడు నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

 

0 comments:

Post a Comment