CSS Drop Down Menu

Wednesday, April 16, 2014

మరీ ఇంత వెటకారమా? రఘువీరాజీ!

ఆంధ్రా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు మీడియా వాళ్ళతో మాట్లాడుతూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో శాసనసభకు జరిగే ఎన్నికలలో ఎమ్మేల్యేలుగా పోటీ చేయడానికి 200 సీట్లకు ఏకంగా 1300 మంది పోటీ పడ్డారని, తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడు ఇంతమంది పోటీ పడడం చూడలేదని, కాంగ్రెస్ ఎమ్మేల్యే టిక్కెట్ లకు ఇంత డిమాండ్ రావడం ఇదే మొదటిసారని ఎంతో గొప్పగా చెప్పారు. 

           రఘువీరాజీ మరీ ఇంత వెటకారం అయితే ఎలాగండి బాబూ! ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ గల్లంతవుతుందని, కనీసం డిపాజిట్లు కూడా రావని సర్వేలన్నీ చెబుతుంటే మీరు మీపార్టీ గురించి గొప్పలు చెప్పుకోవచ్చు కాని మరీ ఇంత ఇదిగా జనాల చెవులలో పూవులు పెట్టకుండా ఏకంగా కాలిప్లవర్ పెడితే ఎలాగండి బాబూ!! 

         మీరే ఇంత ఇదిగా చెబుతుంటే, కొత్తగా వచ్చే ప్రభుత్వం మాదేనని పోటీపడుతున్న వై.యస్.ఆర్.కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇంకెంత గొప్పలు చెప్పాలి. ఏమంటారు?

0 comments:

Post a Comment