CSS Drop Down Menu

Tuesday, April 15, 2014

"టి. డి. పి". లో మొదలైన కొత్త గొడవ ?

                 తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసిన డోర్ పోస్టర్లు కొత్త సమస్యను సృష్టించాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వామిగౌడ్ తన పోస్టర్లలో "పవన్ కల్యాణ్" ఫొటో వేశారు.

      ఇది "జూనియర్ ఎన్టీఆర్" అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.పోస్టర్లలో  "ఎన్టీఆర్" ఫొటో ఎందుకు లేదని? వారు పోస్టర్లను చింపి దగ్ధం చేశారు.పోస్టర్లలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫొటో ఉందని, అలాంటప్పుడు పోస్టర్లను మీరెలా? దగ్ధం చేస్తారంటూ ఈ వ్యవహారాన్ని టిడిపి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ నేపథ్యంలో టిడిపి కార్యకర్తలకు, జూ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య ఘర్షణ తలెత్తింది.

                       అప్పుడే మొదలైన ఈ ప్రచ్చనయుద్ధం రాబోయే రోజులలో ఇంకెలా?  ఉండబోతుందోనని??  ఈ గొడవల వల్ల మన కొంప ఎక్కడ ములుగుతుందోనని??? తెలుగుదేశం వర్గాలు ఆందోళన పడుతున్నాయి!

0 comments:

Post a Comment