CSS Drop Down Menu

Wednesday, August 20, 2014

పిల్లల కోసం "కన్యత్వాన్నే త్యాగం చేస్తానన్న"పాప్ సింగర్ !

                             

నేను కన్యను.. ఒక్క రాత్రి పది మందికి కంపెనీ ఇస్తా..! అందువల్ల నన్ను బందీగా ఉంచుకుని అమాయక చిన్నారులను వదిలిపెట్టాలంటూ నైజీరియాకు చెందిన వర్థమాన పాప్ గాయని అడోకియే కిరియన్ ఆ దేశ తీవ్రవాదులకు విజ్ఞప్తి చేసింది. 

నైజీరియాలోని చిబోక్ అనే పట్టణంలో రెండు నెలల క్రితం బోకోహరాం తీవ్రవాదులు ఒక పాఠశాలపై దాడి చేసి 300 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. అమాయకులైన ఆ బాలికలను వదిలి పెట్టాలంటూ ఆ దేశ వర్ధమాన పాప్ గాయని తీవ్రవాదులకు విజ్ఞప్తి చేశారు. 


కావాలంటే తీవ్రవాదులకు నా కన్యత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన బాలికలంతా 12 నుంచి 15 యేళ్ళ లోపు వారే. వారికంటే నేను పెద్దదాన్ని. అనుభవజ్ఞురాలిని. కన్యను. ఒక రాత్రికి 10 నుంచి 12 మంది నాతో కోరిక తీర్చుకోండి. నాకేం పర్వాలేదు. కానీ, అమాయక బాలికలను విడిచి పెట్టండి. వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లనివ్వండి అని అభ్యర్థించింది . 




0 comments:

Post a Comment