CSS Drop Down Menu

Wednesday, December 31, 2014

'కుబేరుడి ' వద్ద 'వెంకన్న' తీసుకున్న అప్పు ఎంత ?

 కలియుగదైవంగా భక్తులు కొలుచుకునే వడ్డీకాసులవాడు (శ్రీవేంకటేశ్వర స్వామి) తన వివాహం కోసం కుబేరుడు వద్ద తీసుకున్న అప్పు ఎంత అనే విషయంపై బెంగుళూరుకు చెందిన సమాచార హక్కు కార్యకర్తల(ఆర్టీఐ) టి నరసింహ మూర్తి ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఆయన టీటీడీకి దరఖాస్తు చేశాడు. 2012, ఫిబ్రవరి ఆరో తేదీన దరఖాస్తు చేసుకోగా, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

వాస్తవానికి తిరుమల వెంకన్నను వడ్డీకాసులవాడిగా భక్తులు కొలుచుకుంటుంటారు. పైగా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా వెంకన్న ప్రసిద్ధిగాంచాడు. స్వామి వారిని దర్శించుకునే ప్రతి భక్తుడూ తమ శక్తిమేర తక్కువ మొత్తం నుంచి కోట్లాది రూపాయల వరకు ఆయనకు కానుకగా సమర్పిస్తుంటారు.

అయితే, తిరుమల శ్రీవారు తన వివాహం నిమిత్తం కుబేరుడి వద్ద అప్పు చేశాడని... ఆ అప్పుకు ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నాడనే విషయం భక్తులందరికీ తెలుసు. ఆయన అప్పు తీర్చేందుకు భక్తులందరూ తమ వంతుగా తమ తాహతుకు తగ్గట్టు స్వామి వారి హుండీలో ముడుపులు వేయాలని భక్తులు భావించి కానుకలు వేస్తుంటారు.

ఈ నేపథ్యంలో... ఆర్టీఐ కార్యకర్త టి.నరసింహమూర్తికి. కుబేరుడి వద్ద వెంకన్న తీసుకున్న అప్పు ఎంతో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. వెంటనే దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులో ఇప్పటికే భక్తులందరూ భారీగా హుండీలో డబ్బులు వేశారు... ఇంకా ఎంత వేయాలి? ఎంత కాలం వేయాలి? అనే విషయాలకు సమాధానం చెప్పాలని సమాచార హక్కు చట్టం ద్వారా టీటీడీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, టీటీడీ నుంచి ఇప్పటి వరకు సమాధానం రాకపోవడంతో నరసింహమూర్తి స్పందించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని, సమాధానం వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటానని చెప్పారు. 


Tuesday, December 30, 2014

"మనిషి పోలికల"తో మేక పిల్లలు ?

కర్నాటకలోని హెచ్.డీ.కోట్ తాలూకా షోలాపూర్ గ్రామంలో ఇదో విచిత్రం..అక్కడ భాస్కర్ అనే వ్యక్తికి చెందిన మేక అచ్చం మనిషి పోలికలతో ఉన్న రెండు పిల్లలను కన్నది. అయితే ఇవి కాసేపటికే మరణించాయి. మొదట మగపిల్ల ఈ ఉదయం ఆరున్నర గంటలకు పుట్టగా, ఐదు గంటల తరువాత పుట్టిన రెండోది ఆడపిల్ల అని భాస్కర్ తెలిపాడు. వీటికి కళ్ళు, ముక్కు, నోరు అంతా మనిషి పోలికలే ఉన్నా చెవులు, కాళ్ళు మాత్రం మేకను పోలి ఉన్నాయన్నాడు.


నేను నాలుగేళ్ళుగా ఈ మేకను పెంచుతున్నానని, ఇప్పటివరకు దీనికి పుట్టిన పది పిల్లలు సాధారణంగానే ఉన్నాయి అని అతగాడు చెప్పాడు. ఏది ఏమైనా ఈ విచిత్రం ఆ గ్రామమంతా సంచలనం రేపింది. జనాలు పెద్దసంఖ్యలో వచ్చి ఈ వింతను చూశారు. ఇలా విచిత్రంగా మేకపిల్లలు పుట్టడం అరిష్టమని. ఈ మేక పిల్లల్ని భూమిలో పాతిపెట్టాలని కొందరు భాస్కర్‌కు సలహా ఇచ్చారు. అయితే మరికొందరు వీటిని భద్రపరచాలన్నారు. కాగా- జన్యుపరమైన లోపాలవల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుందని అభ్యుదయవాదులు అంటున్నారు.

‘వరఖ్’ అద్దిన స్వీట్లు, పాన్లు తింటున్నారా ?


వరఖ్.. ఇది చాలామందికి తెలిసిందే. స్వీట్ల మీద, పాన్‌ల మీద మిలమిల మెరుస్తూ వుండే సిల్వర్ ఫాయిల్‌నే ‘వరఖ్’ అంటారు. వెండి రేకుని ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా చాలా పల్చగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత పల్చటి పొరలా తయారు చేస్తారు. వీటిని స్వీట్స్ మీద అద్దుతారు. వరఖ్ అద్దిన స్వీట్లని, పాన్లని మనం చాలా ఇష్టంగా తింటూ వుంటాం. వాటి మీద వరఖ్ వుంది కదా అని ఎక్కువ రేటు చెల్లించి మరీ మనం కొంటూ వుంటాం. నిజానికి వరఖ్ వున్న స్వీట్లు, పాన్లు తినడం వల్ల మనకేమైనా మేలు జరుగుతుందా? మేలు సంగతి అటుంచండి.. కీడు జరిగే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. చూడటానికి చాలా అందంగా కనిపించే ఈ పల్చటి వెండి రేకులు వలన చాలా ప్రమాదాలు ఉన్నాయట. వరఖ్ వాడటం వల్ల స్వీట్లు, పాన్లు చూడగానే ఎట్రాక్టివ్‌గా వుంటాయి. అయితే ఈ అతి పల్చటి వెండి రేకుల్లో హానికారక పదార్ధాలు ఉంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిల్లో క్యాన్సర్ కారక లోహాలు కొన్ని ఉంటున్నాయట. ఈ వరఖ్ మీద ‘ఇండస్ట్రియల్ టాక్సీకాలజీ రిసెర్చ్ సెంటర్’ పరిశోధకులు లక్నోలో ఆ మధ్య ఓ అధ్యయనంలో నిర్వహించారు. వరఖ్‌లో వెండితోపాటు సీసం, కాడ్మియం వంటివి ఉన్నట్టు గుర్తించారు. వరఖ్ తయారీ కోసం శుద్ధమైన వెండిని ఉపయోగించాలి. అయితే వరఖ్ తయారు చేస్తున్నవారు సరిగా శుద్ధి చేసిన వెండిని ఉపయోగించడం వల్లనే సమస్యలు వస్తున్నాయంటున్నారు పరిశోధకులు. ఆహార పదార్ధాలు, కల్తీ నివారణ చట్టం ప్రకారం 99.9 శాతం స్వచ్చమైన వెండిని మాత్రమే వరఖ్తయారీలో ఉపయోగించాలి. కానీ వాస్తవంలో అలా జరగటంలేదుట. ఆహార పదార్ధాలలో వాడే వరఖ్ నాణ్యతపై కచ్చితమైన నియంత్రణలు ఉండాలని సూచిస్తున్నారు వారు. అంచేత ఈసారి వరఖ్ అద్దిన స్వీట్లు, పాన్‌ తినేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకోండేం!

Monday, December 29, 2014

ఒక్క రాత్రి కి "5 కోట్లా " ?


దేశంలో అమ్మాయిలే లేరన్నట్లుగా అందరూ పోర్న్ స్టార్ నే పట్టుకుంటున్నారు. హాట్ అనే మాట వచ్చిందంటే సన్నీని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అంతలా డిమాండ్ ఉంది కాబట్టే.., మోడిని సైతం దాటుకుని దేశంలోనే ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న సెలబ్రిటీగా నిలిచింది సన్నీ లియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోలకు హీటు పెంచుతూ.., హీరోయిన్లకు ఈర్ష్య పుట్టిస్తున్న హాట్ గర్ల్ నూతన సంవత్సర వేడుకలను హైదరాబాద్ లోనే జరుపుకుటుందట. సినిమాలిచ్చే బాంబే కంటే భాగ్యనగరంపై ఎందుకంత ప్రేమా.. అంటే డబ్బులొస్తున్నాయి కదా అని చెప్తోంది.

నూతన సంవత్సర వేడుకల కోసం రెడి అవుతున్న హైదరాబాద్.., చలిని తొలగించి ఆ రాత్రిని వేడెక్కిందుకు సన్నీని పిలుస్తోంది. ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వాహకులు సన్నీతో స్పెషల్ డాన్స్ షో నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ లోని ఓ కన్వెన్షన్ హాల్ లో జరిగే ఈ కార్యక్రమంలో ఏడాదిలో చివరి రోజు రాత్రి చివరి క్షణాల్లో పోర్న్ పాప ఆడి పాడనుందట. అయితే కన్వెన్షన్ హాలు పేరు సీక్రెట్ గా ఉంచారు. ఈవెంట్ కోసం భారీగానే వసూలు చేస్తున్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఒక్క రాత్రి షో కోసం ఎవరూ ఊహించని విధంగా రూ. 5కోట్లు డిమాండ్ చేసిందట. బేబీకి ఉన్న డిమాండ్ తో ఈవెంట్ నిర్వాహకులు సరే అని తల ఊపేశారట ( బహుశా అమ్మడిని చూస్తూ నోట మాట రాలేదేమో).

హీటర్ కన్పిస్తే.., చలికాచుకోకుండా మగానుభావులు ఆగరని ఊహించి సన్నీకి గట్టి భద్రత కల్పిస్తున్నారు. పది మంది గార్డులను పెట్టారు. వీరితో పాటు కండలు బలిసిన బౌన్సర్లను కూడా పెట్టి అందాలకు అదనపు రక్షణ కల్పిస్తున్నారు. రక్తం గడ్డ కట్టే రాత్రి చలిలో.., అర్ధ రాత్రి మద్దెల దరువు అన్నట్లుగా సన్నీ లియోన్ డాన్స్ ఎలా ఉంటుందో అని ఇప్పుడిప్పుడే అందరూ తహతహలాడుతున్నారు. ఇక ఈ ఈవెంట్ కు టికెట్లు, ఎంట్రీ పాసులు ఇప్పటికే బుక్ అయినట్లు సమాచారం. సన్నీయా మజాకా.


పెళ్లి గిఫ్టు గా "రక్తదానం" ?


 గుజరాత్ వడోదరలోని డాక్టర్ ఆర్.బి.భిసానియా వెరీ పాపులర్. ఇటీవలే ఆయన కుమార్తె వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులంతా ఉత్తచేతులతోనే వచ్చారు. గిఫ్టులేమీ పట్టకెళ్లలేదు. కానీ, వారు వధూవరులను ఆశీర్వదించిన తర్వాత పెళ్లికి వెళ్లిన వారు  ఏం చేశారో తెలుసా?... రక్తదానం చేశారు.

దాంతోపాటే, అవయవదానం ప్రతిజ్ఞ చేశారు. ఆ విధంగా, మానవత్వాన్నే బహుమతులుగా ఇచ్చారు. దీనికంతటికీ వధువు తండ్రి డాక్టర్ భిసానియానే కారణం. ఆయన అతిథులందరికీ ముందే చెప్పారు... గిఫ్టులు ఏవీ వద్దని, చేయదలిస్తే రక్తదానం, అవయవదానం ప్రతిజ్ఞ చేయమని విజ్ఞప్తి చేశారు.

దీనిపై డాక్టర్ భిసానియా మాట్లాడుతూ, రక్తదానం, అవయవదానంపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ ఆలోచన చేశామని చెప్పారు. తన కుమార్తె డాక్టర్ ధ్వని, అల్లుడు డాక్టర్ జయ్ పాండ్య కూడా దానానికి ముందుకువచ్చారని పేర్కొన్నారు.

కాగా, ఈ వివాహంలో ముస్లింలు కూడా రక్తదానం చేసి మతసామరస్యాన్ని చాటారు. నగర శివార్లలో జరిగిన ఈ వివాహంలో 370 మంది వరకు రక్తదానం చేశారట.

Saturday, December 27, 2014

గాడిద పాలు లీటర్ 5000/- ?


గంగి గోవు పాలు గరిటడైనను చాలు
కడవడైన నేమి ఖరము పాలు
భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభి రామ వినుర వేమా...!

 అది అప్పుడు వేమన చెప్పిన పద్యం. కానీ ఇప్పుడు గంగిగోవు పాలును మించి ఖరము పాలు అధిక రేటును పలుకుతోంది. ఇది హాస్యానికి చెప్పే మాట కానే కాదు. ఆవు పాలు కావాలంటే మీ ఇంటి ముంగిటకు వచ్చి లీటర్లకు లీటర్లు చేరిపోతాయి. కాని గాడిద పాల కోసం అక్కడ క్యూ కడుతున్నారు. అదే లీటరో, రెండు లీటర్ల కోసమే కాదు. రెండు మూడు మిల్లీ లీటర్ల కోసమే. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్న యదార్థం.

గాడిద పాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉందనే విషయం బయట పడిందే ఆలస్యం జనం వాటి కోసం వెంపర్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒక చోటు కాదు విశాఖపట్నం నుంచి అనంతపురం వరకూ అలాగే తెలంగాణలో అదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకూ ఇదే వ్యాపారం సాగుతోంది. ఓ గాడిదను తోలుకుని నగరాల్లో వీధివీధి తిరుగుతూ గాడిద పాలు అమ్మడానికి దర్శనమిస్తున్నారు.

ఆదిలాబాద్‌కు చెందిన రాజు అనే యువకుడు ఓ గాడిద పాలతోనే వేలాది రూపాయలు సంపాదించేస్తున్నాడు. సాధారణంగా గేదెలు, ఆవులు ఇచ్చినట్లుగా గాడిద లీటర్లకు లీటర్లు పాలు ఇవ్వదు. మహా అంటే లీటరు పాలు ఎక్కువ. అర లీటరు ఇచ్చే గాడిదలే ఎక్కువ. 10 మిల్లీ లీటర్లు పాలు రూ. 100 నుంచి 200 వరకూ పలుకుతున్నాయి. లీటర్ పాలు కనీసం రూ. 5 వేల రూపాయలు పలుకుతున్నాయి. చంటి పిల్లలకు ఒక స్పూన్ గాడిద పాల కోసం ఎగబడే జనం కూడా ఉన్నారు. అసలు ఈ గాడిద పాలతో ఏం ప్రయోజనాలున్నాయో చూద్దాం.

1. ఇందులో పెద్ద మొత్తంలో బి, బి12, సి విటమిన్లలతోపాటు న్యూట్రిన్లు ఉంటాయి.
2. తల్లి పాలతో సమానమైన స్థాయిలో కాలరీలు, మినరల్స్ ఉంటాయి. ఈ పాలు గేదె పాలతో సమానమైన బలం ఉంటుందని భావిస్తారు.
3. అప్పుడే పుట్టిన పిల్లల్లోని ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నివారణకు గాడిద పాలతో పరిష్కారం అవుతుందని నమ్మకం ఉంది.
4. అప్పుడే పుట్టిన పిల్లలో క్షయ, ఆస్తమా, గొంతు సంబంధిత వ్యాధుల నివారణకు తయారుచేసే ఆయుర్వేద మందులలో గాడిద పాలను వినియోగిస్తారు.
5. గాడిద పాలలో ప్రొటీనులు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. కానీ మినరల్స్, విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి.
6. ఆవులు వల్ల వచ్చే అలెర్జీ సంబంధిత వ్యాధులకు గాడిద పాలతో నయమవుతాయి.
7. నవజాత శిశువులకు పూర్తి ఆహారాన్ని అందించడంతోపాటు వారిలోని చర్మవ్యాధులను నయం చేస్తుంది.
8. గాడిద పాలలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల్లో ఎముకల పటిష్టత, విరిగిన ఎముకలను అతికించే స్వభావం అధికంగా ఉంటుంది.
9. తల్లిపాలతో పోల్చుకుంటే కనీసం 60 రెట్ల  విటమిన్ సి ఉంటుంది. అందుకే గాడిద పాల కోసం ఎగబడుతున్నారు.


Friday, December 26, 2014

"జ‌ప‌మాల‌"లో "108 పూస‌లే" ఎందుకుంటాయి ?


జ‌ప‌మాల ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసిందే. హిందూ ధ‌ర్మంలో పూజ‌ల స‌మ‌యంలో... శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు జ‌ప‌మాల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇందులో 108 పూస‌లుంటాయి. ఇంత‌కూ జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెన‌క కొన్ని ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి.



 ఒక‌వ్య‌క్తి ఒక‌రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌. అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మ‌నిషి దేవుడి స్మ‌ర‌ణ‌లో జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి... చివ‌రి రెండు సున్నాల‌ను తీసేసి 108 ను నిర్ధారించార‌ని చెబుతారు.   

108 వెన‌క మ‌రో క‌థ ప్ర‌చారంలో ఉంది. మొత్తం 12 రాశులున్నాయి. ఈరాశుల‌తో తొమ్మిది గ్ర‌హాలున్నాయి. రాశుల సంఖ్య‌ను గ్ర‌హాల‌తో గుణిస్తే వ‌చ్చేది 108. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించార‌ట‌. ఈ 108 పూస‌లు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ట‌.

 జ్యోతిష్య శాస్త్రంలో 27 న‌క్ష‌త్రాలుంటాయ‌ని భావిస్తారు. ఒక్కో న‌క్ష‌త్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 న‌క్ష‌త్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి. జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ట‌.  

అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్య‌గా భావిస్తారు. హిందూ ధ‌ర్మ శాస్త్ర ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చ‌దవాల‌ని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి క‌రుణ ఉంటుంద‌ని అంటారు. దానికి అనుగుణంగా 108 పూస‌ల‌ను నిర్ధారించార‌ని  ప్ర‌చారంలో ఉంది.


"రెండు" గంటల్లో "కోటి" రూపాయలు ?


హుదూర్ బాధితుల కోసం గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం రెండు గంటలకే చిత్తూరు ప్రోగ్రామ్‌లో కోటి రూపాయలు సమకూరిస్తే.. యావత్తు సినీ ఇండస్ట్రీ ఒకటి నిలిచి పన్నెండు గంటల పాటు ఓ కార్యక్రమం చేస్తే కేవలం 11 కోట్లు మాత్రమే సమకూరిందని సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడి భరద్వాజ్ విమర్శించారు.

Thursday, December 25, 2014

తోటి ప్రాణుల నుండి గ్రహించవలసినవి ...!

లేవడంలో - కోడి
పరుగులో - గుర్రం
వినడంలో - పిల్లి
విశ్వాసంలో - కుక్క
తల్లిగా - ఆవు
సేవలో - ఎద్దు
శాంతికి - పావురం
గానములో - కోకిల
నాట్యంలో - నెమలి
విజ్ఞానానికి - హంస
పౌరుషంలో - పొట్టేలు
సాహసంలో - పులి
పరాక్రమంలో - సింహం
బుద్దిలో - ఏనుగు
నిరంతర శ్రమకు - చీమ
నిశిత దృష్టిలో - గ్రద్ద
* ఇతర ప్రాణులకు ఒకే గుణం ఉంటుంది. మానవ జాతికి అనేక గుణాలు ఉంటాయి.
* ప్రతి మనిషిలో విశేషంగా ఏదో ఒక ప్రాణి గుణం ఉంటుంది.

Wednesday, December 24, 2014

రజనీకాంత్ గురించి ఆసక్తికర విషయాలు !


రజనీకాంత్‌ జీవితంలోని పలు ఆసక్తికరమైన అంశాలు మీ కోసం... 
1. ప్రతి హోలీ పండుగకు తన గురువు బాలచందర్‌కు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకుంటారు. కానీ ఆ రోజే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం బాలచందర్‌కూ తెలియదు. తీరా కొన్ని సంవత్సరాల తర్వాత అడిగితే.. 'నాకు రజనీకాంత్‌ అని పేరు పెట్టింది హోలీ రోజునే సార్‌!'అన్నారట. 
2. రజనీకాంత్‌ ఉన్నప్పుడు ఇంటిలో నిత్యం 'ఓం'కార నాదం వింటూనే ఉంటారు. 
3. రజనీకాంత్‌ ఇష్ట దైవం వినాయకుడు. 
4. తిరుపతి ఆలయంలోనే రజనీకాంత్‌ వివాహం జరిగింది. 
5. రోడ్డుపక్కనున్న కాకా హోటళ్ల ప్రియుడు రజనీ. పోరూర్‌ సిగ్నల్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇప్పటికీ వెళ్లొస్తారట. 
6. ఏవీఎం స్టూడియోలో రజనీకాంత్‌ మేకప్‌రూమ్‌ నెం.10 
7. చెన్నైలో షూటింగ్‌ అంటే రజనీకే కాకుండా, మరో 25 మంది వరకు భోజనం ఇంటి నుంచే వెళ్తుంది. 
8. తన ఇంటిలో ఉద్యోగం చేస్తున్న అందరికీ నీలాంగరైలో ఓ ప్లాట్‌ను కొనిచ్చారు. వారిపేరుపై కొంత మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కూడా చేశారు. 
9. మెరీనాలో విక్రయించే వేరుశనగలంటే రజనీకాంత్‌కు చాలా ఇష్టం. 
10. 'ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు'.. స్వామి వివేకానందుడి ఈ సూక్తే రజనీకాంత్‌ గుమ్మంపై ఉంటుంది. 
11. రజనీకాంత్‌ మాట్లాడిన తొలి పంచ్‌ డైలాగ్‌ 'ఇదు ఎప్పడి ఇరుక్కు'(ఇది ఎలా ఉంది?) 
12. రజనీకాంత్‌ మాంసాహార ప్రియుడు. ముఖ్యంగా మటన్‌, తలకాయ కూరంటే ఇష్టంగా తింటారు. 
13. తన చిత్ర షూటింగ్‌ పూర్తయ్యాక ఆ చిత్ర సహాయ దర్శకుడికి ఓ మొత్తాన్ని కానుకగా ఇవ్వటం రజనీకాంత్‌ అలవాటు. ఆ మొత్తం కనీసం రూ.50 వేలు. 
14. తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. 
15. అత్యధికంగా ఎస్‌.పి.ముత్తురామన్‌ దర్శకత్వంలో 25 చిత్రాల్లో నటించారు. 
16. హిమాలయాలనే కాకుండా ఏ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లినా అక్కడి రుద్రాక్షలను సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన రుద్రాక్షలు రజనీ ఇంటిలో కుప్పలతెప్పలుగా ఉంటాయి. 
17. తనకు నచ్చిన పాటకు సంగీత దర్శకుడెవరో తెలుసుకుని ఫోన్‌ చేసి వారిని అభినందిస్తారు. 
18. పోయస్‌ గార్డెన్‌ నివాసంలో ఉంటే రజనీకాంత్‌ నిద్రపోయేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతుంది. తన ఇంటిలోని పెద్ద అద్దం ముందు నిలబడి రిహార్సల్స్‌ చేస్తుంటారట. 
19. తనకు ఎంత ఆప్తులైనా వారి కోసం సిఫారసు మాత్రం చేయరు. 
20. సిగరెట్‌ తాగటం చాలా ఇష్టం. అయితే ఇప్పుడా అలవాటు మానుకున్నారు. 
21. రజనీకాంత్‌కు ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించిన ఘనత ఇళయరాజాదే. ఇళయరాజాను 'స్వామి' అంటూ మర్యాదగా సంబోధిస్తారు. 22. పర్సు, క్రెడిట్‌ కార్డులు వాడే అలవాటు లేదు. బయకెళ్లినప్పుడు ప్యాకెట్‌ మనీగా రూ.500 మాత్రమే తీసుకెళ్తారు. 
23. అప్పుడప్పుడు స్నేహితుల ఇంటికి అకస్మికంగా వెళ్లి వారిని ఉత్సాహ పరుస్తుంటారు. తనతో ఫొటో దిగేందుకు వచ్చే వారిలో చిన్నారులుంటే వారిని ఎత్తుకుని ఫోజివ్వటం రజనీకాంత్‌ అలవాటు. 
24. పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్‌ ఇంటి పేరు 'బృందావన్‌'. ఇది ఆయనే పెట్టుకున్నారు. దానిపై 'సత్యమేవజయతే..' అని పెద్దక్షరాలతో లిఖించారు. 25. విమాన ప్రయాణాలకన్నా రైలు ప్రయాణాలకే రజనీకాంత్‌ మొగ్గుచూపుతారు. 
26. బూట్లు ధరించటాన్ని ఇష్టపడరు. షూటింగ్‌ సందర్భంలో కూడా అవసరం మేరకే. చెప్పులు ధరించటమే ఇష్టం. 
27. రోజూ రెండు చిత్రాలను చూడటం అలవాటు. వాటిలో ఒకటి తప్పనిసరిగా ఆంగ్లం ఉంటుంది. 
28. ఇరవైసార్లుకు పైగా రక్తదానం చేసిన అభిమానులకు తన సంతకంతో కూడిన ప్రశంసాపత్రం అందించటం రజనీ అలవాటు.
 29. తొలినాళ్లలో నలుపు వస్త్రాలను ఇష్టపడే రజనీకాంత్‌ ప్రస్తుతం తెలుపునకు మారారు. 
30. రజనీకాంత్‌ నటించిన ఏకైన ఆంగ్ల చిత్రం 'బ్లడ్ స్టోన్‌' 1988 అక్టోబరు 7న విడుదలైంది. అక్కడా అభిమానులను సంపాందించిపెట్టింది. 
31. 'నేను ఆధ్యాత్మికవేత్తనే. అయితే ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలన్నంత కాదు. అలాంటి పద్ధతి నాకు ఇష్టం లేద'ని ఓసారి వ్యాఖ్యానించారు. 
32. తన వద్ద 25 ఏళ్లుగా విధులు నిర్వహించి విరమణ పొందిన వ్యక్తిగత సహాయకుడు జయరామన్‌కు నేటికీ వేతనం అందిస్తూనే ఉన్నారు. 
33. విదేశాలకు వెళ్లినప్పుడు సరదాగా అక్కడి బస్సుల్లో నిల్చొనే ప్రయాణిస్తారు. కారణం అడిగితే కండక్టర్‌ కాలం నాటి అలవాటు అని చెబుతుంటారు. 
34. అల్లుడు ధనుష్‌ ప్రతి పుట్టినరోజుకు ఓ వెండి కంచం, గ్లాస్‌ కానుకగా ఇస్తుంటారు. 
35. 'ముల్లుం మలరుం' చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్‌ రాసిన ఉత్తరాన్ని నేటికీ ఆయన భద్రంగా దాచుకున్నారు. 
36. గతంలో రజనీ తన కుడిచేతికి కడియం ధరించేవారు. ఇప్పుడది నెల్త్లెకి చెందిన తన అభిమాని తిరుమారన్‌ కు బహుమతిగా వెళ్లింది.
 

Tuesday, December 23, 2014

భోజనాలకే "కోటిరూపాయలు"



నాగ్ బాడీ సీక్రెట్‌...?


 సినిమా ఫీల్డు అంటే గ్లామర్‌. ఎప్పుడూ అందంగా కన్పించాలని హీరోలు హీరోయిన్లు తాపత్రయపడుతుంటారు. అందుకు తగినవిధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. దానికి ఎంతైనా ఖర్చుపెడతారు. హీరోయిన్లు మాత్రం ఇందుకు చాలా కేర్‌ తీసుకుంటారు. హీరోల్లో నాగార్జున ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడనేది ఇండస్ట్రీలో నెలకొంది. అసలు నాగార్జున హెయిర్‌ నిజమా కాదా? అనేది కూడా అనుమానమే. ఈ విషయమై ఓసారి ఓ ప్రముఖ వ్యక్తి కామెంట్‌ చేస్తే ఆ వ్యక్తిపై విరుచుకుపడ్డాడు కూడా. తన జుట్టును గట్టిగా పట్టుకుని మరీ చూపించాడు షూటింగ్‌లోనే.

అయితే తన ఆరోగ్యం మాత్రం తన తండ్రి నుంచే నేర్చుకున్నానని చెబుతాడు. ఎర్లీగా లేచి తగు వ్యాయామాలు ఫుడ్‌ తీసుకోవడం అనేది అందరికీ చెప్పేస్తాడు. కానీ అందరి హీరోల్లో శరీరంలో మార్పులు వస్తూ కాస్త వయసు తేడాలు కనిపిస్తుంటాయి. కానీ నాగార్జునలో అలాంటి మార్పు కన్పించదు.

మన్మథుడుగా వుంటాడని సినిమావాళ్లు రివ్యూల్లోనూ రాస్తుంటారు. బయట కూడా అలాగే చెబుతుంటారు. కానీ ఇదే విషయం ఇటీవలే మీలో ఎవరు కోటీశ్వరుడు ఓ వ్యక్తి అడిగితే... అది సీక్రెట్‌.. ఎవరికీ చెప్పేది కాదని సింపుల్‌గా తేల్చేశాడు. అంటే ఎవరికీ తెలీని బాడీ సీక్రెట్‌ను నాగ్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నాడన్నమాట.

Monday, December 22, 2014

పిల్లల్ని ఎడమవైపునే ఎందుకు ఎత్తుకుంటారు?


సాధారణంగా మనం పిల్లల్ని ఏ చేత్తో ఎత్తుకుంటామో ఎప్పుడైనా గమనించారా? అన్ని పనులూ కుడి చేతితో చేసే అలవాటు వున్న వారు కూడా పిల్లల్ని ఎడమ చేత్తో ఎత్తుకుంటారు. ఒక్క మన దేశంలోనే కాదు, ఎక్కడైనా ఇదే అలవాటు. పిల్లల్ని ఎత్తుకోవాల్సివచ్చే సరికి స్త్రీలంతా  ఎందుకిలా ఎడమ చేతి వాటాన్ని ఉపయోగిస్తారు. అనే దానిపై మానసిక శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం జరిపారు. దానిలో వారు గ్రహించిందేంటంటే...  స్త్రీల మెదడులో కుడివైపు భాగం ఉద్వేగాలను, ముఖాలను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుందట. పసి పిల్లల ముఖాలను, అప్యాయత చిలకరించే వారి ఉద్వేగాలను మెదడులోని కుడివైపు భాగమే ఎక్కువగా ఆకర్షిస్తోంది. కుడివైపు మెదడు సంకేతాలు ఎడమ చేతి వాటాన్ని ప్రోత్సహిస్తాయి. అందువల్ల మహిళలు పిల్లల్ని ఎడమచేతివాటంతో ఎత్తుకుంటారు.

"పాఠాలు" చెప్పనున్న "పవన్"


తెలుగు దేశం మినిస్టర్ గంటా శ్రీనివాస రావు కుమారుడు గంటా రవితేజ త్వరలో హీరోగా లాంచ్ అవుతన్న సంగతి తెలిసిందే. తణికెళ్ల భరణి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ నేపధ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ ని స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి తన కుమారుడుకి నటనలో కొన్ని టిప్స్ చెప్పి గైడ్ చేయమని కోరినట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు తో ఉన్న అనుబంధంతో పవన్ ఒప్పుకున్నాడని, గోపాల గోపాల షూటింగ్ అనంతరం పంపమని కోరినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక నాగార్జున సైతం ఈ కొత్త హీరోకు కొన్ని సలహాలు ఇచ్చారని, ఇప్పటికే నాగ్ ని కలిసారని వినపడుతోంది.


Saturday, December 20, 2014

"పవన్" కి "విగ్రహం"




Friday, December 19, 2014

"లేటు వయసులో 'కళ్ళు తిరిగే' పారితోషికాలు" ?

 
గతంలో హీరోయిన్స్‌గా ఓ ఊపు ఊపి, పెళ్లయ్యాక వెండితెరకు గ్యాప్ ఇచ్చి, మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న కొంతమంది కథానాయికలు ఇప్పుడు కళ్ళు తిరిగే పారితోషికాలను పుచ్చుకుంటున్నారు.
 
ఇప్పటికే ఈ విషయంలో అరవై లక్షలు తీసుకుంటూ నదియా వార్తల్లో నిలవగా, తాజాగా రమ్యకృష్ణ కూడా రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తోంది. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'ఆంబళ' సినిమాలో నటించడానికి ఆమె ఏకంగా 90 లక్షలు తీసుకుంటున్నట్టు కోలీవుడ్ సమాచారం. 
 
ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమె విశాల్‌కు అత్తగా నటిస్తోంది. ఇందుకు గాను రోజు వారీ వేతనంగా 3 లక్షలు చార్జ్ చేస్తోందట. అంటే ఈ సినిమాకు మొత్తం 30 రోజుల డేట్స్ ఇచ్చింది. సో ... ఆ విధంగా ఈవిడ గారి మొత్తం పారితోషికం చూసుకుంటే 90 లక్షలన్న మాట. లేటు వయసులో లక్ అంటే ఇదేనేమో!

జ్ఞాపకశక్తికి "బ్రెయిన్ జిమ్"!!!


ఈమధ్య కాలంలో జ్ఞాపకశక్తికి బ్రెయిన్ జిమ్ చేయాల్సిందేనని నిపుణులు తరచూ చెప్పటం వింటున్నాం. అసలు ఈ బ్రెయిన్ జిమ్ అంటే ఏమిటి? ఎలా చేయాలి అంటే...

* మన మెదడుని కుడి, ఎడమలుగా విడదీసి కుడి మెదలు, ఎడమ మెదడు అంటారు. ఈ రెండు మెదడులు చురుకుగా వుంటే మంచి జ్ఞాపకశక్తి సొంతమవుతుంది. మరి ఈ రెండు మెదడులు చురుకుగా వుంచటమెలా అంటే, వాటికి పని కల్పించటమే...

* ఎడమచేయి, ఎడమకాలు పనిచేస్తే కుడివైపు మెదడు పనిచేస్తుంది. చురుకుగా వుంటుంది. కుడికాలు, కుడిచేయి పనిచేస్తే ఎడమ మెదడు పనిచేయడం మొదలుపెడుతుంది. సాధారణంగా మనందరం కుడి చేయి, కుడికాలునే ఎక్కువగా కదిలిస్తుంటాం. వాటితోనే పనిచేస్తుంటాం. అలా కాకుండా రెండు చేతులు, కాళ్ళను సమానంగా పనిచేయించ గలిగితే మెదడులోని రెండు భాగాలు చురుకుగా వుంటాయి. కాబట్టి ప్రతిరోజూ రెండు చేతులు, రెండు కాళ్ళను కదిలించేలా వ్యాయామం చేయాలి.

* ఇక పంచేంద్రియాలకు వ్యాయామం ఇవ్వగలిగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చెవులని బ్రెయిన్ క్యాప్స్ అంటారు. వీటికి రోజూ మసాజ్ చేసుకోవాలి. అలాగే కళ్ళు మూసుకుని ఏదైనా పని చేయడం ద్వారా కళ్ళకు వ్యాయామం అయినట్టే. కళ్ళు మూసుకుని వాసనబట్టి వస్తువుని గుర్తుపట్టడం, రుచితో ఆహారాన్ని గుర్తించడం ఇలా చిన్న చిన్న ఛాలెంజెస్‌ని మన పంచేంద్రియాలకు రోజూ ఇస్తూ వెళ్తే వాటికి కావల్సినంత ఎక్సర్‌సైజ్ ఇచ్చినట్టే.

Thursday, December 18, 2014

Wednesday, December 17, 2014

"స్కిప్పింగ్" తో "ఆరోగ్యం"


రకరకాల వ్యాయామాలపై దృష్టి సారిస్తూ, కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే., ఇంకొందరు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని రోజు అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నారు. ఇది ఏలా సాధ్యం...

* శరీరం మొత్తానికి ఓకేసారి వ్యాయామం, తాడాట (స్కిప్పింగ్)తో సాధ్యమవుతుందని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు.

* శరీరంలోని అవయవాల కదిలికను వేగవంతం చేయ్యటంతో పాటు వాటి మధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తోడ్పడుతుందట.

*  రోజు స్కిప్పింగ్ చేయ్యటం వల్ల శరీరం ధృడత్వాన్ని సంతరించుకోవటంతో పాటు పూర్తి స్థాయిలో ఫిట్‌గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటంతో పాటు చర్మంపై ఏర్పడ్డ ముడతలు తొలగిపోతాయి.

*  స్కిప్పింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయ్యటం వల్ల పాదాలకు నొప్పి కలుగుతుంది. దాంతోపాటు పగుళ్లు ఏర్పడతాయి.

* ముఖ్యంగా కాంక్రీట్ నేలపై స్కిప్పింగ్ చేసే సందర్భంలో బూట్లు వేసుకోవటం మంచింది.

* బరువు తగ్గించటంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.

* స్కిప్పింగ్ ప్రారంభించే ముందు ఐదు నిమిషాల పాటు వార్మప్ చేయ్యటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

"పక్షుల"తో "ఆత్మాహుతి" దాడులు?

 
ఉగ్రవాదుల ఆలోచనలు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చేందుకు మహిళా మానవ బాంబు (ఆత్మాహుతి దళం)ను ఎల్టీటీఈ తయారు చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆత్మాహుతి దాడులు ఎక్కువగా ప్రాచూర్యం పొందాయి. ఈ తరహా దాడులతో అనేక మంది ప్రాణాలను తీవ్రవాదులు తీస్తున్నారు. 
 
కొందరు కరుడుగట్టిన ఉగ్రవాదులు ఆత్మాహుతి సభ్యులుగా మారి, తమను తాము బలి చేసుకుని మరెంతో మందిని బలి తీసుకోవడమే ఆత్మాహుతి దాడి. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉగ్రవాదులు కూడా తమ ఆలోచనా విధానానికి పదును పెడుతున్నారు. ఈ కోవలోనే తాలిబన్ తీవ్రవాదులు సరికొత్త ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 
 
కొన్ని జాతులకు చెందిన పక్షులను ఎన్నుకొని వాటికి చిన్నతనం నుంచి శిక్షణ ఇచ్చి వాటినే ఆత్మాహుతి బాంబర్లుగా ఉపయోగిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక పక్షిని కాల్చి చంపడంతో విషయమంతా బయటకు వచ్చింది. 
 
బైనాక్యులర్లతో ఫర్యాబ్ రాష్ట్రంలోని తుర్కమెనిస్థాన్ సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సైనికాధికారులకు ఎప్పుడూ చూడని ఓ వింత పక్షిని గుర్తించారు. అలాంటి పక్షులు తమ ప్రాంతంలో కనిపించవన్న అనుమానంతో, మరింతగా పరిశీలిస్తే కొన్ని వైర్లు కనపడ్డాయి. వెంటనే ఆ పక్షిని కాల్చి చంపారు. 
 
పక్షికి పేలుడు పదార్థాలతో కూడిన సంచిని, జీపీఎస్ ట్రాకర్‌ను, డిటొనేటర్‌ను కట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన 'ఆత్మహుతి జాకెట్'ను కూడా తొడిగారు. ఓ చిన్న కెమెరా కూడా ఉంది. దాడి చేసేందుకు సైన్యం దగ్గరకు అంత సులువుగా వెళ్ళలేమన్న కారణంతో, పక్షులనే తమ ఆత్మాహుతి దళంగా తాలిబన్లు మార్చుకున్నట్లు తెలుస్తోంది. 


Tuesday, December 16, 2014

"గర్భిణీ స్త్రీలు" రోజూ 2 కప్పులు "కాఫీ" సేవిస్తే..?

 
గర్భిణీ మహిళలు రోజుకు రెండు కప్పులు కాఫీ సేవిస్తే గర్భస్థ శిశువుకు బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని పరిశోధనలో తేలింది. గర్భిణీలు కాఫీ సేవించడం శిశువుకు 60 శాతం క్యాన్సర్ వచ్చే ఛాన్సుందని అమెరికన్ ఆఫ్ ఒ ఆప్స్‌టెట్- రిక్స్ అండ్ గైనకాలజీ ప్రచురించిన అధ్యయనంలో తెలియవచ్చింది. 
 
దీనిపై గర్భిణీల్లో చైతన్యం కలిగించాలని పేర్కొన్న అధ్యయనకారులు.. కాఫీ సేవనాన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ తగ్గించాలన్నారు. అలాగే ఒక రోజుకు నాలుగు కప్పుల కాఫీ తీసుకుంటే బ్లడ్ క్యాన్సర్ 72 శాతం పెరిగే ఛాన్సుంది. కాఫీలో ఉన్న కెఫైన్ గర్భస్థ శిశువులోని డీఎన్ఏ మార్పు ఏర్పడుతుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.
 


"ఎన్టీఆర్‌"తో సినిమా చేసే "సత్తా, అర్హత" నాకు లేవు ? వర్మ

టెంపర్ ఫస్ట్ లుక్ ఫోటోలపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఎప్పుడూ నెగటివ్ కామెంట్లిచ్చే వర్మకు ఏమైందో గానీ టెంపర్ ఫస్ట్ లుక్ ఫోటోలపై తెగ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంకా టెంపర్‌ స్టైల్ చూశాక.. తారక్‌ను డైరెక్ట్‌ చేసే సత్తా, అర్హత తనకు లేదన్న విషయం గ్రహించానని ముక్తాయించాడు.
 
టెంపర్‌ఫస్ట్‌లుక్‌ ఫోటోలో తారక్‌ సింప్లీ అవుట్‌ స్టాడింగ్‌ అంటూ ‘పూరి జగన్‌ క్రియేట్‌ చేసిన క్యారెక్టర్లలో టెంపర్‌.. బె్‌స్ట్‌ అనుకుంటున్నా. ఈ సినిమా కమర్షియల్‌ చిత్రమే కాక కామెడీ, పాటలు, సన్నివేశాలతో భారీగా రూపొందుతోంది. 
 
జ‘గన్‌’ నుంచి వస్తున్న బుల్లెట్‌లా తారక్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు’. అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్‌ చేశాడు. 
 
ఇంతటితో ఆగకుండా టెంపర్‌తో పోల్చితే పోకిరి, బిజినెస్‌మేన్‌లు ప్లాఫ్‌లు కింద లెక్కేనంటూ మరోసారి తనదైన శైలిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. 


Monday, December 15, 2014

"నన్ను కొనుక్కోండి"... ఫేస్‌బుక్ లో ఓ యువతి

 
కటిక దరిద్రం... పోషించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు... తల్లిదండ్రులకు అనారోగ్యం... అప్పు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏం చేయాలి...? ఇక తనను తాను అమ్ముకోవడం మినహా మరే దిక్కూ లేదనుకుందా మహిళ. గుజరాత్ రాష్ట్రంలో ఓ మహిళ బాధలు భరించలేక తనను ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టుకున్న ఘటన పేదరికపు వెక్కిరింపు ఎంత దారుణంగా ఉంటుందో మరోసారి చూపించింది. 
 
వడోదరకు చెందిన చాందిని రాజ్ గౌర్ అనే యువతి తన తల్లిదండ్రులకు చికిత్స చేయించేందుకు కావలసిన డబ్బు కోసం తనను తాను అమ్ముకుంటున్నట్లు ఫేస్ బుక్ లో తన ఫొటో పోస్టు చేసింది. ఆ ఫోటో కిందే ఎందుకు తనను తాను అమ్ముకోదలచిందో పేర్కొంది. తన తల్లిదండ్రులు మంచాన పడటంతో వారి ఆలనాపాలన అంతా చాందినీయే చూసుకుంటోంది. 
 
20 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి వడోదర చేరుకున్న చాందిని కుటుంబం ప్రస్తుతం తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోయింది. ఆమె ఫేస్ బుక్ లో ప్రకటనను చూసి జాతీయ మీడియా సంప్రదించగా "నా తల్లిదండ్రుల కోసం నన్ను కొనండి" అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తనకు ఇంతకన్నా మరో మార్గం లేదని వెల్లడించింది.
 


"చెప్పుతో కొడతా"నన్న త్రిష ?

త్రిష అంటే గ్లామర్ నటనకు పెట్టిందిపేరు. ఆమె దక్షిణాది ఫిలిమ్ ఇండస్ట్రీని తన గ్లామర్ తో చానాళ్లు ఏలేసింది. ఐతే ఇటీవల కొద్దిగా ఆఫర్లు తగ్గినా ఆమె కోసం కొందరు నిర్మాతలు ఇంకా ఎగబడుతూనే ఉన్నారు. ఈమధ్య టాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత నేరుగా త్రిషను సంప్రదించాడట. 
 
తను తీయబోయే చిత్రంలో మంచి హాట్ పాత్ర ఉందనీ, అందులో నటించేందుకు సై అంటే అడిగినంత పారితోషికం ఇస్తానన్నాడట. అంతే త్రిషకు కోపం నషాలానికి అంటిందట. వెంటనే పైకి లేచి... ఇక్కడ నుంచి వెళ్లకపోతే చెప్పుతో కొడతా అంటూ సెక్యూరిటీ చేత అతడిని బయటకు పంపిందట. మొత్తానికి ఆఫర్లు తగ్గినా త్రిష ఇంకా ఆ రేంజిలోనే ఉందంటూ సదరు నిర్మాత గొణుక్కుంటూ వెళ్లిపోయాడట.

Saturday, December 13, 2014

ప్రవర్తన మార్చుకోకపోతే "ధన్‌రాజ్‌ కు ఇక్కట్లే" ?

పలు స్కిట్స్‌లో బుల్లితెరపై అలరిస్తూ సినిమాల్లో పలు పాత్రలు పోషించిన ధన్‌రాజ్‌ నటుడిగా తనకంటూ ముద్ర వేసుకున్నాడు. కానీ.. వ్యక్తిగతంగా కొన్ని తప్పులు చేయడంతో ఆయనకు కొన్ని చిక్కులు వచ్చిపడ్డాయి. గతంలో మందుకొట్టి పబ్‌లో ఏదో హడావుడి చేశాడని పోలీసులు కేసు కూడా వుంది. ఆ తర్వాత షూటింగ్‌లో చిన్న చిత్రాలయితే.. వారిపై ఏదో సాకుతో ఏదోవిధంగా ఏదో చేస్తాడట. 
 
తనే దర్శకుడిగా హ్యాండిల్‌ చేసే సందర్భాలు పలు వున్నాయి. కొత్త ఆర్టిస్టులపై ఎకసెక్కాలాడటం వంటి సందర్భాలు కూడా వున్నాయి. తాజాగా ఆయన పులిరాజు అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అదికాకుండా ఇటీవలే మంచు లక్ష్మీ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 
 
ఓపెనింగ్‌ రోజే లక్ష్మీతో కలిసి నటిస్తున్నాడని ప్రకటన ఇచ్చారు. ఏమైందో కానీ ప్రస్తుతం ధన్‌రాజ్‌ను తీసేసినట్లు తెలిసింది. ఇతని దుందుడుకు చర్యకు ఇదొక నిదర్శనమని ఫిలింనగర్‌లో వార్తలు విన్పిస్తున్నాయి.

Friday, December 12, 2014

"కమెడియన్" కమెడియన్ గానే ఉండాలి !


పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్  నుంచి స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలీ ఈమధ్య అవకాశం దొరికినప్పుడల్లా ఎవరో ఒకరిని టార్గెట్ చేసి పంచ్ డైలాగులు వేస్తున్నాడు. ఆమధ్య యాంకర్స్ , హీరోయిన్స్ ని ఉద్దేశించ్ అప్పుడప్పుడు బూతు పంచులు వేసిన అలీ తాజాగా ఇండస్ట్రీలోని కమెడియన్స్ ని టార్గెట్ చేసుకున్నాడు. అయితే ఈసారి అందరిని కాకుండా కమెడియన్స్ ఎవరైతే ఆ ట్రాక్ నుంచి తప్పుకొని హీరోగా చెలామణి అవుతున్నారో వారిపై అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల జరిగిన యమలీల 2 ఆడియో ప్లాటినం డిస్క్ వేడుకలో ఈయన మాట్లాడుతూ ‘యమలీల హిట్ అవగానే నేను హీరోగానే సినిమాలు చేస్తానని  కమెడియన్ పాత్రలు వదిలేస్తానని అనుకున్నారు. కానీ నిర్మాత నిర్మాతగానే , గాయకుడూ గాయకుడిగానే ఉండాలి. అలాగే కమెడియన్ కమెడియన్ గానే ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఏమి చేస్తే ఆదరిస్తారో అలా నడుచుకుంటే సక్సెస్ పొందగలం. ఈ విషయాన్నీ అందరు తెలుసుకోవాలి. ఇది తెలియక ఈమధ్య అందరూ చాలా వేరే మార్గాన్ని చూసుకుంటున్నారు. కానీ నేను అలా చేయలేదు…ఆ సినిమా ఎంతపెద్ద హిట్ అయినా….నేను కమెడియన్ బాటను వదలలేదు.’ అన్నాడు అలీ. ఈ మాటలు ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. ఈమాటలు హీరో సునీల్ ని ఉద్దేశించి అన్నట్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

"పాలలో తేనె" కలుపుకొని త్రాగితే ?


తేనె, పాల కాంబినేషన్ అటు ఆరోగ్యానికి.. ఇటు సౌందర్యానికి పనిచేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కాంతివంతమైన చర్మం, ప్రకాశవంతమైన క్లియర్ స్కిన్ చేకూరుతుంది. 
 
గోరువెచ్చని పాలు, తేనె మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ పెరుగుతుంది. 
 
శరీరంలో జీవక్రియలు చురుకుగా పనిచేస్తాయి. రోజంతా ఎక్కువ శ్రమతో కూడిన పనిలో ఉన్నప్పుడు, ఈ రెండింటి మిశ్రమంతో నేచురల్ మిక్సర్‌ను త్రాగండి. 
 
ఇది చర్మానికి ప్రయోజనాలను అందివ్వడం మాత్రమే కాదు, రాత్రుల్లో మంచి నిద్రను పొందుతారు. అంటే కళ్ళ క్రింది నల్లటి వలయాలుండవు. మరుసటి రోజు ప్రకాశవంతమైన చర్మం సొంతం అవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.

Thursday, December 11, 2014

"మానవమలం"తో నడిచే 'పూ బస్'


రీసైకిల్ ప్రాసెస్ చేయాలే కానీ, పనికిరానిదంటూ ఏదీ లేదు. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు మరోసారి నిరూపించారు. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న బస్సును చూశారా.. ఇది మానవ 'అశుద్ధం'తో నడిచే బస్సు. వినడానికి ఎబ్బెట్టుగా, ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం.



'పూ బస్'గా పిలిచే ఈ బస్సు మానవ వ్యర్థం, ఆహారా పథార్థాల వ్యర్థాల నుంచి విడుదలయ్యే గ్యాస్‌తో నడుస్తుంది. యూకేలో కెల్లా మొట్టమొదటిదైన ఈ తరహా బస్సు, బ్రిస్టల్ సెవేజ్ వర్క్స్ నుంచి వచ్చే వ్యర్థం మరియు ఇతర వ్యర్థాలతో కలిసి వచ్చే బయోమీథేమ్ వాయువను ఇంధంగా చేసుకొని నడుస్తుంది.

ఈ బయో బస్సులో 40 సీట్లు ఉంటాయి. ఫుల్ ట్యాంక్ గ్యాస్‌పై ఇది 300 కిలోమీటర్ల దూరం (186 మైళ్లు) ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఈ బస్సును యూకేలోని బ్రిస్టల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బాత్ సిటీ సెంటర్ వరకూ ఆపరేట్ చేస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు ఏడాది పాటు విసర్జించే 'అశుద్ధం'తో ఒక ఫుల్ ట్యాంక్ బయోమీథేన్ ఫ్యూయెల్‌ని తయారు చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఇదొక చక్కటి మార్గం, అంతేకాకుండా బయోమీథేన్‌తో ఈ నడిచే ఈ బస్సులు డీజిల్ ఇంధనంతో నడిచే బస్సులతో పోల్చుకుంటే 30 శాతం తక్కువ కర్భన ఉద్ఘారాలను విడుదల చేస్తాయని వారు తెలిపారు. ఈ వాయువు దుర్ఘంధం వెదజల్లకుండా ఉంచేందుకు సరైన ప్యూరిఫికేషన్ విధానాన్ని పాటిస్తున్నారు. ఫలితంగా ఇది పర్యావరణాన్ని, మానవాళికి హాని కలిగించదు. ఇదంతా వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నప్పటికీ, మన వేస్టే మనల్ని మోసుకెళ్తుందన్నమాట.



"కాంతివంతమైన" చర్మంకోసం ?


అరకప్పు ఓట్స్‌ను తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పెరుగు, టమోటా గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే మురికి, మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతమవుతుంది. 
 
అలాగే.. బాదంపప్పు పేస్టులో పాలు, నిమ్మరసం, కాసింత మినప్పిండి కలిపి ప్యాక్‌లా వేసుకున్నా ముఖం మెరిసిపోతుంది.

Wednesday, December 10, 2014

ఏడాదిలో "ఒక్కరోజు" మాత్రమే తెరిచే ఆలయం ?


హిందూ ధ‌ర్మంలో పాముల‌ను ఆరాధించే సంస్కృతి అనాదిగా వస్తోంది. హిందూ ధ‌ర్మంలో స‌ర్పాల‌ను దేవ‌త‌ల ఆభ‌ర‌ణంగా భావిస్తారు. మ‌న‌దేశంలో ఎన్నో నాగ దేవాల‌యాలున్నాయి. అందులో ప్ర‌ముఖమైంది, ఇత‌ర ఆల‌యాల‌కంటే భిన్న‌మైంది ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం. ఉజ్జ‌యినిలోని మ‌హాకాల్ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం కొలువై ఉంది. ఈ కోవెల సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే అది కూడా శ్రావ‌ణ శుక్ల పంచ‌మి రోజు మాత్ర‌మే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్ర‌మే భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. ఆల‌యం తెరిచి ఉండే ఈ ఒక్క‌రోజున స‌ర్ప‌రాజుగా భావించే త‌క్ష‌కుడు ఆల‌యంలోనే ఉంటాడ‌ట‌. నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో 11 వ శతాబ్దానికి చెందిన అద్భుత‌మైన ప్ర‌తిమ ఉంది. ఇందులో ప‌డ‌గ విప్పి ఉండే పామునే ఆస‌నంగా చేసుకొని కూర్చొని ఉన్న శివ‌పార్వ‌తులుంటారు. ఈ ప్ర‌తిమ‌ను నేపాల్ నుంచి తెప్పించార‌ని చెబుతుంటారు. ఉజ్జ‌యినిలో త‌ప్ప ఇలాంటి ప్ర‌తిమ ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా ఉండ‌ద‌ట‌. సాధార‌ణంగా అయితే స‌ర్పంపైన విష్ణు భ‌గ‌వానుడు మాత్ర‌మే శ‌యనిస్తాడు. కానీ ప‌ర‌మ‌శివుడు శయ‌నించిన దాఖ‌లాలు ఎప్పుడూ విన‌లేదు. కానీ ప్ర‌పంచంలో మ‌ర‌కెక్క‌డా లేని విధంగా ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో భోళాశంకరుడు శ‌య‌నించి ఉండ‌డం విశేషం. ఈ ప్ర‌తిమ‌లో శివ‌పార్వ‌తుల‌తో పాటు వారి ముద్దుల త‌న‌యుడు వినాయ‌కుడు కూడా కొలువై ఉన్న అద్భుత దృశ్యం చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలోస‌ర్పంపైన ప‌ర‌మ‌శివుడు శయ‌నించి ఉండ‌డం వెన‌క ఒక క‌థ ప్ర‌చారంలో ఉంది.
 


స‌ర్ప‌రాజు త‌క్ష‌కుడు ప‌ర‌మేశ్వ‌రుడి అనుగ్ర‌హం కోసం కఠోర‌మైన త‌పస్సు చేశాడ‌ట‌. ప్ర‌స‌న్న‌మైన శివుడు త‌క్ష‌కుడికి అమ‌ర‌త్వాన్ని ప్ర‌సాదించాడ‌ట‌. ఇక అప్పటి నుంచి త‌క్ష‌కుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడ‌ని చెబుతారు. నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యానికి శతాబ్దాల చ‌రిత్ర ఉంది. 1050 లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయ‌న త‌ర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మ‌హ‌రాజ్ 1732 లో ఆల‌య జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టాడు. ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు స‌ర్ప‌దోషాల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. అందుకే నాగ‌పంచ‌మి రోజు ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తుతారు. నాగ‌చంద్రేశ్వ‌రుడి ద‌ర్శించుకొని పునీతుల‌వుతారు. ఈ ఒక్క‌రోజే దాదాపు రెండు ల‌క్ష‌ల మంది భ‌క్తులు  ద‌ర్శించుకోవ‌డం విశేషం.

నిమ్మ, బత్తాయి "తొక్కల"ను పారేస్తున్నారా?

 
నిమ్మ, బత్తాయి తొక్కలను పారేస్తున్నారా? కాస్త ఆగండి. నిమ్మరసం కానీ, బత్తాయి రసం కానీ తీసిన తర్వాత తొక్కని ఇక నుంచి పారేయకండి. ఎందుకంటే సిట్రస్ జాతి పండ్ల తొక్కలను ఇంట్లో అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. 
 
ఎలాగంటే.. 
*  గోరు వెచ్చని నీటిలో ఎండబెట్టిన నిమ్మకాయ తొక్కను వేసి స్నానం చేయండి. ఇది శరీరాన్ని, వెంట్రుకలనూ తాజాగా ఉంచుతుంది. 
 
* నిమ్మ, కమలా, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్ తొక్కలను ఒక చిన్న గిన్నెలో వేసి దాన్నిండా నీటిని పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. ఫ్రిజ్‌లోని చెడు వాసనలు పోతాయి.
 
* సిట్రస్ జాతి పండ్ల తొక్కలకు కొద్దిగా బ్రౌన్ షుగర్‌ను అద్ది అర చేతులకు మోచేతులకు రుద్దితే మొరటుదనం పోయి కోమలంగా తయారవుతాయి. 
 
* సిట్రస్ ఫ్రూట్స్ పండ్ల తొక్కలను అండర్‌గార్మెంట్స్ ఉన్న సొరుగులో ఉంచితే, బట్టల నుంటి మంచి వాసన వస్తుంది. 
 
* నిమ్మ, నారింజ తొక్కలు నానబెట్టిన నీటితో నోరు పుక్కిలిస్తే నోటి దుర్వాసన ఉండదు. ఈ తొక్కలను నమిలితే దంతాలకు, చిగుర్లకూ ఎంతో మంచిది. 


Tuesday, December 9, 2014

"కమలా"పండ్లు తింటే?

 
కమలా పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. దాంతో పాటు బీటా కెరోటిన్, యాంటీ యాక్సిడెంట్లు, ఫోలేట్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, పిరిడాక్సిన్, రిబోఫ్లేవిన్ ఉంటాయి. ఇందులోని మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. థయామిన్ ఆహారాన్ని శక్తిగా మార్చడానికి దోహదం చేస్తుంది. 
 
పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒక కమలాపండు తింటే ఒక రోజు దేహానికి అవసరమైన ఏడవ వంతు పొటాషియం అందుతుంది. ఊపిరితిత్తుల్లో కళ్లె చేరడం, ముక్కు కారడం, గుండె పట్టేయడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దేహంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. దేహం లోపలి భాగాలతో పాటు చర్మసౌందర్యాన్ని కూడా ఇనుమడింపజేస్తుంది. గాయాలు త్వరగా మానిపోయి చర్మం మామూలు కావడానికి దోహదం చేస్తుంది. 
 
క్యాన్సర్ కారక కణాల వృద్ధిని అడ్డుకుంటుంది, గర్భిణులు కమలాపండ్లు తింటే మేలు. బిడ్డకు పుట్టుకతో వచ్చే అవకరాలను నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

"అడిగినంత" ఇస్తే "అంతా చూపిస్తా"... ?

 
పూనమ్‌పాండే బాలీవుడ్‌లో చేసిన సినిమాను తెలుగులో 'మాలిని అండ్‌ కో' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఎనిమిది చోట్ల న్యూడ్‌గా కన్పిస్తుందట. అంటే బ్యాక్‌ బాడీని చూపిస్తుంది. ఇలాంటివి గోవా బీచ్‌లో సర్వసాధారణమే. కానీ సినిమాల్లో కూడా ఈమధ్యనే ఇలా చూపిస్తున్నారు. గోవిందుడు అందరి వాడేలె చిత్రంలో కూడా కాజల్‌ అగర్వాల్‌ అలానే చూపిస్తుంది. హీరోను టెంప్ట్‌ చేస్తుంది. 
 
ఫ్యామిలీ సినిమాల్లోనే అలాగే వుంటే.. ఇక యూత్‌ చిత్రాలు చెప్పాలా.  బాలీవుడ్‌లో సన్నీలియోన్‌, షెర్లిన్‌ చోప్రాలు ఇలాంటి సీన్స్‌ చేసి మెప్పించారు. అయితే ఇటీవలే ఆడియో విడుదలలో పూనమ్‌ పొందికగా చీరకట్టి వచ్చింది. అయినా కెమేరాలు ఎత్తేసరికి బొడ్డు అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. కాగా, ఈ సినిమాలో ఆమె చేసిన సీన్స్‌ను నాలుగింటిని సెన్సార్‌ కట్‌ చెప్పినట్లు సమాచారం. మరి సినిమాలో అవి వుంటాయో అలానే పెడతారో చూస్తేకానీ తెలీదు. అన్నట్లు ఆమెకు అడిగినంత డబ్బిస్తే అంతా చూపించేందుకు సిద్ధమని అంటోంది. మరి అంత  ఇచ్చేవాళ్లున్నారా...?
 


Monday, December 8, 2014

" థైరాయిడ్" ను దూరంచేసే "ఆహార పదార్ధాలు" !

 
థైరాయిడ్ పురుషుల కంటే మహిళలనే అధిక శాతం వేధిస్తోంది. శరీరంలో అయోడిన్ శాతం తక్కువగా ఉండటం వల్లే థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. థైరాయిడ్ యుక్త వయస్సు అమ్మాయిలనే అధికంగా సోకుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
రక్తంలో థైరాక్సిన్ హార్మోన్ తక్కువ శాతం ఉండటం వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. థైరాయిడ్ కారణంగా బరువు పెరగడం, అలసట, అధిక సమయం నిద్రపోవుట, చలినితట్టుకోలేక పోవడం వంటివి ఏర్పడతాయి. థైరాయిడ్ సమస్యను అధిగమించాలంటే.. క్యాల్షియం గల ఆహారాన్ని తీసుకోవాలి.

అయోడిన్, సెలీనియం వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసం, మష్రుమ్, సోయాబీన్, సన్ ఫ్లవర్ గింజలు, పాలకూర, నువ్వులు, వెల్లుల్లి తీసుకోవాలి. అయోడిన్ ఉప్పును మాత్రమే తీసుకోవాలి. రోజూ 4 నుంచి 5 గ్రాముల వరకు ఉప్పును తీసుకోవచ్చు. 
 
ఆకుకూరలు తీసుకోవచ్చు. ఆకుకూరలు ఉడికించి ఆ రసాన్ని తీసుకోవచ్చు. తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పండ్ల రసాలు, పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 

పవన్ "ఎంట్రీ షాట్" ఖర్చు "50 లక్షలు"


నటుడి ఇమేజ్ పెరిగితే అతడిపై ఎంట్రీ షాట్ రూపంలో భారీగా డబ్బులు వెదజల్లుతారు. అలాంటి సంఘటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలోనూ జరిగింది. గోపాల గోపాల చిత్రంలో విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విషయాల్లో చిత్ర యూనిట్ హై క్వాలీటిని మెయింటెన్ చేస్తున్నట్లు షూటింగ్ స్టార్టింగ్ రోజు నుంచి తెలిసిన విషయమే. 
 
కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కోసం సుమారు 50 లక్షలతో విజువల్ వండర్‌ని క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విజువల్ ను పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కన్పించేటపుడు ఉపయోగిస్తారని సమాచారం. 


Saturday, December 6, 2014

"అబ్బాయ్" కోసం "బాబాయ్"


సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించడానికి వస్తాడంటున్న గోపాలుడు వెన్నక్కి తగ్గినట్లు సమాచారం. దీనికి కారణం తన సోదరుడి కుమారుడు తొలి చిత్రం 'ముకుంద' కూడా సంక్రాతికి విడుదల కావడమేనట. మొదటగా గోపాల గోపాల సినిమాను పండుగకు విడుదలచేస్తామని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఆ వెంటనే ముకుంద యూనిట్ కూడా తమ సినిమా కూడా జనవరి విడుదలకు రెడీ అవుతోందని ప్రకటించింది. దీంతో బాబాయ్, అబ్బాయ్ సినిమాలు ఒకేసారి రావల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సినిమా వల్ల అబ్బాయ్ సినిమాకి ఎలాంటి ఇబ్బంది రాకుండా వుండాలని భావించిన బాబాయ్ 'గోపాల గోపాల' రిలీజ్ ను మార్చాలని నిర్మాతలతో రాయబారం నడుపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి తాను అభిమానించే అన్నయ్య కుమారుడి తొలి సినిమా వస్తుంటే దానిపై పోటికి పవన్ ఒప్పుకుంటాడా? 

"అదృష్టం,దురదృష్టం" అనేవి వ్యక్తుల "గుణగణాల"పైనే ఆధారపడి ఉంటాయా ?

 కొందరికి ఏ పని చేసినా కలిసొస్తుంది. ముట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ముళ్ళదారిలో నడిచినా పూలబాట దాటినంత సాఫీగా ప్రయాణం సాగిపోతుంది. మరికొందరికి అనుకున్నదేదీ జరగదు. ఏ పని చేసినా కష్టం, నష్టం తప్ప లాభం, సుఖం అన్నవి వాళ్ళకి తెలీదు. ఇందులో మొదటిరకం వాళ్ళని అదృష్టవంతులనీ, రెండోరకం వాళ్ళని దురదృష్టవంతులనీ అనేస్తాం. వాళ్ళ తలరాత అంతే అని కూడా అంటాం. అయితే నిజంగా అదృష్టం, దురదృష్టం అనేవి కొంతమంది దగ్గరే ‘ఫిక్స్‌డ్‌గా వుంటాయా అంటే కానేకాదు అంటున్నారు రిచర్డ్ వైజ్‌మెన్. అదృష్టం, దురదృష్టం అనేవి ఆయా వ్యక్తుల గుణగణాలపైనే ఆధారపడి వుంటాయని అంటున్నారు అయన.

అదృష్టం అనేది కొందరినే ఎందుకు వరిస్తుంది? అందరూ అదృష్టవంతులు ఎందుకు కాలేకపోతున్నారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలని అనుకున్నారు హెర్డ్ ఫోర్డ్ షైర్ విశ్వవిద్యాలయంలో సైకాలజిస్ట్‌గా పనిచేసే రిచర్డ్ వైజ్‌మెన్. తన పరిశోధన కోసం లండన్‌లోని అతి అదృష్టవంతులు, అతి దురదృష్టవంతుల్ని రమ్మని పత్రికల్లో ప్రకటనలిచ్చారు. అలా ఆ ప్రకటనలకి స్పందించి సుమారు 400 మందికి పైగా అదృష్టవంతులు, దురదృష్టవంతులుగా తమని తాము భావించే వారు రిచర్డ్‌ని కలిశారు. వారిని ఇంటర్వ్యూలు చేసి, వారిపై కొన్ని ప్రయోగాలు చేసి అదృష్టం, దురదృష్టాలు వ్యక్తుల గుణగణాలపై ఆధారపడతాయని కానీ, అవేం అదృశ్య శక్తులు కావని తేల్చారు రిచర్డ్.

రిచర్డ్ వైజ్‌మెన్ చేసిన కొన్ని ప్రయోగాలు ఎంతో ఆసక్తికరంగా సాగాయి. అందులో ఒకటి... ఒకరోజు రిచర్డ్ ఒకొక్కరికీ ఒక పత్రికని ఇచ్చి అందులో ఎన్ని  ఫొటోలు వున్నాయో చెప్పమన్నాడంట. అదృష్టవంతులు కొన్ని సెకన్లలో సమాధానం చెప్పేశారు. దురదృష్టవంతులు మాత్రం రెండు, మూడు నిమిషాల సమయం తీసుకున్నారట. ‘‘ఈ పత్రిక మొత్తంలో 43 ఫొటోలు ఉన్నాయి. ఇక లెక్కపెట్టడం ఆపేయండి’’ అని రెండో పేజీలో పెద్దపెద్ద అక్షరాలతో రాసుండటం దురదృష్టవంతులు గమనించక పోవడమే దీనికి కారణం. ఫొటోలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టాలన్న టెన్షన్‌లో వాళ్ళు మిగిలినదేదీ గమనించలేదు. అలాగే కొందరు దురదృష్టవంతులు దానిని చూసి కూడా నిజమని నమ్మలేకపోయారుట.
ఆ ప్రయోగంలో అదృష్టవంతులుగా భావించే వారు ఏ కంగారూ లేకుండా చూడ్డం వల్ల రెండో పేజీలో వున్నదాన్ని చూడగలిగారు.  దీనిని విశ్లేషిస్తూ రిచర్డ్ ఇలా అంటున్నారు... ‘‘అదృష్టవంతులకు ఉన్న వ్యక్తిత్వం, ఆలోచనా ధోరణి, సమయస్ఫూర్తి, సానుకూల దృక్పథం, చురుకుగా స్పందించే గుణాల వల్లే వారు అన్నిటిలోనూ విజయాలు సాధించి అదృష్టవంతులుగా పిలువబడుతున్నారు. అదే దురదృష్టవంతుల విషయానికి వస్తే, వారిలో చొరవ లేకపోవటం, వచ్చిన అవకాశం వదులుకోవడం, ప్రతీ విషయాన్ని తమకి ప్రతికూలంగా భావిస్తూ వుంటారు’’ అన్నారు.
 కాబట్టి ‘‘నాకు అదృష్టం లేదు’’ అనే మాటలు వదిలి, అదృష్టం వరించాలంటే ఉండాల్సిన లక్షణాలను పెంపొందించుకోండి అంటున్నారు రిచర్డ్ వైజ్‌మెన్.

Friday, December 5, 2014

"శృంగారం" పై " ఆసక్తిని, సామర్థ్యాన్ని" పెంచే ఆహారపదార్థాలు !

 
ప్రతిరోజూ సెక్స్‌లో పాల్గొనడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే! రోజూ సెక్స్ చేయడం ద్వారా ఆనందాన్ని అనుభవించడంతోపాటు శరీరానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయి. 
 
అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో పెళ్లైన జంటలకు శృంగారానికి సమయం లేదు. పురుషులు పాల్గొనాలని అనుకున్నా రోజంతా పనిచేసి అలసిపోవడం వల్ల రతిక్రీడలో పాల్గొనేంత ఆసక్తి వుండడంలేదు. ఇక మహిళలు సంగతీ సరేసరి ఇంటా బయట అంటూ పనులు చేసి నీరసించిపోవడంతో సెక్సులో పాల్గొనేంత ఆసక్తి వారిలోవుండదు. దాంతో భార్యాభర్తల మధ్య దూరం పెరగడంతోపాటు ఆరోగ్యకరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి.
 
ప్రతిరోజూ సెక్స్‌ను తనివితీరా పూర్తి అనుభవించాలంటే సెక్స్‌పై ఆసక్తిని, సామర్థ్యాన్ని పెంచే ఆహారపదార్థాలను తీసుకోవడం మంచింది. సెక్స్‌లో పాల్గొనేందుకు ముందు ఆ ఆహారాలను తీసుకుంటే.. అవి రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి అందించడంతోపాటు, భాగస్వామితో శృంగారంలో పాల్గొనేలా హార్మోనులను ప్రేరేపిస్తాయి. అంతటి మేలు చేసే ఆహార పదార్థాలు ఇవిగో మీ కోసం...
 
బెడ్‌పైకి ఎక్కే ముందు రెండు ముక్కలు డార్క్ చాక్లెట్ నోట్లె వేసుకున్నారంటే సరి. అటు స్వీటుకు స్వీటు ఇటు ఇందులో ఉండే థియోబ్రొమైన్ అనే కంటెంట్ నేచురల్ ఎనర్జీని పెంచి, సెక్సీ మూడ్ మీకు అందిస్తుంది.
 
సెక్స్‌ స్టామినాను పెంచడంలో తేనె బాగా పని చేస్తుంది. ఇందులో బిటమిన్-బి అధికంగా వుంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. మహిళలు దీనిని తీసుకుంటే వారిలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.
 
పడకెక్కే ముందు పాలు తాగడం మంచిదే, అందునా బాదం పాలు మరి మంచిది. అవి శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. తద్వారా త్వరగా అలసిపోకుండా సెక్స్‌లో మీరు రెచ్చిపోవచ్చు. 
 
సెక్స్ సామర్థ్యం పెరగాలంటే రక్త ప్రవాహాం మెరుగుపడాలి అందుకు దానిమ్మ పండు బాగా ఉపకరిస్తుంది. బెడ్ రూంలోకి వెళ్లే ముందు దానిమ్మ పండుకానీ, దానిమ్మ రసంగానీ తీసుకుంటే సెక్స్‌కు వేగంగా సిద్ధమవుతారు. 
 
సెక్స్‌కు ముందు ఒక క్యారెట్ తిని చూడండి. ఇందులో మానవ శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్స్ ఎన్నో వుంటాయి. ఫలితంగా ఎనర్జీ కూడా పెరుగుతుంది.
 
శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో టమోటో బాగా పని చేస్తుంది. ఇందులో లైకోపిన్ అనే అంశం సెక్స్ సామర్థ్యంను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. రాత్రి తీసుకునే ఆహారంలో టమోటాలను కాస్త ఎక్కువగా జోడిస్తే.. ఫర్ఫెక్ట్ లవ్ మేకింగ్ నైట్ కోసం స్టామినా అందిస్తుంది.

Thursday, December 4, 2014

"తాళాలు" కనిపించడం లేదా ? ఒక్క "విజిల్" వేయండి చాలు !


ఆఫీసుకు టైమవుతుంటే బండి తాళాలు కనిపించవు. కారు తాళాలు ఎక్కడో వుంటాయి. వెతుకులాటతో చిరాకు, కోపం ఉదయాన్నే మనల్ని ఆవహిస్తాయి. ఇక ఆ చికాకు రోజంతా వెన్నాడుతుంది. ఇవన్నీ సరే హ్యాండ్ బ్యాగ్‌లో వేసిన ఇంటి తాళం చటుక్కున చేతికి అందదు. ఈ తాళాలతో ఇన్ని తిప్పలు. ‘‘ఎంచక్కా సెల్‌కి రింగ్ ఇచ్చి దాని అడ్రస్సు కనుక్కున్నట్టు వీటికీ ఓ ఆప్షన్ ఉంటే బాగుండును’’ అని మనందరం ఎప్పుడో ఒకప్పుడు అనుకునే వుంటాం కదా!



మనలాంటి వారి కోసమే ‘‘విజిల్ కీ ఫైండర్’’ తయారు చేశారుట. ఈసారి తాళాలు కనిపించకపోతే ఒక్క విజిల్ వేయండి చాలు అంటున్నారు దీని తయారీదారులు. మన విజిల్ సౌండ్‌కి ఈ ఫైండర్‌కి వున్న ఎల్ఇడి లైట్ వెలగటంతోపాటు ఓ బీప్ సౌండ్ కూడా వస్తుంది. దాంతో ఎక్కడ దాగున్నా టక్కున పట్టుబడిపోతుంది మన తాళం చెవి.

"బాలయ్య" వందో సినిమాలో "పవన్" ?

టాలీవుడ్లో సంచలనాలు సృష్టించే నందమూరి బాలకృష్ణ త్వరలోనే మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం 98 వ సినిమాలో నటిస్తున్న బాలయ్య , 99 వ సినిమా కోసం పలువురు దర్శకుల కథలని సిద్దం చేసుకుంటున్నారు . 98 వ సినిమా పూర్తికాలేదు ,99 మొదలు కాలేదు కానీ అప్పుడే 100 సినిమా గురించి పుకార్లు మొదలయ్యాయి. తాజాగా ఓ సంచలన వార్త పరిశ్రమలో వినిపిస్తుంది.

అదేమిటంటే బాలయ్య వందో సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తాడట. ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ , నిజం కాదని మాత్రం కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వీరిద్దరూ కలసి నటించమని ఎప్పుడు చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ వందో సినిమా లో పవన్ కళ్యాణ్ ఓ అతిధి పాత్రలో చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం గోపాల గోపాల సినిమాలో నటిస్తున్నట్లుగానే బాలయ్య వందో సినిమాలో నటిస్తాడని అంటున్నారు.

మరో గాసిప్ ఏమిటంటే… ఈ సినిమా బాలకృష్ణకు సింహ , లెజెండ్ తో వరుసగా రెండు హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. వినేందుకు ఆసక్తిగా , క్రేజీగా ఉన్న కాంబినేషన్ కార్యరూపం దాల్చడానికి మరో ఏడాది సమయం పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం చేస్తున్న 98 వ సినిమా పుర్తవ్వాలి , ఆ తర్వాత 99 సినిమా చేశాక వందో సినిమా వస్తుంది కాబట్టి.

Wednesday, December 3, 2014

"అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్" చేసిన సచిన్.


క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడేటపుడు ఓసారి ఆరోగ్య సమస్యతో ఎలా బాధపడిందీ... అలాగే ఆ సమస్యతోనే బ్యాటింగ్ ఎలా చేసిందీ తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో వెల్లడించారు. 2003 ఐసీసీ ప్రపంచ కప్ సూపర్ సిక్స్ దశకు వచ్చిన సమయం... శ్రీలంకతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. తనకు అపుడే విరేచనాలు పట్టుకున్నాయి. వేరే దారి లేక ఈ మ్యాచ్‌లో అండవేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని ఆ పుస్తకంలో చెప్పుకున్నాడు. 
 
సచిన్ తన ఆత్మకథ పుస్తకంలో ఇలా రాశాడు... "మ్యాచ్‌కు ముందే కడుపులో విపరీతమైన గడబిడ. డీహైడ్రేషన్ అని తెలిసిపోయింది. పాక్ తో మ్యాచ్ సమయంలోనే అది మొదలైంది. దాన్నుంచి కోలుకోక ముందే లంకతో మ్యాచ్. అప్పటికీ ఐసోటోనిక్ డ్రింక్స్ తీసుకున్నా.. అబ్బే ఏం మార్పు లేదు. దాంతో ఎనర్జీ డ్రింక్‌లో ఓ టీస్పూన్ ఉప్పును కలుపుకుని తాగేసరికి సీన్ రివర్స్ అయింది. 
 
కడుపులో ఒకటే తిప్పడం. ఏమి చేయాలో, ఎలా ఆడాలా అనుకుని చివరికి అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్ చేశా. డ్రింక్స్ విరామ సమయాల్లో డ్రెస్సింగ్ రూమ్ కు పరిగెత్తి ఆ టిష్యూ పేపర్లు మార్చుకున్నాను." అంటూ ఆనాటి తన కష్టాలను సచిన్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ 120 బంతుల్లో 97 పరుగులు చేసి భారత్ ను విజయ తీరాలకు చేర్పించాడు సచిన్.

మోహన్ బాబు "రూటే సెపరేటు"... !


 టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ఏ పని చేసినా.. ఎలాంటి డైలాగ్ మాట్లాడినా అది విలక్షణంగానే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్చచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రంలో ఈ డైలాగ్ కింగ్ కూడా పాలుపంచుకుంటున్నారు.

అయితే, మోహన్ బాబు చేసే పనులు నటనలోనే కాదు నిజ జీవితంలోనూ విలక్షణంగా ఉంటాయి. ఈ కారణంగా కొన్నిసార్లు ఆయన చర్యలు, మాటలు వివాదాస్పదమవుతుంటాయి. అయినా, ఆయన తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ముందుకు సాగిపోతుంటారు.

తాజాగా, 'స్వచ్ఛ భారత్' లో పాల్గొన్న మోహన్ బాబు తనదైన శైలిలో వెళ్తున్నారు. చిత్తూరు జిల్లా రంగంపేటలో, ఎవరింటి ఎదురుగా ఉన్న చెత్తను వారింట్లోనే పడేసి, వారికి బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. పారిశుద్ధ్యం పట్ల ప్రజల్లో చైతన్యం రావాలంటే ఇలా చేయడమే కరెక్టు అన్న కోణంలో ఆయన చర్య ఉంది. పైగా ఆయన తన చర్యను సమర్థించుకున్నారు.

Tuesday, December 2, 2014

"రోజూ ముగ్గురు" అమ్మాయిలతో ?

 ఇంగ్లండ్‌కు చెందిన ఒకనాటి ప్రఖ్యాత పాప్ సింగర్‌ తాను సాగించిన రాసలీలలపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో కనీసం రోజుకు కనీసం ముగ్గురితో "ఆ" సుఖం అనుభవించినట్టు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన వయస్సు 54 ఏళ్లు. 1980 దశకంలో మంచి పాప్ స్టార్‌గా పేరుగాంచిన ఈయన.. యుక్త వయస్సులో ఉన్న దశలో తనకు పెద్ద సంఖ్యలో మహిళల ఫాలోయింగ్ ఉండేదని చెప్పుకొస్తున్నాడు. ఎప్పుడూ నలుగురైదుగురు అమ్మాయిలు తన చుట్టూ తిరుగేవారని, వారితో నా రాసలీలలు కొనసాగేవని అంటున్నారు.

తన యుక్త వయస్సు శృంగార జీవితం గురించి ఆయన బహిరంగా మాట్లాడుతూ.. నేను యుక్త వయస్సులో ఉన్న కాలంలో అనేక మంది మహిళలను నన్ను వెతుకుంటూ వచ్చేవారు. వారితో ఉల్లాసంగా ఎంజాయ్ చేసేవాడిని. ప్రతి రోజూ కనీసం ముగ్గురు మహిళలతో అయినా సెక్స్ చేసేవాడిని. ఇప్పటి వరకు నేను వెయ్యి మందికి పైగా మహిళలతో సెక్స్ సుఖాన్ని పొందాను. హాలీవుడ్ నటి కేత్రిన్ జోట్టా జోన్స్, ప్రముఖ మోడల్ సుందరి హెలనా క్రిస్టెన్సన్‌లు కూడా నాతో ఎంజాయ్ చేసిన వారేనంటూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.

"బేడీ" కి "మోడీ" మద్దతు ?

 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే కిరణ్ బేడీపై నమోదైవున్న చీటింగ్ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉపసంహరించుకున్నట్టు సమాచారం. 
 
కాగా, కిరణ్ బేడీపై ఉన్న చీటింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు క్లోజర్ రిపోర్టును తయారు చేసి కోర్టుకు సమర్పించారు. దాంతో ఆమె బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు మరింత ఊపువచ్చింది. పైగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పనిచేసిన కిరణ్ బేడీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ట్విట్టర్‌ ద్వారా మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. పీఎం మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వాగతించారు. దీంతో కిరణ్ బేడీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకుంది. 
 
అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న సమయంలో 2011 నవంబర్‌లో కిరణ్ బేడీపై కేసు నమోదు చేశారు. తన ట్రస్టులు ఇండియా విజన్ ఫౌండేషన్, నవజ్యోతి ఫౌండేషన్‌లకు మైక్రోసాఫ్ట్ విరాళంగా ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని కిరణ్ బేడీపై కేసు నమోదైంది. 
 
పోలీసు శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు ఆమె ఒక్కొక్కటి 20 వేల రూపాయల ఖరీదు చేసే కంప్యూటర్లను 50 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారనే ఆరోపణ కూడా ఉంది. దీంతో ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని అప్పట్లో సిటీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
తాము మైక్రోసాఫ్ట్ నుంచి వాంగ్మూలం తీసుకున్నామని, బేడీ ఏ విధమైన దుర్వినియోగానికి పాల్పడలేదని చెప్పిందని పోలీసులు తమ క్లోజర్ రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు గత అక్టోబర్ 28వ తేదీన క్లోజర్ రిపోర్టును కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. 


Monday, December 1, 2014

"11 కోట్ల 11 లక్షల 11వేల 111 రూపాయలు"


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలు నీతా అంబానీ, పింకీరెడ్డితో పాటు బాలీవుడ్ నటి జూహీ చావ్లా శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. చంద్రబాబును ఆయన నివాసంలో కలసిన నీతా, 11 కోట్ల 11 లక్షల 11వేల 111 రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు.
 
ఈ నగదు మొత్తాన్ని హుదూద్ తుపాన్‌తో అతలాకుతలమైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పునర్నిర్ణానికి వినియోగించాలని వారు చంద్రబాబును కోరారు. హుదూద్ తుఫాన్‌తో నష్టపోయిన విశాఖపట్నంలో జరుగుతున్న సహాయక చర్యలను వారు చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు.


బ్రిటిష్ నటి సోఫియా "న్యూడ్ గిఫ్ట్" ?


 రోహిత్ శర్మకు బ్రిటిష్ నటి సోఫియా న్యూడ్ గిఫ్ట్ ఇచ్చింది. రెండు డబుల్ సెంచరీలతో పాటు వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు తన పూర్తి నగ్న చిత్రాన్ని సోఫియా పంపి సంచలనం సృష్టించింది.

రోహిత్ సాధించిన ఘనతకు ముచ్చటపడిన సోఫియా పూర్తి నగ్నంగా మారి ఓ ఫొటోను తీయించుకుని, దానిని ట్విట్టర్‌లో షేర్ చేసింది. అరుదైన డబుల్ సెంచరీ రికార్డును  నమోదు చేసిన రోహిత్‌కు తన నగ్న ఫొటోను అంకితమిస్తున్నట్లు సోఫియా అందులో పేర్కొంది.

చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్‌కు బహుమతిగా ఇచ్చేందుకే తాను న్యూడ్ ఫోటో తీయించుకున్నానని వెల్లడించింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. అయితే రోహిత్ మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.