CSS Drop Down Menu

Monday, September 8, 2014

"సచిన్‌కు గుడి"



క్రికెట్ దేవుడు, అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఆయన వీరాభిమానులు గుడి కట్టనున్నారు.

బీహార్‌లోని అతార్వాలియా ఓ చిన్న పట్టణం. అక్కడ 10 అడుగుల ఎత్తున్న సచిన్ విగ్రహం దర్శనమిస్తుంది. మార్బుల్ స్టోన్‌తో తయారైందా విగ్రహం. దీని బరువు 850 కేజీలుగా కాగా, ఎనిమిదిన్నర లక్షల రూపాయలతో రూపొందించారు.

వరల్డ్ కప్ చేతబట్టుకుని ఉన్న రీతిలో సచిన్ దర్శనమిస్తాడక్కడ. ఇప్పుడా ప్రదేశంలో ఓ గుడి కట్టాలని వీరాభిమానులు నిర్ణయించారు. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ ఆరాధ్య క్రికెటర్ సచిన్‌కు ఆలయం నిర్మించాలనుకున్నారు.

అందులో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని సదరు వీరాభిమానులు సంకల్పించారు. ఈ ప్రతిపాదిత ఆలయానికి సమీపంలో భోజ్ పురి నటుడు మనోజ్ తివారీ స్పోర్ట్స్ అకాడెమీ, స్టేడియం కూడా నిర్మించనున్నారట.

0 comments:

Post a Comment