CSS Drop Down Menu

Saturday, April 12, 2014

చివరకి బాలయ్యే గెలిచాడు!

నందమూరి కుటుంబం వారి హిందూపురం ఎమ్మేల్యే టిక్కెట్ రేసులో చివరకి బాలకృష్ణకే విజయం దక్కింది. పాపం హరికృష్ణ గారి ఆశలు అడియాసలే అయ్యాయి. ఒక వైపు చూస్తే ఎన్టీఆర్ గారి కుమారులు మరియు బావమర్ధులు, రెండోవైపు చూస్తే తన వియ్యంకుడు మరియు లెజెండ్ సినిమాతో మళ్ళి పుంజుకున్న బాలయ్య. ఇతన్ని ప్రచారానికి తిప్పుకుంటే తెలుగుదేశం పార్టీకి నాలుగు ఓట్లు రాలతాయని ఆశ ఒక వైపు. హరికృష్ణకు గాని సీటిస్తే ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్ కు ఎక్కడ పోటీకి వస్తాడోనని ఒకవైపు. అదే హరికృష్ణకు గాని సీటు ఇవ్వకుపోతే కోపంతో ప్రచారానికి రాకుండా తన సినిమాలకే పరిమితమైపోతాడని దాంతో రాజకీయాలలో తనకు హరికృష్ణ గొడవ, యువ నేతగా ఎదుగుతున్న లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ గొడవ తప్పుతుందని ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనట్టు ఎంతో ఉహాత్మకంగా అడుగులు వేసి చివరకు బాలకృష్ణకే సీటు కేటాయించారు.అవునంటారా? కాదంటారా??  

0 comments:

Post a Comment