CSS Drop Down Menu

Monday, August 18, 2014

"ఏపి" రాజధానిపై "కేసీఆర్ వాస్తు" సలహా !!!


ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాజధాని విషయంలో చంద్రబాబుకు కేసీఆర్ చిన్న సలహా ఇచ్చారట. రాజధానివున్న ప్రాంతంలో ఉత్తరం నుంచి నది ప్రవహిస్తే మంచిదని అన్నారట.
ఈ తరహా నగరాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతమైతే బాగుంటుందని కేసీఆర్‌ను చంద్రబాబు అడిగారు. అమరావతి, మంగళగిరి ప్రాంతాల మధ్య వుంటే బాగుంటుందని  కేసీఆర్ అన్నట్లు నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని విషయంలో మరోసారి ఆలోచనలోపడినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

1 comment:

  1. ఆంద్ర రాజధాని విషయంలో కెసిఆర్ జోక్యం అనవసరం. చంద్రబాబు మర్యాద కోసం అడిగినా "అన్నీ మీకు తెలుసు, మీరే నిర్ణయించండి" అంటే సరిపోయేది.

    ReplyDelete